ఏపీలో అన్నీ కొత్తకత్తగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏప్రిల్ నుంచి కీలకమైన కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకటి.. మంత్రి వర్గ మార్పు, రెండు.. కొత్త జిల్లాల ఏర్పాటు. మూడు.. అధికార పార్టీలో.. కీలక మార్పులు వంటివి ఏప్రిల్లోనే చోటు చేసుకోనున్నాయి. ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే కార్యాచరణ కూడా పూర్తయింది. దీనిని ఉగాది రోజు ప్రకటిస్తారని.. తెలుస్తోంది. అదేవిధంగా.. ఉగాది మరుసటి రోజు నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు షురూ కానుంది. పాలనకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 4వ తేదీ నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించనున్నారు. ఇక, ఇదే నెలలో కీలక మార్పు చోటు చేసుకోనుంది. మంత్రివర్గ ప్రక్షాళన చేయనుంది. మొత్తం మంత్రి వర్గాన్ని మారు స్తారని… తెలుస్తోంది. ఇది కూడా ఏప్రిల్ నెలలో చోటు చేసుకునే ఒక సంచలన మార్పు. తద్వారా.. వైసీపీ ప్రభు త్వం కీలకమైన మార్పు దిశగా అడుగులు వేయనుంది. ఇదిలావుంటే.. పార్టీలోనూ ఇదే నెలలో కీలక మార్పులు జరగనున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయం తర్వాత… ఆయా జిల్లాల్లో ఇంచార్జ్లను నియమించనున్నారు.
ఇది వైసీపీలో ఒక కీలక ఘట్టంగా మారనుందని అంటున్నారు. అదేవిధంగా ఏప్రిల్లోనే రచ్చబండ కార్య క్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఎప్పటి నుంచో నిర్వహించా లని భావిస్తున్నా.. ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. అయితే..ఈ నెలలోనే.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని.. సీఎం జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక, మరోముఖ్యమైన కార్యక్రమానికి కూడా ఈ నెలలోనే ప్రారంభం చేయనున్నట్టు తెలుస్తోంది.
అదే.. జగనన్న టౌన్ షిప్లు. గత నెలలోనే దీనికి సంబంధించిన ముసాయిదా ఇచ్చినా.. అధికారికంగా.. దీనినిప్రారంభించలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే.. కొన్ని జిల్లాల్లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టుకు పునాది రాయి వేసి.. ప్రారంభించేలా..ఏప్రిల్లో నే చర్యలు తీసుకుంటున్నారు. మధ్య తరగతి వర్గాలకు.. దీనిని చేరువ చేయాలని భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. ఏపీలో ఏప్రిల్ మార్పులు భారీగానే చోటు చేసుకుంటాయని తెలుస్తోంది.
టాలీవుడ్ అగ్ర నిర్మాత సి అశ్వినీదత్ ఇవాళ ఎమోషనల్ అయ్యారు. సింగ్ గీతం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…
జెన్ జీ యుగంలో యువత ఎక్కడికి పోతోందో?… ఏమేం చేస్తుందోనన్న విషయాలపై అంతు చిక్కడం లేదని చెప్పాలి. ఏదో ఒక…
లోక నాయకుడు కమల్ హాసన్ చాలా సందర్భాల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. భవిషత్తుని కూడా చక్కగా అంచనా వేస్తారు. విశ్వరూపం…
హఠాత్తుగా ఇరుముడి విడుదల తేదీ ప్రకటించేశారు. ఆగస్ట్ 21 థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా…
సోషల్ మీడియా టాక్స్, యూట్యూబ్ రివ్యూల హడావిడి ఎలా ఉన్నా పెద్ది బలంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న వైనం స్పష్టం.…
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కీలకమైన నియోజకవర్గం గుడివాడ రాజకీయాలు వేడెక్కాయి. గత రెండేళ్ల పాల నలో తాను చేసిన అభివృద్ధిని చూపించేందుకు..…