టీడీపీలో ప్రక్షాళన జరగాలి.. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావాలి.. ఇదే..పార్టీ అధినేత చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అయితే.. ఈ క్రమంలో ఒక కీలక విషయంపై చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో ఓటమి నుంచి మనం నేర్చుకున్నది ఏంటనేది.. ప్రధానంగా నాయకులు సంధిస్తున్న ప్రశ్న. గత ఎన్ని కల్లో పార్టీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని.. చంద్రబాబు చెబుతున్నారు. అయితే… వీటిలో ఎన్నింటి కి ఇప్పటి వరకు చెక్ పెట్టారు? ఎన్నింటిని.. ఆయన పరిష్కరించారు? అనేది కీలక ప్రశ్న.
ముఖ్యంగా.. గత ఎన్నికల్లో.. టీడీపీ నేతలకు.. చాలా మందికి టికెట్లు కన్ఫర్మ్ చేయడంలో.. చంద్రబాబు చాలా సమయం తీసుకున్నారు.. ఇది పార్టీలో నైతికంగా ఇబ్బందులు తీసుకువచ్చింది. వైసీపీ జాబితా చూశాకే తప్ప స్పందించని పరిస్థితిలో.. చంద్రబాబు వ్యవహరించారనే వ్యాఖ్యలు అప్పట్లోనే వినిపించాయి. ఈ నేపథ్యంలోనే.. చాలా మంది యువ నాయకులు ఓడిపోయారు. ఇదే విషయాన్ని తాజాగా.. కర్నూ లు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ టీజీ భరత్ వెల్లడించారు. టీడీపీ అధిష్టానం చివరి వరకు నాన్చి.. నాన్చి టికెట్ ఇవ్వడం వల్లే 2019 ఎన్నికల్లో ఓడిపోయా అని వ్యాఖ్యానించారు.
అంతేకాదు… ఎన్నికలకు ఆరు నెలల ముందే టికెట్ ఇచ్చి ఉంటే సునామీ వచ్చినా గెలిచేవాడినని భరత్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కుమారుడు అయిన భరత్.. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. యువనాయకుడిగా.. ఆర్థికంగా.. అన్ని రకాలుగా మద్దతు ఉన్నా.. టికెట్విషయంలో.. చివరి వరకు చంద్రబాబు తాత్సారం చేశారు. ఒక్క ఇక్కడనే కాదు.. రాష్ట్రంలో దాదాపు 100 నియోజకవర్గాల్లో.. నామినేషన్లకు గడువు ముగిసిపోతుందనడానికి రెండు రోజుల ముందు ఖరారు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇది .. పార్టీలో అప్పట్లోనే చర్చకు వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేస్తారు? అనేది కూడా ఆసక్తిగా మారింది. వాస్తవానికి ఇప్పటికే పార్లమెంటరీ జిల్లా ఇంచార్జ్లు అంటూ కొందరినినియమించారు. అయితే.. వీరే వచ్చే ఎన్నికల్లోపోటీ చేస్తారా? అంటే.. లేదు. కానీ, ఇంచార్జ్లను మాత్రంనియమించారు. ఇక, అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ.. నాయకులను నియమించాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు విజయవాడ పశ్చిమం. ఇక్కడ పార్టీకి దిక్కు మొక్కులేదు. ఇలా.. దాదాపు 70 నియోజకవర్గాల్లో నాయకులు లేరంటే ఆశ్చర్యం వేస్తుంది. కాబట్టి..చంద్రబాబు గత తప్పులను సరిదిద్దుకోవాలనేది.. యువ నేతల వాదన. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on March 27, 2022 8:36 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…