Political News

ఆ జంపింగులు.. జ‌గ‌న్‌ను న‌మ్మ‌డం లేదా?

రాజ‌కీయాల్లో ఏమైనా జర‌గొచ్చు. ఎప్పుడు ఏం జ‌రుగుతుంద‌నేది చెప్ప‌డం కూడా క‌ష్ట‌మే… ఇప్పుడు ఏపీ లోనూ అదే జ‌రుగుతోంది. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత‌.. టీడీపీలో గెలిచిన న‌లుగురు ఎమ్మెల్యేలు.. వైసీపీకి అ నుకూలంగా మారిపోయారు. వీరు టెక్నిక‌ల్‌గా ఇప్ప‌టికీ.. టీడీపీ స‌భ్యులుగానే ఉన్నారు. ఈ పార్టీ స‌భ్యులు గానే అసెంబ్లీ నుంచి జీతం కూడా పొందుతున్నారు. రికార్డుల్లోనూ వీరు టీడీపీ స‌భ్యులుగానే చ‌లామ‌ణి అవుతున్నారు. అయిన‌ప్ప‌టికీ.. వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

వీరిలో చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం,, గ‌న్న‌వ‌రం ఎమ్మెల్య వ‌ల్ల‌భ‌నేని వంశీ, విశాఖ ద‌క్షిణం ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్‌, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరిధ‌ర్ ఉన్నారు. అయితే.. వీరిలో ముగ్గురు వైసీపీని విశ్వ‌సించ‌డం లేద‌నేవాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఎందుకంటే.. జ‌గ‌న్ త‌మ‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని.. ఆయ‌న పార్టీ మారే వ‌ర‌కు ఒక‌విధంగా త‌మ‌ను రెచ్చ‌గొట్టి.. పార్టీ నుంచి దూరం అయ్యేలా చేశార‌ని.. తీరా వ‌చ్చిన త‌ర్వాత‌.. క‌నీసం.. ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొనేందుకు అవ‌కాశం కూడా ఇవ్వ‌డం లేద‌ని.. వీరు బాధ‌ప‌డుతున్నారు.

మ‌రీ ముఖ్యంగా.. క‌ర‌ణం బ‌ల‌రాం, వాసుప‌ల్లి గ‌ణేష్‌, వ‌ల్ల‌భ‌నేని వంశీల ఆవేద‌న అంతా ఇంతా కాదు. ఎందుకంటే.. వీరికి ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ నుంచి అనుకూలత‌లేక పోగా తీవ్ర‌స్థాయిలో సెగ త‌గులుతోంది. నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ఇంచార్జ్‌లుగా వీరిని నియమించ‌రాద‌ని.. బాహాటంగానే వైసీపీ న‌నేత‌లు రోడ్డెక్కుతున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు గ‌న్న‌వరంలో ఈ వివాదం రోడ్డెక్కిన విష‌యం వార్త‌ల్లోకి వ‌చ్చింది. అయితే.. చీరాల‌లో ఎప్ప‌టి నుంచో క‌ర‌ణంకు వ్య‌తిరేకంగా.. ఆమంచి కృష్ణ‌మోహ‌న్ చ‌క్రం తిప్పుతున్నారు.

ఇక‌, విశాఖ ద‌క్షిణంలోనూ.. గ‌ణేష్‌కు వ్య‌తిరేకంగా.. వైసీపీ నాయ‌కులు.. రోడ్డెక్కుతున్నారు. వైసీపీని.. ఎప్ప టి నుంచో.. కాపాడుతున్నామ‌ని.. గ‌త ప్ర‌భుత్వంలో అనేక కేసులు పెట్టినా ఎదుర్కొని పార్టీకోసం ప‌నిచేశా మని.. కానీ, ఇప్పుడు వారికి ఇంచార్జ్‌లుగా అవ‌కాశం ఇస్తే.. మేం ఏం చేయాల‌ని. వైసీపీ నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. దీనికి అధిష్టానం.. స‌మాధానం చెప్పాల్సి ఉన్నా.. టీడీపీ నుంచి వ‌చ్చిన వారికి మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా.. చోద్యం చూస్తున్నారని.. అంటే.. త‌మ‌కు ఎలానూ భ‌రోసా లేకుండా పోయింద‌ని.. జంపింగులు ఆవేద‌న వ్య‌క్తం చేస్త‌న్నారు. ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ సైకిల్ వైపు అడుగులు వేస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 

This post was last modified on March 26, 2022 6:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

1 hour ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

2 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

2 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

4 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

4 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

6 hours ago