భారత దేశంలోని ఏ రాష్ట్రమైనా మద్యం వల్ల వచ్చే భారీ ఆదాయంపై ఆధారపడుతుంది. ఓ రకంగా చెప్పాలంటే సంక్షేమపథకాలకు పెట్టే నిధుల్లో సగానికి పైగా ఆబ్కారీ శాఖ నుంచే వస్తాయి. అందుకే, మద్య నిషేధం వంటి వ్యవహారాల జోలికి వెళ్లడానికి చాలామంది సీఎంలు ఇష్టపడరు. మందుబాబులు కట్టే ట్యాక్స్ విలువ తెలిసిన చాలామంది సీఎంలు…వారిని పల్లెత్తు మాట అనరు. కానీ, మిగతా సీఎంలకు భిన్నంగా మందుబాబులపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ షాకింగ్ కామెంట్లు చేశారు.
మందు తాగే వారందరూ మహా పాపులని, అసలు మద్యం తాగే వాళ్లు భారతీయులే కాదని అసెంబ్లీ సాక్షిగా నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు పెను దుమారం రేపుతున్నాయి. బీహార్లో మద్యపాన నిషేధం కొనసాగుతోన్న నేపథ్యంలో బీహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు- 2022ను కఠినతరం చేస్తూ ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ బిల్లు తాజాగా గవర్నర్ ఆమోదం పొందడంతో ఇకపై మందుకొట్టి మొదటిసారి పట్టుబడితే జరిమానాతో పాటుగా ఒక నెల జైలు శిక్ష తప్పదు. ఈ క్రమంలోనే ఈ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా నితీశ్ షాకింగ్ కామెంట్లు చేశారు.
మహాత్మా గాంధీ కూడా మద్యపానాన్ని వ్యతిరేకించారని, ఆయన సిద్ధాంతాలకు విరుద్ధంగా మద్యం సేవించే వారిని తాను భారతీయులుగా పరిగణించనని నితీశ్ వ్యాఖ్యానించారు. మద్యం సేవించడం హానికరం అని తెలిసిన కొందరు సేవిస్తున్నారని, రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారని అన్నారు. మద్యపానం వల్ల జరిగే పర్యవసానాలకు వారే బాధ్యులని , మందు విషంతో సమానమని తెలిసినా తాగుతున్నారని మండిపడ్డారు. వీరి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, మద్యం తాగి మరణించిన వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోదని తేల్చి చెప్పారు.
బీహార్ లో మద్య నిషేధం అమల్లో ఉన్నప్పటికీ కల్తీ మద్యం, కల్తీ సారాయి విరివిగా దొరుకుతోంది. ఆ మద్యం వల్ల అక్కడ అనేక విషాదకర ఘటనలు జరుగుతున్నాయి. దీంతో, తాజాగా చట్టాలను మరింత కఠినతరం చేశారు. అయితే, నితీశ్ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మద్య నిషేధాన్ని అమలు చేయడంలో నితీశ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
This post was last modified on March 31, 2022 3:12 pm
సామాజిక పింఛన్ల పై పిడుగు పడినట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళ లు.. వంటి సామాజిక పింఛనుపై…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. 2019…
స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…
టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. వీటిని…
పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…