Political News

నోట్ దిస్ పాయింట్ బాబూ.. ఆ యువ నేత చెప్పింది క‌రెక్టే!!

టీడీపీలో ప్ర‌క్షాళ‌న జ‌ర‌గాలి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ అధికారంలోకి రావాలి.. ఇదే..పార్టీ అధినేత చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్నారు. అయితే.. ఈ క్ర‌మంలో ఒక కీల‌క విష‌యంపై చ‌ర్చ సాగుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి నుంచి మ‌నం నేర్చుకున్న‌ది ఏంట‌నేది.. ప్ర‌ధానంగా నాయ‌కులు సంధిస్తున్న ప్ర‌శ్న‌. గ‌త ఎన్ని క‌ల్లో పార్టీ ఓట‌మికి అనేక కార‌ణాలు ఉన్నాయ‌ని.. చంద్ర‌బాబు చెబుతున్నారు. అయితే… వీటిలో ఎన్నింటి కి ఇప్ప‌టి వ‌ర‌కు చెక్ పెట్టారు?  ఎన్నింటిని.. ఆయ‌న ప‌రిష్క‌రించారు? అనేది కీల‌క ప్ర‌శ్న‌.

ముఖ్యంగా.. గ‌త ఎన్నిక‌ల్లో.. టీడీపీ నేత‌ల‌కు.. చాలా మందికి టికెట్లు క‌న్ఫ‌ర్మ్ చేయ‌డంలో.. చంద్ర‌బాబు చాలా స‌మ‌యం తీసుకున్నారు.. ఇది పార్టీలో నైతికంగా ఇబ్బందులు తీసుకువ‌చ్చింది. వైసీపీ జాబితా చూశాకే త‌ప్ప స్పందించ‌ని ప‌రిస్థితిలో.. చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించారనే వ్యాఖ్య‌లు అప్ప‌ట్లోనే వినిపించాయి. ఈ నేప‌థ్యంలోనే.. చాలా మంది యువ నాయ‌కులు ఓడిపోయారు. ఇదే విష‌యాన్ని తాజాగా.. కర్నూ లు నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ ఇంచార్జ్ టీజీ భరత్ వెల్ల‌డించారు. టీడీపీ అధిష్టానం చివరి వరకు నాన్చి.. నాన్చి టికెట్ ఇవ్వడం వల్లే 2019 ఎన్నికల్లో ఓడిపోయా అని వ్యాఖ్యానించారు.

అంతేకాదు… ఎన్నికలకు ఆరు నెలల ముందే టికెట్ ఇచ్చి ఉంటే సునామీ వచ్చినా గెలిచేవాడినని భ‌ర‌త్ చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ వెంక‌టేష్ కుమారుడు అయిన భ‌ర‌త్‌.. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయారు. యువ‌నాయ‌కుడిగా.. ఆర్థికంగా.. అన్ని ర‌కాలుగా మ‌ద్ద‌తు ఉన్నా.. టికెట్‌విష‌యంలో.. చివ‌రి వ‌ర‌కు చంద్ర‌బాబు తాత్సారం చేశారు. ఒక్క ఇక్క‌డ‌నే కాదు.. రాష్ట్రంలో దాదాపు 100 నియోజ‌క‌వర్గాల్లో.. నామినేష‌న్ల‌కు గ‌డువు ముగిసిపోతుంద‌న‌డానికి రెండు రోజుల ముందు ఖ‌రారు చేసిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి.

ఇది .. పార్టీలో అప్ప‌ట్లోనే చ‌ర్చ‌కు వ‌చ్చింది.  మ‌రి ఇప్పుడు ఏం చేస్తారు? అనేది కూడా ఆస‌క్తిగా మారింది. వాస్త‌వానికి ఇప్ప‌టికే పార్ల‌మెంట‌రీ జిల్లా ఇంచార్జ్‌లు అంటూ కొంద‌రినినియ‌మించారు. అయితే.. వీరే వ‌చ్చే ఎన్నిక‌ల్లోపోటీ చేస్తారా? అంటే.. లేదు. కానీ, ఇంచార్జ్‌ల‌ను మాత్రంనియ‌మించారు. ఇక‌, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌లోనూ.. నాయ‌కుల‌ను నియ‌మించాల్సిన అవ‌స‌రం ఉంది. ఉదాహ‌ర‌ణ‌కు విజ‌య‌వాడ ప‌శ్చిమం. ఇక్క‌డ పార్టీకి దిక్కు మొక్కులేదు. ఇలా.. దాదాపు 70 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు లేరంటే ఆశ్చ‌ర్యం వేస్తుంది. కాబ‌ట్టి..చంద్ర‌బాబు గ‌త త‌ప్పుల‌ను స‌రిదిద్దుకోవాల‌నేది.. యువ నేత‌ల వాద‌న‌. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on March 27, 2022 8:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసీని విపక్షాలు ఏం చెయ్యలేవా?

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్.. జ్ఞానేష్ కుమార్ సేఫ్ అయ్యారు. ఆయ‌న‌పై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విప‌క్షాలు ఇచ్చిన…

23 minutes ago

ఒంట‌రి పోరు వెనుక `విజ‌య్‌` ర‌హ‌స్యం బయటపడిందా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమైన ప్రముఖ నటుడు దళపతి విజయ్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు పరిశీలకులు…

42 minutes ago

బైకర్ స్పీడ్ ఇంకా పెరగాలి

శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన బైకర్ తొలి రెండు రోజులు నెమ్మదిగానే నడిచింది. టాక్ స్లోగా ఉండటం,…

54 minutes ago

‘రాధాకృష్ణకు పోలీసు భద్రత ఎల్లప్పుడూ ఉండదు’

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు ఏపీలోని విపక్షం వైసీపీ మంగళవారం ఉదయం వినూత్న నిరసనకు దిగింది.…

1 hour ago

బీజేపీ ఎమ్మెల్యే నోట రాజీమానా మాట

ఏపీలో కూటమి పాలన ఎలాంటి ఇబ్బంది లేకుండానే సాగుతోంది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ సాగడంతో పాటుగా…

2 hours ago

పెద్ది… పెద్ద మనసు చేసుకుని చెప్పేసెయ్

ఇండస్ట్రీ, ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్న క్షణం పెద్ది అనౌన్స్ మెంట్. ఏప్రిల్ 30 రావడం లేదని ప్రపంచం మొత్తం…

2 hours ago