ఏపీలో అన్నీ కొత్తకత్తగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏప్రిల్ నుంచి కీలకమైన కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకటి.. మంత్రి వర్గ మార్పు, రెండు.. కొత్త జిల్లాల ఏర్పాటు. మూడు.. అధికార పార్టీలో.. కీలక మార్పులు వంటివి ఏప్రిల్లోనే చోటు చేసుకోనున్నాయి. ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే కార్యాచరణ కూడా పూర్తయింది. దీనిని ఉగాది రోజు ప్రకటిస్తారని.. తెలుస్తోంది. అదేవిధంగా.. ఉగాది మరుసటి రోజు నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు షురూ కానుంది. పాలనకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 4వ తేదీ నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించనున్నారు. ఇక, ఇదే నెలలో కీలక మార్పు చోటు చేసుకోనుంది. మంత్రివర్గ ప్రక్షాళన చేయనుంది. మొత్తం మంత్రి వర్గాన్ని మారు స్తారని… తెలుస్తోంది. ఇది కూడా ఏప్రిల్ నెలలో చోటు చేసుకునే ఒక సంచలన మార్పు. తద్వారా.. వైసీపీ ప్రభు త్వం కీలకమైన మార్పు దిశగా అడుగులు వేయనుంది. ఇదిలావుంటే.. పార్టీలోనూ ఇదే నెలలో కీలక మార్పులు జరగనున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయం తర్వాత… ఆయా జిల్లాల్లో ఇంచార్జ్లను నియమించనున్నారు.
ఇది వైసీపీలో ఒక కీలక ఘట్టంగా మారనుందని అంటున్నారు. అదేవిధంగా ఏప్రిల్లోనే రచ్చబండ కార్య క్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఎప్పటి నుంచో నిర్వహించా లని భావిస్తున్నా.. ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. అయితే..ఈ నెలలోనే.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని.. సీఎం జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక, మరోముఖ్యమైన కార్యక్రమానికి కూడా ఈ నెలలోనే ప్రారంభం చేయనున్నట్టు తెలుస్తోంది.
అదే.. జగనన్న టౌన్ షిప్లు. గత నెలలోనే దీనికి సంబంధించిన ముసాయిదా ఇచ్చినా.. అధికారికంగా.. దీనినిప్రారంభించలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే.. కొన్ని జిల్లాల్లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టుకు పునాది రాయి వేసి.. ప్రారంభించేలా..ఏప్రిల్లో నే చర్యలు తీసుకుంటున్నారు. మధ్య తరగతి వర్గాలకు.. దీనిని చేరువ చేయాలని భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. ఏపీలో ఏప్రిల్ మార్పులు భారీగానే చోటు చేసుకుంటాయని తెలుస్తోంది.
This post was last modified on March 31, 2022 7:45 am
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…