Political News

జాబితా రెడీ.. ముహూర్తం ఫిక్స్‌.. మంత్రి వ‌ర్గానికి ఫేర్‌వెల్‌

జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రుల మార్పున‌కు ముహూర్తం ఫిక్స‌యిపోయింది. ఇప్ప‌టికే కొత్త‌గా ప‌ద‌వులు తీసుకునే మంత్రుల జాబితా కూడా రెడీ అయిపోయింద‌ని.. తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. ఎవ‌రు ఏమ‌నుకున్నా.. ప‌రిస్థితి ఎలా ఉన్నా.. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని.. జ‌గ‌న్ మార్పులు చేర్పులు చేశార‌ని అంటున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన బీసీ నాయ‌కురాలికి మంత్రి వ‌ర్గంలో చోటు ఖాయ‌మైంది. అదే విధంగా స్పీక‌ర్ తమ్మినేనిని కూడా మంత్రి వ‌ర్గంలోకి తీసుకుంటున్నార‌ని చెబుతున్నారు. ఇక‌, శ్రీకాకుళం నుంచే మ‌రొక‌రికి అవ‌కాశం ఇస్తున్నారు.

ఇక‌, విజ‌య‌వాడ నుంచి సెంట్ర‌ల్ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణుకు అవ‌కాశం రెడీ అయింది. నెల్లూరు నుంచి ఆనం లేదా.. ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డికి అవ‌కాశం ల‌భిస్తుంద‌ని తెలుస్తోంది. ఇలా.. మొత్తంగా కీల‌క నేత‌ల‌తోనే ఈ ద‌ఫా ఎన్నిక‌ల క్యాబినెట్‌ను ముఖ్య‌మంత్రి ఏర్పాటు చేసుకుంటున్నార‌ట‌. వ‌చ్చే నెల 11న మంత్రి వ‌ర్గ ప్ర‌మాణ స్వీకారం ఉంటుంద‌ని తెలుస్తోంది. వ‌చ్చే నెల 9న సీఎం స్వ‌యంగా.. గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి.. మంత్రుల జాబితాను ఆయ‌న‌కు అంద‌జేసి.. వీరి ప్రొఫైల్స్‌ను వివ‌రించ‌నున్న‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఇక‌, అదేరోజు.. రాత్రి గ‌వ‌ర్న‌ర్ బంగ్లాలోనే.. మంత్రుల‌కు ఫేర్‌వెల్ పార్టీ ఇస్తున్న‌ట్టు స‌మాచారం. దీనిని బ‌ట్టి.. ఏప్రిల్ 9వ తేదీతోనే మంత్రులు ఇక‌, మాజీలు కానున్నారు. అదే నెల 11న కొత్త మంత్రి వ‌ర్గం ప్ర‌మాణం చేయ‌నుంది. అయితే.. ఈ జాబితా ఇప్ప‌టికే సిద్ధ‌మైనా.. ప‌ద‌వులు పొందేవారికి మాత్రం ఒక్క‌రోజు ముందు మాత్ర‌మే చెప్ప‌నున్న‌ట్టు స‌మాచారం. ఇప్పుడు ఏవిధంగా అయితే.. మంత్రి వ‌ర్గ కూర్పు ఉందో.. అదే కూర్పును కొన‌సాగించి.. కేవ‌లం అభ్య‌ర్థుల‌ను మాత్రం మారుస్తార‌ని.. అంటున్నారు.

అదేవిధంగా.. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డికి కొత్త‌గా అవ‌కాశం ఇవ్వ‌డంతోపాటు.. బాలినేని శ్రీనివాస‌రెడ్డి, బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డిల‌ను కొన‌సాగిస్తార‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల మృతి చెందిన గౌతం రెడ్డి స‌తీమ‌ణికి కూడా బెర్త్ కేటాయించార‌ని.. అంటున్నారు. ఏదేమైనా.. ముసుగు తొలిగిపోయేందుకు ముహూర్తం ద‌గ్గ‌ర ప‌డ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on March 30, 2022 12:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

4 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

5 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

5 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

5 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

5 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

6 hours ago