Political News

40 వ‌సంతాల వేడుక‌.. బాబు చేసిన దిశానిర్దేశం ఏంటి?

తెలుగు వారి ఆత్మ‌గౌర‌వ నినాదంతో ఏర్ప‌డిన తెలుగు దేశం పార్టీకి 40 ఏళ్లు పూర్త‌య్యాయి. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలోనూ.. దేశ విదేశాల్లోనూ.. పార్టీ అభిమానులు.. నాయ‌కులు పెద్ద ఎత్తున సంబ‌రాలు చేసుకున్నా రు. ఇక‌, హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్‌లో భారీ ఎత్తున నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో అనేక మంది నాయ‌కులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యులు కూడా పాల్గొన్నారు. అయితే. ఈ సంద‌ర్భంగా పార్టీ అభిమానులు.. నాయ‌కులు.. ముఖ్యంగా అప్ క‌మింగ్ నేత‌లు.. చాలానే ఎక్స్‌పెక్ట్ చేశారు.

ఎందుకంటే.. 40 ఏళ్ల పార్టీ.. మ‌రో 40 ఏళ్ల‌పాటు.. పార్టీని న‌డిపించ‌డంపై ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతుంద‌నేది ఆస‌క్తిగా మారింది. అయితే.. ఈ సంద‌ర్భంగా అటు చంద్ర‌బాబు కానీ, ఆయ‌న కుమారు డు.. లోకేష్‌కానీ..చేసిన ప్ర‌సంగాల‌పై పార్టీలో కొంద‌రు పెద‌వి విరుస్తున్నారు. రాజ‌కీయాల‌కు వేదిక‌గా.. మార‌డంపై ఒకింత నొచ్చుకుంటున్నారు. రాజ‌కీయాలు ఉండాల్సిందే కానీ.. ఆవిర్భావ స‌మ‌యంలో మున్ముందు కార్యాచ‌ర‌ణ ఏంటి? అనేవి ప్ర‌స్తావించ‌లేద‌ని.. కొంద‌రు అంటున్నారు.

మ‌రీ ముఖ్యంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాంటి వ్యూహాల‌తో మనం ముందుకు వెళ్లాలి.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప‌రిణామాల‌పై ఆత్మ శోధ‌న వంటివాటిని ఎక్స్‌పెక్ట్ చేసిన వారు.. నిరాశ వ్య‌క్తం చేశారు.  అయితే.. ఒక విష‌యంలో మాత్రం చంద్ర‌బాబు క్లారిటీ ఇచ్చార‌ని.. సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. అదే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 40 శాతం మంది యువ‌త‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం. ఇది ఒక్క‌టి ఆశించిన ప‌రిణామంగా చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ప‌ర‌నింద‌కే ప్రాధాన్యం ఇవ్వ‌డం..ఆసాంతం స‌భ అంతా.. జ‌గ‌న్ కోసమో.. వైసీపీ పాల‌న‌కోసమో.. నిర్వ‌హించిన‌ట్టుగా ఉంద‌నేవారు కూడా ఉన్నారు.

అటు చంద్ర‌బాబు కానీ, ఇటు లోకేష్‌బాబు కానీ.. త‌మ త‌మ ప్రసంగాల‌ను మొత్తంగా.. జ‌గ‌న్ పాల‌న చుట్టూనే తిప్పారు.. కానీ.. ఇన్నేళ్ల‌లో పార్టీ న‌డిచిన విధానాన్ని మ‌రింత వివ‌రించి ఉంటే… బాగుండేద‌ని.. వ‌చ్చే రోజుల్లో అందునా.. వ‌చ్చే 40 ఏళ్ల‌పాటు.. పార్టీని ఎలా ముందుకు న‌డిపిస్తార‌నే విష‌యాన్ని కూడా స్ప‌ష్టం చేసి ఉంటే.. బాగుండేద‌ని.. అంటున్నారు. దిశానిర్దేశం మ‌రింత పెర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. అంటున్నారు. అదేస‌మ‌యంలో క్షేత్ర‌స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేసేందుకు క‌మిటీలను, బూత్ స్థాయి క‌మిటీల విష‌యాన్ని.. తేల్చాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు. ఇవ‌న్నీ.. వ‌దిలేసి.. కేవ‌లం ప‌ర‌నింద‌కే ప‌రిమితం అయిన‌ట్టుగా.. ఉంద‌ని.. గుస‌గుస వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. 

This post was last modified on March 30, 2022 6:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

1 hour ago

అన్నీ కారుణ్యాలే అయితే ప్రతిభావంతులు ఏం చెయ్యాలి?

రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…

3 hours ago

30 కోట్ల‌తో సీనియ‌ర్ నిర్మాత సాహ‌సం

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో సుదీర్ఘ కాలంగా నిర్మాత‌గా ఉన్నారు చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు. 90వ ద‌శ‌కంలోనే దివంగ‌త న‌టుడు శోభ‌న్ బాబు…

3 hours ago

రౌడీ కోసం నాని వస్తే… అంత విశేషమా?

ఒక స్టార్ హీరో సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంటేనో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్ ఏర్పాాటు చేస్తేనో.. ఇంకో స్టార్ హీరో…

5 hours ago

తమిళంలో అదరగొట్టిన చంద్రబాబు

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళ భాషలో మాట్లాడి అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. కోయంబత్తూరులో…

5 hours ago

ధనుష్ కూడా ఇలా చేస్తే ఎలా?

పెద్ద బ్యాగ్రౌండ్ లేకపోయినా.. చాలా కష్టపడి స్టార్‌గా ఎదిగిన నటుడు ధనుష్. అతణ్ని చూడగానే సాధారణ మధ్యతరగతి మనిషిలానే అనిపిస్తుంది…

11 hours ago