ఏపీ ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గం నాయకుడు.. ధర్మాన కృష్ణ దాస్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలవకపోతే.. తమ కుటుంబం.. తన తమ్ముడి(ధర్మాన ప్రసాద్)తో సహా.. రాజకీయాల నుంచి తప్పుకొంటామని వ్యాఖ్యానించా రు. “మేం చేతులకు గాజులు తొడుక్కుని లేం. చూస్తూ కూర్చోం.. వచ్చే ఎన్నికల్లో.. జగన్ను మళ్లీ సీఎం చేసుకునేందుకు.. ఏం చేయాలో మాకు తెలుసు“ అని కృష్ణదాస్ వ్యాఖ్యానించారు. జగన్ గెలవకపోతే.. తమ కుటుంబం రాజకీయ సన్యాసం తీసుకుంటుందన్నారు.
మంత్రిగారి సొంత నియోజకవర్గం నర్సన్నపేటలోని కంబకాయ మండలంలో మంగళవారం ఫిష్ లే అవుట్కు కృష్ణదాస్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఈ రోజు రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా పోయింది. మీరు(ప్రజలు) ప్రతిపక్షం చేసే జిమ్మిక్కులను, మాయ మాటలను నమ్మొద్దు“ అని పిలుపునిచ్చారు. మాపై ఉన్న గౌరవం, ప్రజల దీవెనల కారణం.. రాష్ట్రంలో వైసీపీ విజయం సాధిస్తోందని.. అన్నారు. టీడీపీ నేతలు చెబుతున్న బోగసేనని అన్నారు. వారు చెబుతున్న మాటలను ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు.
“టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఒక మాట చెబుతున్నాడు. వచ్చే ఎన్నికల్లో ఏకంగా 160 సీట్లు గెలిచేస్తాడం ట. మొన్న 20 గెలిచారు.. ఈ సారి 160 గెలిచేస్తారట! మనం ఇలా గాజులేసుకుని కూర్చుంటాం. ఇవన్నీ సొల్లు మాటలు. మీరెవరూ భయపడాల్సిన పనిలేదు. ఈ వేళ నేను చెబుతున్నాను. మళ్లీ జగన్మోహన్రె డ్డిగారుముఖ్యమంత్రి కాకపోతే.. వచ్చే ఎన్నికల్లో మా కుటుంబం రాజకీయ సన్యాసం తీసుకుంటుంది. రాజకీయాల నుంచి తప్పుకుంటాం. ఛాలెంజ్ చేస్తున్నా!“ అని ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యానించారు.
ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ప్రజలు జగన్నే సీఎంగా గెలిపిస్తారని.. ధీమా వ్యక్తం చేశారు. మధ్య వర్తులు, దళారులు లేని పోని ప్రచారం చేస్తున్నారని.. వాటిని ప్రజలు విశ్వసించవద్దని.. కృష్ణదాస్ చెప్పారు. మీకు ఏది కావాలంటే అది చేయడానికి తాముసిద్ధంగా ఉన్నామని.. మంత్రి చెప్పారు.
This post was last modified on March 30, 2022 8:20 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…