Political News

ఏపీలో న‌కిలీ మ‌ద్యంపై టీడీపీ డిజిట‌ల్ యుద్దం

ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న జే బ్రాండ్ల క‌ట్ట‌డి.. క‌ల్తీ సారా మ‌ర‌ణాల‌పై టీడీపీ నేత‌లు మ‌రింత తీవ్రంగా పోరాడాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇప్ప‌టికే అటు అసెంబ్లీలోనూ.. ఇటు శాసన మండ‌లిలోనూ తీవ్ర‌స్తాయిలో యుద్ధం చేస్తున్న నాయ‌కులు.. మ‌రింత‌గా ప్ర‌జ‌ల్లో చైత‌న్యం క‌లిగించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీనిలో భాగంగా.. తాజాగా.. మ‌ద్యం మాఫియాపై ప్రత్యేక వెబ్‌సైట్ను రూపొందించినట్లు తెలుగుదేశం పార్టీ వెల్లడించింది.

మద్యం పేరుతో దోపిడీ, మరణాల వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచుతామని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఈ డిజిటల్ క్యాంపెయిన్‌లో ప్రజలు భాగస్వాములు కావాలని నేతలు కోరారు. ముఖ్యమంత్రి జగన్ నడిపిస్తున్న మద్యం మాఫియాపై జరిపే పోరాటంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తామంటూ.. తెలుగుదేశం ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించింది. ఏపీలో నాసిరకం మద్యం బ్రాండ్లు ప్రాణాలు తీస్తున్నాయంటూ.. టీడీపీ డిజిటల్ క్యాంపెయినింగ్ మొదలు పెట్టింది.

ప్రభుత్వ మద్యం పాలసీ, మద్యం పేరుతో జరుగుతోన్న దోపిడీ, మద్యం వల్ల సంభవిస్తున్న మరణాలు వంటి వివరాలను www.killerjbrands.com వెబ్సైట్లో పొందుపరుస్తామని టీడీపీ సీనియ‌ర్ నేతలు ఆనంద్‌బాబు, అశోక్‌బాబు, ఆచంట సునీత వెల్లడించారు. దశల వారీ మద్య నిషేధం హామీని జగన్ గాల్లో కలిపేశారని టీడీపీ నేతలు దుయ్యబట్టారు. మద్యం తయారీ మొదలుకుని అమ్మకాల వరకు ప్రభుత్వమే నడుపుతోందని ఆరోపించారు. జే-బ్రాండ్ల ద్వారా సరఫరా అయ్యే మద్యం ప్రాణాంతకంగా ఉందని మండిపడ్డారు. నాసిరకం మద్యంతో పేద మహిళల తాళిబొట్లు తెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజిటల్ క్యాంపెయినింగ్లో భాగస్వాములు కావాలని ప్రజలను కోరారు. మధ్యం మాఫియాపై ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని నేతలు స్పష్టం చేశారు.

మ‌రోవైపు.. ఇంటింటికీ కూడా టీడీపీ యాత్ర చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు నాయ‌కులు తెలిపారు. ప్ర‌భుత్వ మ‌ద్య విధానానికి వ్య‌తిరేకంగా.. ఉద్య‌మించాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. ప్ర‌తి ఇంటికి వెళ్లి.. ఏడాది కాలంలో మ‌ద్యంపై జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎంత సంపాయిస్తోందో.. ఎంత న‌కిలీ మ‌ద్యాన్ని ప్ర‌జ‌ల‌కు విక్ర‌యించి సొమ్ము చేసుకుంటోందో వివ‌రించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రూ ఈ న‌కిలీ మ‌ద్యం ఉద్య‌మంలో భాగ‌స్వాములు కావాల‌ని.. ప్ర‌భుత్వం ద‌మన నీతిని ఎండ‌గ‌ట్టాల‌ని.. నాయ‌కులు పిలుపునిచ్చారు.

This post was last modified on March 26, 2022 10:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ద ఒత్తిడిని ‘పెద్ది’ తట్టుకోగలదా

అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…

1 hour ago

అన్వేషణను అరెస్టు చేస్తారా?

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…

3 hours ago

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

5 hours ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

5 hours ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

6 hours ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

6 hours ago