Political News

40 వ‌సంతాల వేడుక‌.. బాబు చేసిన దిశానిర్దేశం ఏంటి?

తెలుగు వారి ఆత్మ‌గౌర‌వ నినాదంతో ఏర్ప‌డిన తెలుగు దేశం పార్టీకి 40 ఏళ్లు పూర్త‌య్యాయి. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలోనూ.. దేశ విదేశాల్లోనూ.. పార్టీ అభిమానులు.. నాయ‌కులు పెద్ద ఎత్తున సంబ‌రాలు చేసుకున్నా రు. ఇక‌, హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్‌లో భారీ ఎత్తున నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో అనేక మంది నాయ‌కులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యులు కూడా పాల్గొన్నారు. అయితే. ఈ సంద‌ర్భంగా పార్టీ అభిమానులు.. నాయ‌కులు.. ముఖ్యంగా అప్ క‌మింగ్ నేత‌లు.. చాలానే ఎక్స్‌పెక్ట్ చేశారు.

ఎందుకంటే.. 40 ఏళ్ల పార్టీ.. మ‌రో 40 ఏళ్ల‌పాటు.. పార్టీని న‌డిపించ‌డంపై ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతుంద‌నేది ఆస‌క్తిగా మారింది. అయితే.. ఈ సంద‌ర్భంగా అటు చంద్ర‌బాబు కానీ, ఆయ‌న కుమారు డు.. లోకేష్‌కానీ..చేసిన ప్ర‌సంగాల‌పై పార్టీలో కొంద‌రు పెద‌వి విరుస్తున్నారు. రాజ‌కీయాల‌కు వేదిక‌గా.. మార‌డంపై ఒకింత నొచ్చుకుంటున్నారు. రాజ‌కీయాలు ఉండాల్సిందే కానీ.. ఆవిర్భావ స‌మ‌యంలో మున్ముందు కార్యాచ‌ర‌ణ ఏంటి? అనేవి ప్ర‌స్తావించ‌లేద‌ని.. కొంద‌రు అంటున్నారు.

మ‌రీ ముఖ్యంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాంటి వ్యూహాల‌తో మనం ముందుకు వెళ్లాలి.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప‌రిణామాల‌పై ఆత్మ శోధ‌న వంటివాటిని ఎక్స్‌పెక్ట్ చేసిన వారు.. నిరాశ వ్య‌క్తం చేశారు.  అయితే.. ఒక విష‌యంలో మాత్రం చంద్ర‌బాబు క్లారిటీ ఇచ్చార‌ని.. సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. అదే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 40 శాతం మంది యువ‌త‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం. ఇది ఒక్క‌టి ఆశించిన ప‌రిణామంగా చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ప‌ర‌నింద‌కే ప్రాధాన్యం ఇవ్వ‌డం..ఆసాంతం స‌భ అంతా.. జ‌గ‌న్ కోసమో.. వైసీపీ పాల‌న‌కోసమో.. నిర్వ‌హించిన‌ట్టుగా ఉంద‌నేవారు కూడా ఉన్నారు.

అటు చంద్ర‌బాబు కానీ, ఇటు లోకేష్‌బాబు కానీ.. త‌మ త‌మ ప్రసంగాల‌ను మొత్తంగా.. జ‌గ‌న్ పాల‌న చుట్టూనే తిప్పారు.. కానీ.. ఇన్నేళ్ల‌లో పార్టీ న‌డిచిన విధానాన్ని మ‌రింత వివ‌రించి ఉంటే… బాగుండేద‌ని.. వ‌చ్చే రోజుల్లో అందునా.. వ‌చ్చే 40 ఏళ్ల‌పాటు.. పార్టీని ఎలా ముందుకు న‌డిపిస్తార‌నే విష‌యాన్ని కూడా స్ప‌ష్టం చేసి ఉంటే.. బాగుండేద‌ని.. అంటున్నారు. దిశానిర్దేశం మ‌రింత పెర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. అంటున్నారు. అదేస‌మ‌యంలో క్షేత్ర‌స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేసేందుకు క‌మిటీలను, బూత్ స్థాయి క‌మిటీల విష‌యాన్ని.. తేల్చాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు. ఇవ‌న్నీ.. వ‌దిలేసి.. కేవ‌లం ప‌ర‌నింద‌కే ప‌రిమితం అయిన‌ట్టుగా.. ఉంద‌ని.. గుస‌గుస వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. 

This post was last modified on March 30, 2022 6:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మదగజరాజ ఇక్కడ దొరికిపోయాడు

పన్నెండు సంవత్సరాల తర్వాత విడుదలైనా తమిళంలో ఊహించని వసూళ్లతో అరవై కోట్లకు పైగా తెచ్చిన మదగజరాజ పద్దెనిమిది రోజుల తర్వాత…

5 minutes ago

అప్పుల‌ బాట‌లోనే కేంద్రం.. ఈ ఏడాది 11 ల‌క్ష‌ల కోట్లు!

రాష్ట్రాలే కాదు.. కేంద్ర ప్ర‌బుత్వం కూడా అప్పులు చేయ‌క త‌ప్ప‌డం లేద‌న్న విష‌యం స్ప‌ష్ట‌మైంది. తాజాగా ప్ర‌వేశ పెట్టిన కేంద్ర…

1 hour ago

కియారా అద్వాని….ఏంటీ కహాని ?

బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ తెలుగులో సినిమాల్లో ఒక్క భరత్ అనే నేను మాత్రమే హిట్టయ్యింది. రామ్ చరణ్ తో…

2 hours ago

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి దక్కిందేంటి…?

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటులో నూతన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి…

2 hours ago

అమెరికా దుర్ఘ‌ట‌న‌: భ‌ర్త‌కు మెసేజ్‌.. ఇంత‌లోనే ఘోరం

ముచ్చ‌టైన జంట‌. ప్రేమించుకున్నారు. పెద్ద‌ల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. భార్యా భ‌ర్త ఇరువురూ ఉద్యోగాలు చేసుకుంటూ.. ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు.…

2 hours ago

నెలకు లక్ష జీతమా.. అయితే పన్ను కట్టక్కర్లేద్దు

అంతా అనుకున్నట్లుగా మధ్య తరగతికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీపి కబురు చెప్పారు. శనివారం 2025-26…

3 hours ago