వైసీపీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తర్జన భర్జనకు తెరదీశాయి. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని.. రాష్ట్రం ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించాలని.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ డిమాండ్ చేస్తోంది. మరోవైపు.. రాష్ట్రం ఎక్కువగా అప్పులు చేస్తోందని. కేంద్రం కూడా ఇటీవలపార్లెమంటు సమావేశా ల్లో స్పష్టం చేసింది. లెక్కల వారిగా కూడా.. కేంద్ర ప్రభుత్వం వివరించింది. ఇదిలావుంటే.. రాష్ట్రంలో బీజేపీ కూడా దూకుడు పెంచింది. రాష్ట్రానికి ఆదాయం లేదని.. కేవలం కేంద్రం ఇస్తున్న నిధులు.. అప్పులతోనే నెట్టుకువస్తోందని పేర్కొంటోంది.
ఇక, తాజాగా రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ గత ఏడాదికి సంబంధించిన ఆదాయం, ఖర్చులు వంటి వాటిపై ఒక నివేదికను వెలువరించారు. దీనిలో 56 శాతం మేరకు రాష్ట్ర ప్రభుత్వం అప్పులుతోనే నెట్టుకు వస్తోందని స్పష్టం చేశారు. నిజానికి అకౌంటెంట్ జనరల్ నివేదిక అంటే.. రాష్ట్రానికి వస్తున్న ఆదాయాన్ని ప్రముఖంగా పేర్కొంటారు. అదేసమయంలో మిగిలిన వివరాలు కూడా వెల్లడిస్తారు. కానీ, ఏపీ విషయానికి వస్తే.. అకౌం టెంట్ జనరల్ ఇచ్చిన నివేదికలో 56 శాతం అప్పులు తీసుకుంటున్నట్టు చూపించారు. అదేసమయంలో 18 శాతం చొప్పున చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నారని.. ఈ నివేదిక స్పష్టం చేయడం గమనార్హం.
అంటే ఎలా చూసుకున్నా.. జగన్ ప్రభుత్వం ఈ మూడు సంవత్సరాల కాలంలో కొత్తగా చేసిన అభివృద్ధి కానీ.. తీసుకువచ్చిన ఆదాయం కానీ.. ఎక్కడా కనిపించడం లేదు. కేవలం అప్పులు చేసి.. పప్పు కూడు తిన్న తరహాలోనే ప్రభుత్వం ఉందని.. అటు కాగ్ కూడా పేర్కొంది. ఈ నివేదికలో అయితే.. అసలు 48 వేల కోట్ల రూపాయలు లెక్క జమ లేకుండా పోయిందని.. వ్యాఖ్యానించింది. మరోవైపు ఎఫ్ ఆర్ బీఎం పరిమితిని మించి ప్రభుత్వం అప్పులు చేస్తోందని.. కేంద్రం కూడా చెప్పింది. ఇది.. పూర్తిగా ప్రభుత్వాన్నిఅప్పులు చేసుకుని.. పాలన సాగించే దిశగానే అడుగులు వేయిస్తోందని మేధావులు సైతం చెబుతున్నారు.
ఈ క్రమంలోనే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ననాయకులు.. కేంద్రానికి ఫిర్యాదులు చేయడం ప్రారంభించా రు. రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలని.. జగన్ చేస్తున్న ఆర్థిక అరాచకాన్ని నిగ్గు తేల్చాలని.. పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఏం చేయాలనే అంశంపై పార్టీలోను ప్రభుత్వం లోనూ తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై కేంద్రంతో మాట్లాడతారో.. లేక.. ప్రజల్లోకి వచ్చివివరణ ఇస్తారో..చూడాలి. ఏదేమైనా.. గతానికి ఇప్పటికి.. మాత్రం ఏపీ ప్రభుత్వ పరిస్థితి ఇబ్బందుల్లో చిక్కుకుందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on March 28, 2022 12:24 am
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…