జగన్ కేబినెట్లో మంత్రుల మార్పునకు ముహూర్తం ఫిక్సయిపోయింది. ఇప్పటికే కొత్తగా పదవులు తీసుకునే మంత్రుల జాబితా కూడా రెడీ అయిపోయిందని.. తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. ఎవరు ఏమనుకున్నా.. పరిస్థితి ఎలా ఉన్నా.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. జగన్ మార్పులు చేర్పులు చేశారని అంటున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన బీసీ నాయకురాలికి మంత్రి వర్గంలో చోటు ఖాయమైంది. అదే విధంగా స్పీకర్ తమ్మినేనిని కూడా మంత్రి వర్గంలోకి తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఇక, శ్రీకాకుళం నుంచే మరొకరికి అవకాశం ఇస్తున్నారు.
ఇక, విజయవాడ నుంచి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు అవకాశం రెడీ అయింది. నెల్లూరు నుంచి ఆనం లేదా.. ప్రసన్నకుమార్రెడ్డికి అవకాశం లభిస్తుందని తెలుస్తోంది. ఇలా.. మొత్తంగా కీలక నేతలతోనే ఈ దఫా ఎన్నికల క్యాబినెట్ను ముఖ్యమంత్రి ఏర్పాటు చేసుకుంటున్నారట. వచ్చే నెల 11న మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలుస్తోంది. వచ్చే నెల 9న సీఎం స్వయంగా.. గవర్నర్ను కలిసి.. మంత్రుల జాబితాను ఆయనకు అందజేసి.. వీరి ప్రొఫైల్స్ను వివరించనున్నట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి.
ఇక, అదేరోజు.. రాత్రి గవర్నర్ బంగ్లాలోనే.. మంత్రులకు ఫేర్వెల్ పార్టీ ఇస్తున్నట్టు సమాచారం. దీనిని బట్టి.. ఏప్రిల్ 9వ తేదీతోనే మంత్రులు ఇక, మాజీలు కానున్నారు. అదే నెల 11న కొత్త మంత్రి వర్గం ప్రమాణం చేయనుంది. అయితే.. ఈ జాబితా ఇప్పటికే సిద్ధమైనా.. పదవులు పొందేవారికి మాత్రం ఒక్కరోజు ముందు మాత్రమే చెప్పనున్నట్టు సమాచారం. ఇప్పుడు ఏవిధంగా అయితే.. మంత్రి వర్గ కూర్పు ఉందో.. అదే కూర్పును కొనసాగించి.. కేవలం అభ్యర్థులను మాత్రం మారుస్తారని.. అంటున్నారు.
అదేవిధంగా.. సజ్జల రామకృష్ణారెడ్డికి కొత్తగా అవకాశం ఇవ్వడంతోపాటు.. బాలినేని శ్రీనివాసరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డిలను కొనసాగిస్తారని తెలుస్తోంది. ఇటీవల మృతి చెందిన గౌతం రెడ్డి సతీమణికి కూడా బెర్త్ కేటాయించారని.. అంటున్నారు. ఏదేమైనా.. ముసుగు తొలిగిపోయేందుకు ముహూర్తం దగ్గర పడడం గమనార్హం.
This post was last modified on March 30, 2022 12:32 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…