ఏపీలో అన్నీ కొత్తకత్తగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏప్రిల్ నుంచి కీలకమైన కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకటి.. మంత్రి వర్గ మార్పు, రెండు.. కొత్త జిల్లాల ఏర్పాటు. మూడు.. అధికార పార్టీలో.. కీలక మార్పులు వంటివి ఏప్రిల్లోనే చోటు చేసుకోనున్నాయి. ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే కార్యాచరణ కూడా పూర్తయింది. దీనిని ఉగాది రోజు ప్రకటిస్తారని.. తెలుస్తోంది. అదేవిధంగా.. ఉగాది మరుసటి రోజు నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు షురూ కానుంది. పాలనకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 4వ తేదీ నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించనున్నారు. ఇక, ఇదే నెలలో కీలక మార్పు చోటు చేసుకోనుంది. మంత్రివర్గ ప్రక్షాళన చేయనుంది. మొత్తం మంత్రి వర్గాన్ని మారు స్తారని… తెలుస్తోంది. ఇది కూడా ఏప్రిల్ నెలలో చోటు చేసుకునే ఒక సంచలన మార్పు. తద్వారా.. వైసీపీ ప్రభు త్వం కీలకమైన మార్పు దిశగా అడుగులు వేయనుంది. ఇదిలావుంటే.. పార్టీలోనూ ఇదే నెలలో కీలక మార్పులు జరగనున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయం తర్వాత… ఆయా జిల్లాల్లో ఇంచార్జ్లను నియమించనున్నారు.
ఇది వైసీపీలో ఒక కీలక ఘట్టంగా మారనుందని అంటున్నారు. అదేవిధంగా ఏప్రిల్లోనే రచ్చబండ కార్య క్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఎప్పటి నుంచో నిర్వహించా లని భావిస్తున్నా.. ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. అయితే..ఈ నెలలోనే.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని.. సీఎం జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక, మరోముఖ్యమైన కార్యక్రమానికి కూడా ఈ నెలలోనే ప్రారంభం చేయనున్నట్టు తెలుస్తోంది.
అదే.. జగనన్న టౌన్ షిప్లు. గత నెలలోనే దీనికి సంబంధించిన ముసాయిదా ఇచ్చినా.. అధికారికంగా.. దీనినిప్రారంభించలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే.. కొన్ని జిల్లాల్లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టుకు పునాది రాయి వేసి.. ప్రారంభించేలా..ఏప్రిల్లో నే చర్యలు తీసుకుంటున్నారు. మధ్య తరగతి వర్గాలకు.. దీనిని చేరువ చేయాలని భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. ఏపీలో ఏప్రిల్ మార్పులు భారీగానే చోటు చేసుకుంటాయని తెలుస్తోంది.
This post was last modified on March 31, 2022 7:45 am
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…