Political News

ఏపీలో న‌కిలీ మ‌ద్యంపై టీడీపీ డిజిట‌ల్ యుద్దం

ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న జే బ్రాండ్ల క‌ట్ట‌డి.. క‌ల్తీ సారా మ‌ర‌ణాల‌పై టీడీపీ నేత‌లు మ‌రింత తీవ్రంగా పోరాడాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇప్ప‌టికే అటు అసెంబ్లీలోనూ.. ఇటు శాసన మండ‌లిలోనూ తీవ్ర‌స్తాయిలో యుద్ధం చేస్తున్న నాయ‌కులు.. మ‌రింత‌గా ప్ర‌జ‌ల్లో చైత‌న్యం క‌లిగించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీనిలో భాగంగా.. తాజాగా.. మ‌ద్యం మాఫియాపై ప్రత్యేక వెబ్‌సైట్ను రూపొందించినట్లు తెలుగుదేశం పార్టీ వెల్లడించింది.

మద్యం పేరుతో దోపిడీ, మరణాల వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచుతామని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఈ డిజిటల్ క్యాంపెయిన్‌లో ప్రజలు భాగస్వాములు కావాలని నేతలు కోరారు. ముఖ్యమంత్రి జగన్ నడిపిస్తున్న మద్యం మాఫియాపై జరిపే పోరాటంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తామంటూ.. తెలుగుదేశం ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించింది. ఏపీలో నాసిరకం మద్యం బ్రాండ్లు ప్రాణాలు తీస్తున్నాయంటూ.. టీడీపీ డిజిటల్ క్యాంపెయినింగ్ మొదలు పెట్టింది.

ప్రభుత్వ మద్యం పాలసీ, మద్యం పేరుతో జరుగుతోన్న దోపిడీ, మద్యం వల్ల సంభవిస్తున్న మరణాలు వంటి వివరాలను www.killerjbrands.com వెబ్సైట్లో పొందుపరుస్తామని టీడీపీ సీనియ‌ర్ నేతలు ఆనంద్‌బాబు, అశోక్‌బాబు, ఆచంట సునీత వెల్లడించారు. దశల వారీ మద్య నిషేధం హామీని జగన్ గాల్లో కలిపేశారని టీడీపీ నేతలు దుయ్యబట్టారు. మద్యం తయారీ మొదలుకుని అమ్మకాల వరకు ప్రభుత్వమే నడుపుతోందని ఆరోపించారు. జే-బ్రాండ్ల ద్వారా సరఫరా అయ్యే మద్యం ప్రాణాంతకంగా ఉందని మండిపడ్డారు. నాసిరకం మద్యంతో పేద మహిళల తాళిబొట్లు తెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజిటల్ క్యాంపెయినింగ్లో భాగస్వాములు కావాలని ప్రజలను కోరారు. మధ్యం మాఫియాపై ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని నేతలు స్పష్టం చేశారు.

మ‌రోవైపు.. ఇంటింటికీ కూడా టీడీపీ యాత్ర చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు నాయ‌కులు తెలిపారు. ప్ర‌భుత్వ మ‌ద్య విధానానికి వ్య‌తిరేకంగా.. ఉద్య‌మించాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. ప్ర‌తి ఇంటికి వెళ్లి.. ఏడాది కాలంలో మ‌ద్యంపై జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎంత సంపాయిస్తోందో.. ఎంత న‌కిలీ మ‌ద్యాన్ని ప్ర‌జ‌ల‌కు విక్ర‌యించి సొమ్ము చేసుకుంటోందో వివ‌రించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రూ ఈ న‌కిలీ మ‌ద్యం ఉద్య‌మంలో భాగ‌స్వాములు కావాల‌ని.. ప్ర‌భుత్వం ద‌మన నీతిని ఎండ‌గ‌ట్టాల‌ని.. నాయ‌కులు పిలుపునిచ్చారు.

This post was last modified on March 26, 2022 10:12 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

33 minutes ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

49 minutes ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

2 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

3 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

3 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

3 hours ago