Political News

చ‌రిత్ర‌లోనే తొలిసారి.. 8 మంది ఐఏఎస్‌ల‌కు జైలు శిక్ష‌

దేశ చ‌రిత్ర‌లోనే తొలిసారి.. ఇక‌, న‌వ్యాంధ్ర హిస్ట‌రీలోనే.. ఫ‌స్ట్ టైం.. గ‌తంలో ఎక్క‌డా ఎప్పుడూ.. క‌నీ వినీ ఎరుగ‌ని సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ రాష్ట్రంలోనూ.. జ‌ర‌గ‌ని.. ఏరాష్ట్రంలోనూ.. ఇలాంటి ప‌రిణామం.. ఎదురుకాని ప‌రిస్థితి ఏపీలో ఏర్ప‌డింది. ఒకేసారి.. ఎనిమిది మంది సీనియ‌ర్ ఐఏఎస్‌ల‌కు.. ఏపీ హైకోర్టు జైలు శిక్ష విధించింది. సీనియ‌ర్ ఐఏఎస్ అదికారులు.. విజయ్ కుమార్, శ్యామల రావు, గోపాల కృష్ణ ద్వివేది, బుడితి రాజశేఖర్, శ్రీలక్ష్మీ, గిరిజా శంకర్, వాడ్రేవు చిన వీరభద్రుడు, ఎం ఎం నాయక్ ల వైఖరిని కోర్టు ధిక్కరణగా భావిస్తున్న‌ట్టు రాష్ట్రహైకోర్టు స్ప‌ష్టం  చేసింది.

విష‌యం ఏంటంటే..

ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత‌.. స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌చ్చారు. ఈ క్ర‌మంలో గ్రామ, వార్డు స‌చివాల‌యాల‌ను ఏర్పాటు చేశారు.. ఇది మంచిదే అయినప్ప‌టికీ.. వీటికి సంబంధించిన కార్యాల‌యాల ఏర్పాటులో మాత్రం ప్ర‌బుత్వం ఎక్క‌డా నిబంధ‌న‌లు పాటించ‌లేదు. పాఠ‌శాల‌ల్లో సైతం స‌చివాల‌యాల‌ను ఏర్పాటు చేశారు. దీనిపైఏడాది కింద‌టే ప‌లువురు కోర్టును ఆశ్ర‌యించారు. దీంతో ఆయా అంశాల‌పై విచార‌ణ జ‌రిపిన కోర్టు.. స్కూళ్ల‌లో స‌చివాల‌యాల ఏర్పాటును తిర‌స్క‌రించింది. మూడు మాసాల్లో వాటిని తీసేసి.. పాఠ‌శాల‌ల‌ను కేవ‌లం విద్యార్థుల‌కు మాత్ర‌మే కేటాయించాల‌ని సూచించింది.

అయితే. ఎన్నాళ్లు గ‌డిచినా.. ఈ నిర్ణ‌యంపై అధికారులు చ‌ర్య‌లు తీసుకోలేదు. దీంతో మ‌రోసారి కోర్టులో ధిక్క‌ర‌ణ వ్యాజ్యం ప‌డింది. దీనిని కూడా రెండు ద‌ఫాలుగా విచారించిన కోర్టు గ‌తంలోనే విద్యాశాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీగా ఉన్న బుడితి రాజ‌శేఖ‌ర్‌ను కోర్టుకు పిలిపించి మ‌రీ హెచ్చరించింది. అయిన‌ప్ప‌టికీ.. మార్పు రాలేదు. దీంతో తాజాగా జ‌రిగిన విచార‌ణ‌లో విద్యా వ్య‌వ‌స్థ‌ల‌కు సంబంధించిన అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటూ.. ఆదేశాలు జారీ చేసింది.

కోర్టుకు క్ష‌మాప‌ణ‌లు..

8 మంది ఐఏఎస్‌ల‌కు…రెండు వారాలపాటు హైకోర్టు  జైలు శిక్ష విధించ‌డంతో వారంతా.. కోర్టుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. క్షమాపణలు కోరడంతో జైలు శిక్ష తప్పించిన కోర్టు వారిని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది. సంక్షేమ హాస్టళ్లల్లో ప్రతి నెలలో ఓ రోజు వెళ్లి సేవ చేయాలని ఆదేశించింది. అంతేకాదు.. ఒక రోజు పాటు కోర్టు ఖర్చులు భరించాలని ఐఏఎస్‌లకు హైకోర్టు తెలిపింది. ఇది రోజుకు రూ.5 ల‌క్ష‌ల‌కు పైగానే ఉంద‌ని తెలిసింది. మొత్తానికి ఈ తాజా తీర్పు ప్ర‌భుత్వానికి.. ప్ర‌భుత్వ న‌నిర్ణ‌యాల‌ను గుడ్డిగా అమ‌లు చేస్తున్న అధికారుల‌కు కూడా చెంప‌పెట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 

This post was last modified on March 31, 2022 2:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

SRH: కమిన్స్ లేకుంటే కెప్టెన్ ఎవరు మరీ?

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్…

6 minutes ago

నెల రోజుల గ్యాపులో బాబాయ్ అబ్బాయ్

రెండు పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు పెద్ది వదిలేసుకున్న మార్చి…

1 hour ago

లెజెండ్ పోయాడు… లీడర్ వస్తున్నాడు

నాలుగేళ్ల క్రితం తమిళ హీరోగా మనకూ పరిచయమైన శరవణన్ 'ది లెజెండ్'తో డెబ్యూ చేసి తెరంగేట్రంతోనే ట్రోలింగ్ చవి చూడాల్సి…

2 hours ago

గేమ్ కోసం ఫోన్ ఇవ్వలేదని ముగ్గురు అక్కాచెల్లెళ్ళు…

​ఘజియాబాద్‌లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…

4 hours ago

అల్లరోడి ఆల్కహాల్ అడ్రస్ ఎక్కడ

అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…

5 hours ago

మామతో దళపతి… మాజీ అల్లుడితో ఎమోషనల్ డ్రామా

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కేవలం హీరోయిజం ఉన్న పాత్రలే చేస్తానని ఎప్పుడూ కట్టుబడరు. అందుకే నాలుగు…

5 hours ago