Political News

చంద్రబాబు కోరిక తీర్చిన జగన్

చంద్రబాబునాయుడు కోరికను జగన్మోహన్ రెడ్డి తీర్చేశారు. ఇంతకీ ఆ కోరిక ఏమిటంటే చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ పేరుతో కొత్తగా రెవిన్యు డిజన్ను ఏర్పాటు చేయటం.  ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 13 జిల్లాలను 26 జిల్లాలకు పెంచుతున్నది. ఇందులో భాగంగానే 73 రెవిన్యు డివిజన్లను కూడా కొత్తగా ఏర్పాటుచేసింది.

వీటిల్లో కుప్పం రెవెన్యూ డివిజన్ కూడా ఒకటి. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ మొదలవ్వగానే కుప్పంను రెవెన్యూ డివిజన్ గా చేయాలని చంద్రబాబు ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలని ప్రజలు ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్న విషయం తన లేఖలో చంద్రబాబు ప్రస్తావించారు. ఆ లేఖను, కుప్పం ప్రజల డిమాండ్ ను జగన్ పరిగణలోకి తీసుకుని అధికారులకు అవసరమైన ఆదేశాలిచ్చారు.

దాంతో  6 మండలాలతో కొత్తగా కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటయ్యింది. తమ డిమాండ్ ఇంత తొందరగా ప్రభుత్వం నెరవేర్చుతుందని బహుశా కుప్పం జనాలు కూడా ఊహించుండరు. ఇదేకాదు జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే కుప్పం మేజర్ నగరపంచాయితీని మున్సిపాలిటిగా మార్చిన విషయం తెలిసిందే. మేజర్ పంచాయితీని మున్సిపాలిటీగా మార్చాలని జనాలు ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్నారు.

ప్రజల దీర్ఘకాల డిమాండును దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం రాగానే కుప్పం మేజర్ పంచాయితీని మున్సిపాలిటీగా మర్చేశారు. ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అఖండ మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే. నిజానికి 35 సంవత్సరాలుగా కుప్పం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు జనాల డిమాండ్ కు అనుగుణంగా మేజర్ పంచాయితీని మున్సిపాలిటీగా మర్చుండాలి. అలాగే కుప్పం రెవిన్యు డివిజన్  చేసుండాలి. తన చేతిలో ఉన్న రెండుపనులను చేయకుండా వదిలేయటమే విచిత్రంగా ఉంది. అందుకనే అధికారంలోకి రాగానే జగన్ ప్రజల డిమాండ్ ను వెంటనే నెరవేర్చేశారు.

This post was last modified on March 31, 2022 10:17 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

విజయమ్మ లాజిక్ తో జగన్ కు కఫ్టమే

వైైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన కన్న తల్లి విజయమ్మ నుంచే భారీ…

15 minutes ago

రెడ్ బుక్ వ‌ద‌ల‌: మ‌రోసారి లోకేష్ స్ప‌ష్టం

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం ప‌నిచేస్తోంద‌ని ఆరోపించిన కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే టీడీపీ యువ‌నాయ‌కుడు,…

1 hour ago

క్రేజీ దర్శకుడు హీరో అయితే ఎలా

సౌత్ దర్శకుల్లో రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ తర్వాత అంతకన్నా తక్కువో ఎక్కువో స్టార్ డం తెచ్చుకున్న వాళ్లలో లోకేష్ కనగరాజ్…

5 hours ago

కబుర్లన్నీ చెప్పి ఇదేంటి అమీర్ సాబ్

ఇటీవలే జరిగిన ఒక ఈవెంట్ లో అమీర్ ఖాన్ మాట్లాడుతూ థియేటర్ ఓటిటి మధ్య ఇప్పుడున్న గ్యాప్ సరిపోదని నాలుగు…

8 hours ago

ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు – జగన్

రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల ఇంచార్జ్‌లను మార్చనున్నట్లు వైసీపీ అధినేత జగన్ చెప్పారు. అయితే దీనికి కొంత సమయం పడుతుందన్నారు.…

11 hours ago

థ్యాంక్స్ మోదీజీ: మధుసూదన్ భార్య కామాక్షి!

పహల్ గాం ఉగ్రవాద దాడి తదనంతర పరిణామాల్లో భాగంగా మంగళవార తెల్లవారుజామున భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ భూభాగంలోని ఆ దేశ…

12 hours ago