సాధారణ ఉద్యోగులే.. భారీ ఎత్తున స్థిరాస్తులు సంపాయించుకుంటున్న రోజులు ఇవి. అయిన దానికీ.. కాని దానికీ.. చేతులు చాపుతూ.. ప్రజల నుంచి లంచాలు పీడించి మరీ వసూలు చేస్తున్న అధికారులు పెరిగి పోతున్నారని.. దేశవ్యాప్తంగా సర్వే చేసిన..ఏడీఆర్.. ఇటీవల సంచలన నివేదిక నివేదిక వెల్లడించింది. ఎక్కడ ఏ అధికారిపై ఏసీబీ కానీ, సీబీఐ కానీ, ఈడీ కానీ..ఎలా ఎవరు దాడులు చేసినా.. వందల కోట్ల రూపాయల అక్రమ సంపాదన వెలుగు చూస్తోంది. ఏపీ, తెలంగాణలో మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
ఇక, ఈ కోవలోనే.. ఇటీవల కాలంలో ఐఏఎస్, ఐపీఎస్లు కూడా చేరుతున్నారని కేంద్రమే చెబుతోంది. ఇటీవల పార్లమెంటులో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక సీనియర్ ఐపీఎస్ అదికారి విషయంపై అడిగిన ప్రశ్నకు కేంద్రం చెప్పిన సమాధానం ఆశ్చర్యం కలిగించింది. సదరు ఐపీఎస్ అధికారి తన 30 ఏళ్ల సర్వీసులో రూ.250 కోట్ల మేరకు.. అవినీతికి పాల్పడిన విషయం ఈడీ గుర్తించిందని.. ఆయన నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని.. పేర్కొంది.
రాజకీయాల్లోనేకాదు.. అధికారుల్లోనూ.. హంగు ఆర్భాటం.. ఆస్తులు కూడగట్టుకోవడం.. తరతరాలకు అందించడం.. ఇటీవల కాలంలో ఆనవాయితీగా మారిపోయింది. తాజాగా తెలంగాణలో పనిచేస్తున్న బీహార్ కు చెందిన ఓ IAS అధికారి గురుగావ్ లో మల్టీఫ్లెక్స్ కడుతున్నారనే సంచలన ఆరోపణ.. రాష్ట్ర రాజకీయ వర్గాలను.. అధికార వర్గాలను కూడా కుదిపేస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
రూ.450 కోట్లతో మల్టిప్లెక్స్ కడుతోన్న బీహార్ కు చెందిన ఆ IAS అధికారి ఎవరో తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం శ్రవణ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు.. రాజకీయ వర్గాల్లోనూ.. సంచలనంగా మారింది. నిజానికి బిహార్ నుంచి వచ్చే అధికారులు నిజాయితీగా పనిచేస్తారనే పేరుంది. ఎందుకంటే.. వారికి డబ్బు విలువ బాగా తెలుసు. కానీ.. ఇప్పుడు ఈ ఐఏఎస్ అధికారి విషయం మాత్రంసంచలనంగా మారింది. మరి అంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందో.. ఆయన ఎలా సంపాయించారో.. మున్ముందు.. దీనిపై సర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
This post was last modified on March 28, 2022 12:32 am
చిన్న సినిమాను పెద్దగా ప్రమోట్ చేస్తే తప్ప జనాలకు సులభంగా రీచ్ కాలేని రోజులివి. అందుకే లిటిల్ హార్ట్స్ ప్రొడక్షన్…
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు థాయిలాండ్లోని అంత్యక్రియలపై పడింది. దేశంలో తీవ్రమైన డీజిల్ కొరత ఏర్పడటంతో బౌద్ధ దేవాలయాల్లో…
బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన సల్మాన్ ఖాన్.. నిఖార్సయిన హిట్టు ఎప్పుడు కొట్టాడో తన వీరాభిమానులు కూడా మరిచిపోయిన పరిస్థితి. దశాబ్దం…
సోషల్ మీడియాలో ఆకర్షణీయ ప్రకటనలతో యువతను వలలో వేసుకునే హనీట్రాప్ యాప్స్పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి సీ సజ్జనార్…
దురంధర్ ది రివెంజ్ రూట్ క్లియరైపోయింది. సెన్సార్ ఆలస్యమంటూ ఉదయం నుంచి తిరుగుతున్న వార్తలకు చెక్ పడింది. 1 నిమిషం…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సినిమాకు రెండు…