Political News

చంద్రబాబు కోరిక తీర్చిన జగన్

చంద్రబాబునాయుడు కోరికను జగన్మోహన్ రెడ్డి తీర్చేశారు. ఇంతకీ ఆ కోరిక ఏమిటంటే చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ పేరుతో కొత్తగా రెవిన్యు డిజన్ను ఏర్పాటు చేయటం.  ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 13 జిల్లాలను 26 జిల్లాలకు పెంచుతున్నది. ఇందులో భాగంగానే 73 రెవిన్యు డివిజన్లను కూడా కొత్తగా ఏర్పాటుచేసింది.

వీటిల్లో కుప్పం రెవెన్యూ డివిజన్ కూడా ఒకటి. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ మొదలవ్వగానే కుప్పంను రెవెన్యూ డివిజన్ గా చేయాలని చంద్రబాబు ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలని ప్రజలు ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్న విషయం తన లేఖలో చంద్రబాబు ప్రస్తావించారు. ఆ లేఖను, కుప్పం ప్రజల డిమాండ్ ను జగన్ పరిగణలోకి తీసుకుని అధికారులకు అవసరమైన ఆదేశాలిచ్చారు.

దాంతో  6 మండలాలతో కొత్తగా కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటయ్యింది. తమ డిమాండ్ ఇంత తొందరగా ప్రభుత్వం నెరవేర్చుతుందని బహుశా కుప్పం జనాలు కూడా ఊహించుండరు. ఇదేకాదు జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే కుప్పం మేజర్ నగరపంచాయితీని మున్సిపాలిటిగా మార్చిన విషయం తెలిసిందే. మేజర్ పంచాయితీని మున్సిపాలిటీగా మార్చాలని జనాలు ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్నారు.

ప్రజల దీర్ఘకాల డిమాండును దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం రాగానే కుప్పం మేజర్ పంచాయితీని మున్సిపాలిటీగా మర్చేశారు. ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అఖండ మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే. నిజానికి 35 సంవత్సరాలుగా కుప్పం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు జనాల డిమాండ్ కు అనుగుణంగా మేజర్ పంచాయితీని మున్సిపాలిటీగా మర్చుండాలి. అలాగే కుప్పం రెవిన్యు డివిజన్  చేసుండాలి. తన చేతిలో ఉన్న రెండుపనులను చేయకుండా వదిలేయటమే విచిత్రంగా ఉంది. అందుకనే అధికారంలోకి రాగానే జగన్ ప్రజల డిమాండ్ ను వెంటనే నెరవేర్చేశారు.

This post was last modified on March 31, 2022 10:17 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టుల మనసు దోచుకున్న కవిత

దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ…

40 minutes ago

శభాష్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నిజమేనండోయ్...కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన…

4 hours ago

రావణుడిని అంత గొప్పగా చూపించగలరా

ఇటీవలే విడుదలైన రామాయణ పార్ట్ 1 టీజర్ మీద మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ఫీడ్…

4 hours ago

బ్రేకింగ్: లిక్కర్ కేసులో ఏ1 రాజ్ కేసిరెడ్డికి బెయిల్

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు…

4 hours ago

డెకాయిట్ అంచనాల మీటర్ ఎలా ఉంది

ఇంకో మూడు రోజుల్లో డెకాయిట్ థియేటర్లలో అడుగు పెట్టేస్తాడు. హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. టికెట్ల…

4 hours ago

ఈసీని విపక్షాలు ఏం చెయ్యలేవా?

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్.. జ్ఞానేష్ కుమార్ సేఫ్ అయ్యారు. ఆయ‌న‌పై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విప‌క్షాలు ఇచ్చిన…

5 hours ago