Political News

ఆ జంపింగులు.. జ‌గ‌న్‌ను న‌మ్మ‌డం లేదా?

రాజ‌కీయాల్లో ఏమైనా జర‌గొచ్చు. ఎప్పుడు ఏం జ‌రుగుతుంద‌నేది చెప్ప‌డం కూడా క‌ష్ట‌మే… ఇప్పుడు ఏపీ లోనూ అదే జ‌రుగుతోంది. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత‌.. టీడీపీలో గెలిచిన న‌లుగురు ఎమ్మెల్యేలు.. వైసీపీకి అ నుకూలంగా మారిపోయారు. వీరు టెక్నిక‌ల్‌గా ఇప్ప‌టికీ.. టీడీపీ స‌భ్యులుగానే ఉన్నారు. ఈ పార్టీ స‌భ్యులు గానే అసెంబ్లీ నుంచి జీతం కూడా పొందుతున్నారు. రికార్డుల్లోనూ వీరు టీడీపీ స‌భ్యులుగానే చ‌లామ‌ణి అవుతున్నారు. అయిన‌ప్ప‌టికీ.. వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

వీరిలో చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం,, గ‌న్న‌వ‌రం ఎమ్మెల్య వ‌ల్ల‌భ‌నేని వంశీ, విశాఖ ద‌క్షిణం ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్‌, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరిధ‌ర్ ఉన్నారు. అయితే.. వీరిలో ముగ్గురు వైసీపీని విశ్వ‌సించ‌డం లేద‌నేవాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఎందుకంటే.. జ‌గ‌న్ త‌మ‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని.. ఆయ‌న పార్టీ మారే వ‌ర‌కు ఒక‌విధంగా త‌మ‌ను రెచ్చ‌గొట్టి.. పార్టీ నుంచి దూరం అయ్యేలా చేశార‌ని.. తీరా వ‌చ్చిన త‌ర్వాత‌.. క‌నీసం.. ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొనేందుకు అవ‌కాశం కూడా ఇవ్వ‌డం లేద‌ని.. వీరు బాధ‌ప‌డుతున్నారు.

మ‌రీ ముఖ్యంగా.. క‌ర‌ణం బ‌ల‌రాం, వాసుప‌ల్లి గ‌ణేష్‌, వ‌ల్ల‌భ‌నేని వంశీల ఆవేద‌న అంతా ఇంతా కాదు. ఎందుకంటే.. వీరికి ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ నుంచి అనుకూలత‌లేక పోగా తీవ్ర‌స్థాయిలో సెగ త‌గులుతోంది. నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ఇంచార్జ్‌లుగా వీరిని నియమించ‌రాద‌ని.. బాహాటంగానే వైసీపీ న‌నేత‌లు రోడ్డెక్కుతున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు గ‌న్న‌వరంలో ఈ వివాదం రోడ్డెక్కిన విష‌యం వార్త‌ల్లోకి వ‌చ్చింది. అయితే.. చీరాల‌లో ఎప్ప‌టి నుంచో క‌ర‌ణంకు వ్య‌తిరేకంగా.. ఆమంచి కృష్ణ‌మోహ‌న్ చ‌క్రం తిప్పుతున్నారు.

ఇక‌, విశాఖ ద‌క్షిణంలోనూ.. గ‌ణేష్‌కు వ్య‌తిరేకంగా.. వైసీపీ నాయ‌కులు.. రోడ్డెక్కుతున్నారు. వైసీపీని.. ఎప్ప టి నుంచో.. కాపాడుతున్నామ‌ని.. గ‌త ప్ర‌భుత్వంలో అనేక కేసులు పెట్టినా ఎదుర్కొని పార్టీకోసం ప‌నిచేశా మని.. కానీ, ఇప్పుడు వారికి ఇంచార్జ్‌లుగా అవ‌కాశం ఇస్తే.. మేం ఏం చేయాల‌ని. వైసీపీ నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. దీనికి అధిష్టానం.. స‌మాధానం చెప్పాల్సి ఉన్నా.. టీడీపీ నుంచి వ‌చ్చిన వారికి మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా.. చోద్యం చూస్తున్నారని.. అంటే.. త‌మ‌కు ఎలానూ భ‌రోసా లేకుండా పోయింద‌ని.. జంపింగులు ఆవేద‌న వ్య‌క్తం చేస్త‌న్నారు. ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ సైకిల్ వైపు అడుగులు వేస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 

This post was last modified on March 26, 2022 6:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

27 minutes ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

1 hour ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

2 hours ago

యుద్ధంలో కేబుల్స్ కట్?

అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…

2 hours ago

హైదరాబాద్ లో కొత్త ట్రెండ్.. ‘పారా నార్మల్ టాక్స్’

రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…

2 hours ago

7 గంటల 30 నిముషాలు… చరిత్రలో మొదటిసారి

వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…

3 hours ago