Political News

20 లక్షలలో సున్నా లేపేసిన జగన్: లోకేష్ పంచ్

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. నారా లోకేష్ తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. సీఎం జగన్ మాటలు కోటలు దాటుతాయేకానీ.. ఆయన చేతలు తాడేపల్లి ప్యాలెస్ కూడా దాటవని ఆయ‌న ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లా బస్సు ప్రమాదంలో మరణించినవారికి రూ.2 లక్షలు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారని ఆరోపించారు. అందుకే జగన్ మోసపు రెడ్డి మాటలు కోటలు దాటతాయే కానీ.. చేతలు తాడేపల్లి ప్యాలెస్ కాంపౌండ్ కూడా దాటవని త‌ను అంటున్నాన‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌మాదంలో మృతి చెందిన వారి కుటుంబాల‌కు రూ.2 ల‌క్ష‌లు ఇచ్చి స‌రిపెట్ట‌డం స‌రికాద‌న్నారు. ఈ విష‌యంలో జ‌గ‌న్ గ‌తంలో ఏం చేశారో గుర్తుకు తెచ్చుకోవాల‌ని.. లోకేష్ సూచించారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం ఇవ్వడమేంటని జగన్ ప్రశ్నించారన్న లోకేష్‌.. ఇప్పుడు చిత్తూరు జిల్లా భాకరపేట సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయిన 9 మంది కుటుంబాలకు విషయంలో చేస్తున్నదేంటని నిలదీశారు. అప్పుడు రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాడ్ చేసిన జగన్.. ఇప్పుడు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. తాము కొత్త డిమాండ్లు ఏమీ పెట్టడం లేదని.. ఆనాడు జగన్ ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

ఈ మేరకు ‘నాడు-నేడు’ పేరిట జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియోను లోకేశ్ విడుదల చేశారు. అప్ప‌ట్లో ప్ర‌తిప‌క్షంలో ఉన్న జ‌గ‌న్‌.. టీడీపీ ప్ర‌బుత్వంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌మాదంలో మృతి చెందిన వారిని ప్ర‌భుత్వం ఉదారంగా ఆదుకోక‌పోతే.. ఆ కుటుంబాలు ఎలా జీవ‌నం సాగిస్తాయ‌ని.. ఆనాడు ఆయ‌న పేర్కొన్నారు. ఆ కుటుంబాల్లోని చిన్న పిల్ల‌లు.. వృద్ధులు అనాథ‌లు మారిపోతే.. ప్ర‌భుత్వానికి క‌నీసం జాలి కూడా లేదా?  ఈ చంద్ర‌బాబుకు మ‌నసు కూడా లేదా? అని ఆనా డు ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇదే విష‌యాల‌ను తాజాగా.. లోకేష్ ప్ర‌స్తావించారు. మ‌రి ఇప్పుడు ఆ సూక్తులు ఏమ‌య్యాయ‌ని.. నిల‌దీశారు.

ప్ర‌తి కుటుంబానికి రూ.20 ల‌క్ష‌ల చొప్పున ఇవ్వాల‌ని లోకేష్ డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనిపై ఏపీ ప్ర‌భుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. మ‌రోవైపు గ‌త ఏడాది వ‌ర‌కు.. రాష్ట్రంలో ఎక్క‌డ ప్ర‌మాదం చోటు చేసుకున్నా.. రూ.5 ల‌క్ష‌ల‌కు త‌గ్గ‌కుండా.. ప్ర‌మాద బాధిత కుటుంబాల‌కు ఇచ్చిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇటీవ‌ల కాలంలో తొలిసారి.. ఈ మొత్తాన్ని రూ.2 ల‌క్ష‌ల‌కు త‌గ్గించ‌డంపై నెటిజ‌న్లు కూడా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ప‌రిణామాలు.. జ‌గ‌న్ ఆర్తిక వ్య‌వ‌స్థ‌ను క‌ళ్ల‌కు క‌డుతున్నాయ‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం ఎంత ఆర్థిక ఇబ్బందులు ప‌డుతోందో .. ఈ ప‌రిణామాలు తెలియ‌జేస్తున్నాయ‌ని అంటున్నారు.

This post was last modified on March 29, 2022 7:02 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేశ చ‌రిత్ర‌లో.. `మ‌మ‌త` గెలిచారు… మరి ఈసీ మాటేంటి?!

సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచార‌ణ‌కు వ‌స్తాయి. న్యాయ‌శాస్త్రంలో ల‌బ్ధ‌ప్ర‌తిష్టులైన అనేక మంది న్యాయ‌వాదులు వాద‌న‌లు వినిపిస్తారు. ఇది…

1 hour ago

గంపెడు సినిమాలు… గుప్పెడు అంచనాలు

రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…

1 hour ago

సినిమాల్లేవ్ కానీ అంతటా ఆమే..

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…

5 hours ago

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

10 hours ago

మహేష్ రన్నింగ్ స్టైల్ మార్చడమేంటి జక్కన్నా?

తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…

11 hours ago

దురంధర్ VS విశ్వరూపం – ఎందుకీ రచ్చ?

ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…

11 hours ago