జగన్ కేబినెట్లో మంత్రుల మార్పునకు ముహూర్తం ఫిక్సయిపోయింది. ఇప్పటికే కొత్తగా పదవులు తీసుకునే మంత్రుల జాబితా కూడా రెడీ అయిపోయిందని.. తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. ఎవరు ఏమనుకున్నా.. పరిస్థితి ఎలా ఉన్నా.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. జగన్ మార్పులు చేర్పులు చేశారని అంటున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన బీసీ నాయకురాలికి మంత్రి వర్గంలో చోటు ఖాయమైంది. అదే విధంగా స్పీకర్ తమ్మినేనిని కూడా మంత్రి వర్గంలోకి తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఇక, శ్రీకాకుళం నుంచే మరొకరికి అవకాశం ఇస్తున్నారు.
ఇక, విజయవాడ నుంచి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు అవకాశం రెడీ అయింది. నెల్లూరు నుంచి ఆనం లేదా.. ప్రసన్నకుమార్రెడ్డికి అవకాశం లభిస్తుందని తెలుస్తోంది. ఇలా.. మొత్తంగా కీలక నేతలతోనే ఈ దఫా ఎన్నికల క్యాబినెట్ను ముఖ్యమంత్రి ఏర్పాటు చేసుకుంటున్నారట. వచ్చే నెల 11న మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలుస్తోంది. వచ్చే నెల 9న సీఎం స్వయంగా.. గవర్నర్ను కలిసి.. మంత్రుల జాబితాను ఆయనకు అందజేసి.. వీరి ప్రొఫైల్స్ను వివరించనున్నట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి.
ఇక, అదేరోజు.. రాత్రి గవర్నర్ బంగ్లాలోనే.. మంత్రులకు ఫేర్వెల్ పార్టీ ఇస్తున్నట్టు సమాచారం. దీనిని బట్టి.. ఏప్రిల్ 9వ తేదీతోనే మంత్రులు ఇక, మాజీలు కానున్నారు. అదే నెల 11న కొత్త మంత్రి వర్గం ప్రమాణం చేయనుంది. అయితే.. ఈ జాబితా ఇప్పటికే సిద్ధమైనా.. పదవులు పొందేవారికి మాత్రం ఒక్కరోజు ముందు మాత్రమే చెప్పనున్నట్టు సమాచారం. ఇప్పుడు ఏవిధంగా అయితే.. మంత్రి వర్గ కూర్పు ఉందో.. అదే కూర్పును కొనసాగించి.. కేవలం అభ్యర్థులను మాత్రం మారుస్తారని.. అంటున్నారు.
అదేవిధంగా.. సజ్జల రామకృష్ణారెడ్డికి కొత్తగా అవకాశం ఇవ్వడంతోపాటు.. బాలినేని శ్రీనివాసరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డిలను కొనసాగిస్తారని తెలుస్తోంది. ఇటీవల మృతి చెందిన గౌతం రెడ్డి సతీమణికి కూడా బెర్త్ కేటాయించారని.. అంటున్నారు. ఏదేమైనా.. ముసుగు తొలిగిపోయేందుకు ముహూర్తం దగ్గర పడడం గమనార్హం.
This post was last modified on March 30, 2022 12:32 pm
నిన్న విడుదలైన రణబాలి టీజర్ పట్ల సోషల్ మీడియాలో పాజిటివ్ రియాక్షన్లు ఎక్కువగా కనిపించాయి. అలాని అందరూ యునానిమస్ గా…
అర్జెంటీనాలో జరిగిన ఒక విచిత్ర పరిణామం ప్రపంచ వ్యాప్తంగా తెగ వైరల్ అవుతుంది. రాత్రికి రాత్రే ఒక సముద్రం ఇంకిపోయిందని,…
ఫోల్డబుల్ ఫోన్ అంటే ముందుగా గుర్తొచ్చేది శాంసంగ్. 2019లో తొలి గెలాక్సీ ఫోల్డ్ను తీసుకొచ్చిన ఆ కంపెనీ, అప్పటి నుంచి…
ఫౌజీ వాయిదా గురించి నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా పోస్ట్ పోన్ ఖాయమని…
మొబైల్ ఫోన్లు చేతిలోకి వచ్చాక రోజుకో కొత్త రకం నేరం బయట పడుతుంది. ముఖ్యంగా యువతీ యువకులు, మైనర్ బాలుల్లో…
కారణాలు లక్షా తొంభై ఉండని, టాలీవుడ్ హీరోలు చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారనేది వాస్తవం. రవితేజ, శ్రీవిష్ణు లాంటి ఒకరిద్దరిని…