Political News

సీనియ‌ర్ల‌కు ఎంపీ.. జూనియ‌ర్ల‌కు ఎమ్మెల్యే.. ఇదే బాబు లెక్క‌!

యువ‌త రాజ‌కీయాల్లోకి రావాలి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున యువ‌త‌కు అవ‌కాశం ఇస్తాం.. 40 శాతం టికెట్లు కేటాయిస్తాం.. ఇవీ తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు చేసిన వ్యాఖ్య‌లు. వీటిని బ‌ట్టి చూస్తుంటే వ‌చ్చే ఏపీ ఎన్నిక‌ల్లో యువ‌త‌కు బాబు అధిక ప్రాధాన్య‌త ఇచ్చేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. పార్టీ బ‌లోపేతంపై సీనియ‌ర్లు దృష్టి పెట్ట‌క‌పోవ‌డం.. పార్టీ కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొన‌లేక‌పోవ‌డం లాంటి కార‌ణాల వ‌ల్ల ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో యువ‌త‌ను బ‌రిలో దించాల‌ని ఆయ‌న అనుకుంటున్నారు. అయితే యువ‌త‌కు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి.. సీనియ‌ర్ల‌ను ఎంపీ స్థానాల్లో బ‌రిలో దింపాల‌న్న‌ది బాబు ఆలోచ‌న‌గా తెలుస్తోంది.

జాతీయ రాజ‌కీయాల్లో..
వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన క‌లిసి పోటీ చేయ‌డం ఖాయ‌మైంద‌ని వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈ పార్టీల‌తో బీజేపీ కూడా పొత్తు కుదుర్చుకునే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ పొత్తులో కొన్ని స్థానాలు పోయినా మిగ‌తా వాటిపై బాబు దృష్టి పెట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు. మ‌రోవైపు జాతీయ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషించాలంటే వీలైనంత ఎక్కువ మందిని ఎంపీలుగా గెలిపించుకోవ‌డం అవ‌స‌రం.

అందుకే ఎంపీ అభ్య‌ర్థుల విష‌యంలో బాబు ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఒక‌వేళ బీజేపీ, జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకున్నా.. ఆ పార్టీలో లోక్‌స‌భ స్థానాల‌పై ప‌ట్టు ప‌ట్టే అవ‌కాశం లేదు. అందుకే త‌మ పార్టీ త‌ర‌పున ఎక్కువ స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టి గెలిపించుకోవాల‌ని బాబు చూస్తున్నారు.

వాళ్ల‌పై క‌న్ను..
లోక్‌స‌భ స్థానాలు వీలైన‌న్ని ఎక్కువ గెలుచుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న బాబు అందుకోసం ఇత‌ర పార్టీ సీనియ‌ర్ నేత‌ల‌పైనా దృష్టి సారించార‌ని టాక్‌. ముఖ్యంగా కాంగ్రెస్‌లోని సీనియ‌ర్ నేత‌లను పార్టీలోకి ఆహ్వానించేందుకు సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం. కాకినాడ‌, అర‌కు, విశాఖ‌ప‌ట్నం, అన‌కాప‌ల్లి, రాజ‌మండ్రి, అమ‌లాపురం, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు లాంటి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇప్ప‌టికే సీనియ‌ర్ల పేరును బాబు ఖరారు చేసిన‌ట్లు తెలుస్తోంది. రాజ‌మండ్రి నుంచి గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రిని పోటీ చేయిస్తే కాకినాడ నుంచి మాజీ మంత్రి ప‌ల్లం రాజుని బ‌రిలో దించాల‌ని చూస్తున్నారు. మొత్తంగా ఢిల్లీలో ప‌ట్టు కోసం ప్ర‌య‌త్నిస్తున్న బాబు అందుకు త‌గిన వ్యూహ ర‌చ‌న‌ల్లో మునిగిపోయారు. 

This post was last modified on March 30, 2022 4:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago