Political News

ఆ జంపింగులు.. జ‌గ‌న్‌ను న‌మ్మ‌డం లేదా?

రాజ‌కీయాల్లో ఏమైనా జర‌గొచ్చు. ఎప్పుడు ఏం జ‌రుగుతుంద‌నేది చెప్ప‌డం కూడా క‌ష్ట‌మే… ఇప్పుడు ఏపీ లోనూ అదే జ‌రుగుతోంది. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత‌.. టీడీపీలో గెలిచిన న‌లుగురు ఎమ్మెల్యేలు.. వైసీపీకి అ నుకూలంగా మారిపోయారు. వీరు టెక్నిక‌ల్‌గా ఇప్ప‌టికీ.. టీడీపీ స‌భ్యులుగానే ఉన్నారు. ఈ పార్టీ స‌భ్యులు గానే అసెంబ్లీ నుంచి జీతం కూడా పొందుతున్నారు. రికార్డుల్లోనూ వీరు టీడీపీ స‌భ్యులుగానే చ‌లామ‌ణి అవుతున్నారు. అయిన‌ప్ప‌టికీ.. వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

వీరిలో చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం,, గ‌న్న‌వ‌రం ఎమ్మెల్య వ‌ల్ల‌భ‌నేని వంశీ, విశాఖ ద‌క్షిణం ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్‌, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరిధ‌ర్ ఉన్నారు. అయితే.. వీరిలో ముగ్గురు వైసీపీని విశ్వ‌సించ‌డం లేద‌నేవాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఎందుకంటే.. జ‌గ‌న్ త‌మ‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని.. ఆయ‌న పార్టీ మారే వ‌ర‌కు ఒక‌విధంగా త‌మ‌ను రెచ్చ‌గొట్టి.. పార్టీ నుంచి దూరం అయ్యేలా చేశార‌ని.. తీరా వ‌చ్చిన త‌ర్వాత‌.. క‌నీసం.. ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొనేందుకు అవ‌కాశం కూడా ఇవ్వ‌డం లేద‌ని.. వీరు బాధ‌ప‌డుతున్నారు.

మ‌రీ ముఖ్యంగా.. క‌ర‌ణం బ‌ల‌రాం, వాసుప‌ల్లి గ‌ణేష్‌, వ‌ల్ల‌భ‌నేని వంశీల ఆవేద‌న అంతా ఇంతా కాదు. ఎందుకంటే.. వీరికి ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ నుంచి అనుకూలత‌లేక పోగా తీవ్ర‌స్థాయిలో సెగ త‌గులుతోంది. నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ఇంచార్జ్‌లుగా వీరిని నియమించ‌రాద‌ని.. బాహాటంగానే వైసీపీ న‌నేత‌లు రోడ్డెక్కుతున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు గ‌న్న‌వరంలో ఈ వివాదం రోడ్డెక్కిన విష‌యం వార్త‌ల్లోకి వ‌చ్చింది. అయితే.. చీరాల‌లో ఎప్ప‌టి నుంచో క‌ర‌ణంకు వ్య‌తిరేకంగా.. ఆమంచి కృష్ణ‌మోహ‌న్ చ‌క్రం తిప్పుతున్నారు.

ఇక‌, విశాఖ ద‌క్షిణంలోనూ.. గ‌ణేష్‌కు వ్య‌తిరేకంగా.. వైసీపీ నాయ‌కులు.. రోడ్డెక్కుతున్నారు. వైసీపీని.. ఎప్ప టి నుంచో.. కాపాడుతున్నామ‌ని.. గ‌త ప్ర‌భుత్వంలో అనేక కేసులు పెట్టినా ఎదుర్కొని పార్టీకోసం ప‌నిచేశా మని.. కానీ, ఇప్పుడు వారికి ఇంచార్జ్‌లుగా అవ‌కాశం ఇస్తే.. మేం ఏం చేయాల‌ని. వైసీపీ నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. దీనికి అధిష్టానం.. స‌మాధానం చెప్పాల్సి ఉన్నా.. టీడీపీ నుంచి వ‌చ్చిన వారికి మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా.. చోద్యం చూస్తున్నారని.. అంటే.. త‌మ‌కు ఎలానూ భ‌రోసా లేకుండా పోయింద‌ని.. జంపింగులు ఆవేద‌న వ్య‌క్తం చేస్త‌న్నారు. ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ సైకిల్ వైపు అడుగులు వేస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 

This post was last modified on March 26, 2022 6:15 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

ఏపీలో ఆ జిల్లాల‌కు ఒక క‌లెక్ట‌ర్‌-ముగ్గురు ఎస్పీలు !

ఏపీలో ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం చెల‌రేగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌ను నిలువ‌రించ‌లేక పోయిన‌.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా క‌లెక్ట‌రు, ముగ్గురు ఎస్పీలు) వేటు…

14 hours ago

మహేష్ బాబు కోసం వరదరాజ మన్నార్ ?

ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…

14 hours ago

లండ‌న్‌లో జ‌గ‌న్… ఫ‌స్ట్ లుక్ ఇదే!

ఏపీ సీఎం జ‌గ‌న్ కుటుంబ స‌మేతంగా విహార యాత్ర‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే. స‌తీమ‌ణి వైఎస్ భార‌తి, కుమార్తెలు హ‌ర్ష‌,…

16 hours ago

నమ్మశక్యం కాని రీతిలో కంగువ యుద్ధం

మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…

16 hours ago

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

20 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

22 hours ago