Political News

40 వ‌సంతాల వేడుక‌.. బాబు చేసిన దిశానిర్దేశం ఏంటి?

తెలుగు వారి ఆత్మ‌గౌర‌వ నినాదంతో ఏర్ప‌డిన తెలుగు దేశం పార్టీకి 40 ఏళ్లు పూర్త‌య్యాయి. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలోనూ.. దేశ విదేశాల్లోనూ.. పార్టీ అభిమానులు.. నాయ‌కులు పెద్ద ఎత్తున సంబ‌రాలు చేసుకున్నా రు. ఇక‌, హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్‌లో భారీ ఎత్తున నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో అనేక మంది నాయ‌కులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యులు కూడా పాల్గొన్నారు. అయితే. ఈ సంద‌ర్భంగా పార్టీ అభిమానులు.. నాయ‌కులు.. ముఖ్యంగా అప్ క‌మింగ్ నేత‌లు.. చాలానే ఎక్స్‌పెక్ట్ చేశారు.

ఎందుకంటే.. 40 ఏళ్ల పార్టీ.. మ‌రో 40 ఏళ్ల‌పాటు.. పార్టీని న‌డిపించ‌డంపై ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతుంద‌నేది ఆస‌క్తిగా మారింది. అయితే.. ఈ సంద‌ర్భంగా అటు చంద్ర‌బాబు కానీ, ఆయ‌న కుమారు డు.. లోకేష్‌కానీ..చేసిన ప్ర‌సంగాల‌పై పార్టీలో కొంద‌రు పెద‌వి విరుస్తున్నారు. రాజ‌కీయాల‌కు వేదిక‌గా.. మార‌డంపై ఒకింత నొచ్చుకుంటున్నారు. రాజ‌కీయాలు ఉండాల్సిందే కానీ.. ఆవిర్భావ స‌మ‌యంలో మున్ముందు కార్యాచ‌ర‌ణ ఏంటి? అనేవి ప్ర‌స్తావించ‌లేద‌ని.. కొంద‌రు అంటున్నారు.

మ‌రీ ముఖ్యంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాంటి వ్యూహాల‌తో మనం ముందుకు వెళ్లాలి.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప‌రిణామాల‌పై ఆత్మ శోధ‌న వంటివాటిని ఎక్స్‌పెక్ట్ చేసిన వారు.. నిరాశ వ్య‌క్తం చేశారు.  అయితే.. ఒక విష‌యంలో మాత్రం చంద్ర‌బాబు క్లారిటీ ఇచ్చార‌ని.. సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. అదే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 40 శాతం మంది యువ‌త‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం. ఇది ఒక్క‌టి ఆశించిన ప‌రిణామంగా చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ప‌ర‌నింద‌కే ప్రాధాన్యం ఇవ్వ‌డం..ఆసాంతం స‌భ అంతా.. జ‌గ‌న్ కోసమో.. వైసీపీ పాల‌న‌కోసమో.. నిర్వ‌హించిన‌ట్టుగా ఉంద‌నేవారు కూడా ఉన్నారు.

అటు చంద్ర‌బాబు కానీ, ఇటు లోకేష్‌బాబు కానీ.. త‌మ త‌మ ప్రసంగాల‌ను మొత్తంగా.. జ‌గ‌న్ పాల‌న చుట్టూనే తిప్పారు.. కానీ.. ఇన్నేళ్ల‌లో పార్టీ న‌డిచిన విధానాన్ని మ‌రింత వివ‌రించి ఉంటే… బాగుండేద‌ని.. వ‌చ్చే రోజుల్లో అందునా.. వ‌చ్చే 40 ఏళ్ల‌పాటు.. పార్టీని ఎలా ముందుకు న‌డిపిస్తార‌నే విష‌యాన్ని కూడా స్ప‌ష్టం చేసి ఉంటే.. బాగుండేద‌ని.. అంటున్నారు. దిశానిర్దేశం మ‌రింత పెర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. అంటున్నారు. అదేస‌మ‌యంలో క్షేత్ర‌స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేసేందుకు క‌మిటీలను, బూత్ స్థాయి క‌మిటీల విష‌యాన్ని.. తేల్చాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు. ఇవ‌న్నీ.. వ‌దిలేసి.. కేవ‌లం ప‌ర‌నింద‌కే ప‌రిమితం అయిన‌ట్టుగా.. ఉంద‌ని.. గుస‌గుస వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. 

Satya

Recent Posts

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

18 minutes ago

పవన్ చెప్పిందేమిటి?… వీరు చేస్తున్నదేమిటీ?

రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…

45 minutes ago

దీవానా సమస్య సెన్సార్ మాత్రమేనా

మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…

57 minutes ago

రీ-నీట్… ఇంత చేసినా మళ్లీ సందేహాలు, ప్రశ్నలు!?

రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…

2 hours ago

పుట్టినరోజు సంబరం… జన నాయకుడి మౌనం

ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల…

2 hours ago

రజినీకి నచ్చనిది కమల్‌కు నచ్చిందా?

తమిళ సినిమాలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించిన సూపర్ స్టార్లు రజినీకాంత్. కమల్ హాసన్ వ్యక్తిగతంగా మంచి మిత్రులన్న సంగతి…

3 hours ago