Political News

40 వ‌సంతాల వేడుక‌.. బాబు చేసిన దిశానిర్దేశం ఏంటి?

తెలుగు వారి ఆత్మ‌గౌర‌వ నినాదంతో ఏర్ప‌డిన తెలుగు దేశం పార్టీకి 40 ఏళ్లు పూర్త‌య్యాయి. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలోనూ.. దేశ విదేశాల్లోనూ.. పార్టీ అభిమానులు.. నాయ‌కులు పెద్ద ఎత్తున సంబ‌రాలు చేసుకున్నా రు. ఇక‌, హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్‌లో భారీ ఎత్తున నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో అనేక మంది నాయ‌కులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యులు కూడా పాల్గొన్నారు. అయితే. ఈ సంద‌ర్భంగా పార్టీ అభిమానులు.. నాయ‌కులు.. ముఖ్యంగా అప్ క‌మింగ్ నేత‌లు.. చాలానే ఎక్స్‌పెక్ట్ చేశారు.

ఎందుకంటే.. 40 ఏళ్ల పార్టీ.. మ‌రో 40 ఏళ్ల‌పాటు.. పార్టీని న‌డిపించ‌డంపై ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతుంద‌నేది ఆస‌క్తిగా మారింది. అయితే.. ఈ సంద‌ర్భంగా అటు చంద్ర‌బాబు కానీ, ఆయ‌న కుమారు డు.. లోకేష్‌కానీ..చేసిన ప్ర‌సంగాల‌పై పార్టీలో కొంద‌రు పెద‌వి విరుస్తున్నారు. రాజ‌కీయాల‌కు వేదిక‌గా.. మార‌డంపై ఒకింత నొచ్చుకుంటున్నారు. రాజ‌కీయాలు ఉండాల్సిందే కానీ.. ఆవిర్భావ స‌మ‌యంలో మున్ముందు కార్యాచ‌ర‌ణ ఏంటి? అనేవి ప్ర‌స్తావించ‌లేద‌ని.. కొంద‌రు అంటున్నారు.

మ‌రీ ముఖ్యంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాంటి వ్యూహాల‌తో మనం ముందుకు వెళ్లాలి.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప‌రిణామాల‌పై ఆత్మ శోధ‌న వంటివాటిని ఎక్స్‌పెక్ట్ చేసిన వారు.. నిరాశ వ్య‌క్తం చేశారు.  అయితే.. ఒక విష‌యంలో మాత్రం చంద్ర‌బాబు క్లారిటీ ఇచ్చార‌ని.. సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. అదే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 40 శాతం మంది యువ‌త‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం. ఇది ఒక్క‌టి ఆశించిన ప‌రిణామంగా చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ప‌ర‌నింద‌కే ప్రాధాన్యం ఇవ్వ‌డం..ఆసాంతం స‌భ అంతా.. జ‌గ‌న్ కోసమో.. వైసీపీ పాల‌న‌కోసమో.. నిర్వ‌హించిన‌ట్టుగా ఉంద‌నేవారు కూడా ఉన్నారు.

అటు చంద్ర‌బాబు కానీ, ఇటు లోకేష్‌బాబు కానీ.. త‌మ త‌మ ప్రసంగాల‌ను మొత్తంగా.. జ‌గ‌న్ పాల‌న చుట్టూనే తిప్పారు.. కానీ.. ఇన్నేళ్ల‌లో పార్టీ న‌డిచిన విధానాన్ని మ‌రింత వివ‌రించి ఉంటే… బాగుండేద‌ని.. వ‌చ్చే రోజుల్లో అందునా.. వ‌చ్చే 40 ఏళ్ల‌పాటు.. పార్టీని ఎలా ముందుకు న‌డిపిస్తార‌నే విష‌యాన్ని కూడా స్ప‌ష్టం చేసి ఉంటే.. బాగుండేద‌ని.. అంటున్నారు. దిశానిర్దేశం మ‌రింత పెర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. అంటున్నారు. అదేస‌మ‌యంలో క్షేత్ర‌స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేసేందుకు క‌మిటీలను, బూత్ స్థాయి క‌మిటీల విష‌యాన్ని.. తేల్చాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు. ఇవ‌న్నీ.. వ‌దిలేసి.. కేవ‌లం ప‌ర‌నింద‌కే ప‌రిమితం అయిన‌ట్టుగా.. ఉంద‌ని.. గుస‌గుస వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. 

This post was last modified on March 30, 2022 6:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ టార్గెట్ ఆరు నెలలు

ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…

49 minutes ago

పీఎం పొదుపు మంత్రం… మహానాడుపై ఎఫెక్ట్?

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్‌ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…

1 hour ago

ఇక పెట్రోల్ బాదుడేనా?

అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…

1 hour ago

జూనియర్ రమేష్ బాబు సౌండ్ పెంచాలి

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…

3 hours ago

పవన్ కళ్యాణ్ సినిమాలకు దారి దొరికేనా

ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…

9 hours ago

ఈసారి మెజారిటీ తగ్గకూడదు తమ్ముళ్లు

టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…

9 hours ago