రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందనేది చెప్పడం కూడా కష్టమే… ఇప్పుడు ఏపీ లోనూ అదే జరుగుతోంది. గత ఎన్నికల తర్వాత.. టీడీపీలో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు.. వైసీపీకి అ నుకూలంగా మారిపోయారు. వీరు టెక్నికల్గా ఇప్పటికీ.. టీడీపీ సభ్యులుగానే ఉన్నారు. ఈ పార్టీ సభ్యులు గానే అసెంబ్లీ నుంచి జీతం కూడా పొందుతున్నారు. రికార్డుల్లోనూ వీరు టీడీపీ సభ్యులుగానే చలామణి అవుతున్నారు. అయినప్పటికీ.. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.
వీరిలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం,, గన్నవరం ఎమ్మెల్య వల్లభనేని వంశీ, విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ ఉన్నారు. అయితే.. వీరిలో ముగ్గురు వైసీపీని విశ్వసించడం లేదనేవాదన బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే.. జగన్ తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని.. ఆయన పార్టీ మారే వరకు ఒకవిధంగా తమను రెచ్చగొట్టి.. పార్టీ నుంచి దూరం అయ్యేలా చేశారని.. తీరా వచ్చిన తర్వాత.. కనీసం.. పట్టించుకోవడం లేదని.. తమ సమస్యలు చెప్పుకొనేందుకు అవకాశం కూడా ఇవ్వడం లేదని.. వీరు బాధపడుతున్నారు.
మరీ ముఖ్యంగా.. కరణం బలరాం, వాసుపల్లి గణేష్, వల్లభనేని వంశీల ఆవేదన అంతా ఇంతా కాదు. ఎందుకంటే.. వీరికి ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి అనుకూలతలేక పోగా తీవ్రస్థాయిలో సెగ తగులుతోంది. నియోజకవర్గంలో వైసీపీ ఇంచార్జ్లుగా వీరిని నియమించరాదని.. బాహాటంగానే వైసీపీ ననేతలు రోడ్డెక్కుతున్నారు. నిన్న మొన్నటి వరకు గన్నవరంలో ఈ వివాదం రోడ్డెక్కిన విషయం వార్తల్లోకి వచ్చింది. అయితే.. చీరాలలో ఎప్పటి నుంచో కరణంకు వ్యతిరేకంగా.. ఆమంచి కృష్ణమోహన్ చక్రం తిప్పుతున్నారు.
ఇక, విశాఖ దక్షిణంలోనూ.. గణేష్కు వ్యతిరేకంగా.. వైసీపీ నాయకులు.. రోడ్డెక్కుతున్నారు. వైసీపీని.. ఎప్ప టి నుంచో.. కాపాడుతున్నామని.. గత ప్రభుత్వంలో అనేక కేసులు పెట్టినా ఎదుర్కొని పార్టీకోసం పనిచేశా మని.. కానీ, ఇప్పుడు వారికి ఇంచార్జ్లుగా అవకాశం ఇస్తే.. మేం ఏం చేయాలని. వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. దీనికి అధిష్టానం.. సమాధానం చెప్పాల్సి ఉన్నా.. టీడీపీ నుంచి వచ్చిన వారికి మద్దతు ఇవ్వకుండా.. చోద్యం చూస్తున్నారని.. అంటే.. తమకు ఎలానూ భరోసా లేకుండా పోయిందని.. జంపింగులు ఆవేదన వ్యక్తం చేస్తన్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ సైకిల్ వైపు అడుగులు వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on March 26, 2022 6:15 pm
దర్శకుడిగానే కాదు నిర్మాతగా కూడా తన అభిరుచి ఏంటన్నది ప్రేక్షకులకు తెలియచేస్తూ సుకుమార్ చేసే ప్రయత్నాలు తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్…
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…