Political News

కాంగ్రెస్ ఎదగాలని కోరుకుంటున్న బీజేపీ సీనియర్ నేత

కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపేమో నరేంద్ర మోడీ కాంగ్రెస్ ను దేశం నుండి పారదోలాలని పిలుపిస్తున్నారు. ఇదే సమయంలో ముంబాయ్ లో గడ్కరీ మాట్లాడుతూ కాంగ్రెస్ బలోపేతమవ్వాలని సూచించారు. ఓటములు ఎదురువుతున్నాయని నీరసపడి పోకుండా మళ్ళీ బలోపేతమవ్వటానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేయాలని పిలుపిచ్చారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్న మోడీ పిలుపుకు గడ్కరీ పిలుపు పూర్తి విరుద్ధంగా ఉంది.

కాంగ్రెస్ బలోపేతమై ప్రతిపక్షంలో మరింత బలంగా ఉండాలని తాను చిత్తశుద్ధితో కోరుకుంటున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. వరుస పరాజయాలు ఎదురైనంత మాత్రాన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అధైర్యపడద్దని గడ్కరీ వారిని ఓదార్చారు. గుండె దిటువు చేసుకుని పార్టీ బలోపేతానికి కిందిస్థాయి నుండి అందరూ కలిసికట్టుగా పోరాటాలు చేయాలని గడ్కరీ పిలుపివ్వటమే విచిత్రంగా ఉంది. ప్రతిపక్షం బలంగా లేకపోతే ప్రాంతీయ పార్టీలదే రాజ్యంగా తయారవుతుందన్నారు.

జాతీయ నాయకత్వానికి ప్రాంతీయ పార్టీలు పోటీపడటం దేశానికి ఏమాత్రం మంచిది కాదన్నారు. ప్రజాస్వామ్యానికి అధికార-ప్రతిపక్షాలు రెండు చక్రాల్లాంటివని గడ్కరీ చెప్పారు. అందుకనే కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రతిపక్షంగా నిలబడాలని చిత్తశుద్దితో కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ కాంగ్రెస్ పార్టీని నరేంద్ర మోడీ చీలికలు పీలికలు చేస్తున్న విషయం గడ్కరీకి తెలీదా ? రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలను ఎందుకని కూల్చేస్తున్నట్లు ? కర్ణాటక, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూలదోసే కదా బీజేపీ అధికారంలోకి వచ్చింది.

ఒకవైపు నరేంద్ర మోడీ వ్యవహారాలను చూస్తునే మరోవైపు కాంగ్రెస్ బలంగా ఉండాలని మంత్రివర్గంలో కీలక సభ్యుడైన గడ్కరీ కాంగ్రెస్ బలోపేతమవ్వాలని కోరుకుంటుంటున్నారు. అంటే ఇందులో ఏదో హిడెన్ అజెండా ఉందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్ బలంగా ఉండాలని కోరుకుంటున్న గడ్కరీ మరి రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూలదోయద్దని మోడీకి ఎందుకు చెప్పలేకపోతున్నారు ? ఏదేమైనా మోదీ వ్యవహారం ఒకలాగుంటే గడ్కరీ తాజా వ్యాఖ్యలు పూర్తి విరుద్ధంగా ఉండటం కమలనాథులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

This post was last modified on March 29, 2022 12:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈ సంక్రాంతికైనా జనంలోకి జగన్ వస్తారా?

రాష్ట్ర రాజ‌కీయాల్లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే దిశ‌గా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. స‌హ‌జంగా అధికారంలో ఉన్న‌పార్టీలు…

24 minutes ago

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

7 hours ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

8 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

10 hours ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

10 hours ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

11 hours ago