Political News

అన్నీ కొత్త కొత్త‌గా.. ఏపీలో `ఏప్రిల్ మార్పులు`!

ఏపీలో అన్నీ కొత్త‌క‌త్త‌గా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏప్రిల్ నుంచి కీల‌క‌మైన కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక‌టి.. మంత్రి వ‌ర్గ మార్పు, రెండు.. కొత్త జిల్లాల ఏర్పాటు. మూడు.. అధికార పార్టీలో.. కీల‌క మార్పులు వంటివి ఏప్రిల్‌లోనే చోటు చేసుకోనున్నాయి. ఇప్ప‌టికే కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఇప్ప‌టికే కార్యాచ‌ర‌ణ కూడా పూర్త‌యింది. దీనిని ఉగాది రోజు ప్ర‌క‌టిస్తార‌ని.. తెలుస్తోంది. అదేవిధంగా.. ఉగాది మ‌రుస‌టి రోజు నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు షురూ కానుంది. పాల‌న‌కు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్త‌య్యాయి.

ఈ నేప‌థ్యంలో ఏప్రిల్ 4వ తేదీ నుంచి కొత్త జిల్లాల్లో పాల‌న ప్రారంభించ‌నున్నారు. ఇక‌, ఇదే నెలలో కీల‌క మార్పు చోటు చేసుకోనుంది. మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళ‌న చేయ‌నుంది. మొత్తం మంత్రి వ‌ర్గాన్ని మారు స్తార‌ని… తెలుస్తోంది. ఇది కూడా ఏప్రిల్ నెల‌లో చోటు చేసుకునే ఒక సంచ‌ల‌న మార్పు. త‌ద్వారా.. వైసీపీ ప్రభు త్వం కీల‌క‌మైన మార్పు దిశ‌గా అడుగులు వేయనుంది. ఇదిలావుంటే.. పార్టీలోనూ ఇదే నెల‌లో కీల‌క మార్పులు జ‌ర‌గ‌నున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన నిర్ణ‌యం త‌ర్వాత‌… ఆయా జిల్లాల్లో ఇంచార్జ్‌ల‌ను నియ‌మించ‌నున్నారు.

ఇది వైసీపీలో ఒక కీల‌క ఘ‌ట్టంగా మార‌నుంద‌ని అంటున్నారు. అదేవిధంగా ఏప్రిల్‌లోనే ర‌చ్చ‌బండ కార్య క్ర‌మానికి సీఎం జ‌గ‌న్ శ్రీకారం చుట్ట‌నున్న‌ట్టు తెలుస్తోంది.  ఈ కార్య‌క్ర‌మాన్ని ఎప్ప‌టి నుంచో నిర్వ‌హించా ల‌ని భావిస్తున్నా.. ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. అయితే..ఈ నెల‌లోనే.. ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని.. సీఎం జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక‌, మ‌రోముఖ్య‌మైన కార్య‌క్ర‌మానికి కూడా ఈ నెల‌లోనే ప్రారంభం చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

అదే.. జ‌గ‌న‌న్న టౌన్ షిప్‌లు. గ‌త నెల‌లోనే దీనికి సంబంధించిన ముసాయిదా ఇచ్చినా.. అధికారికంగా.. దీనినిప్రారంభించ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే.. కొన్ని జిల్లాల్లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టుకు పునాది రాయి వేసి.. ప్రారంభించేలా..ఏప్రిల్‌లో నే చ‌ర్యలు తీసుకుంటున్నారు. మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు.. దీనిని చేరువ చేయాల‌ని భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. ఏపీలో ఏప్రిల్ మార్పులు భారీగానే చోటు చేసుకుంటాయ‌ని తెలుస్తోంది. 

This post was last modified on March 31, 2022 7:45 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

19 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

26 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

56 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago