రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందనేది చెప్పడం కూడా కష్టమే… ఇప్పుడు ఏపీ లోనూ అదే జరుగుతోంది. గత ఎన్నికల తర్వాత.. టీడీపీలో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు.. వైసీపీకి అ నుకూలంగా మారిపోయారు. వీరు టెక్నికల్గా ఇప్పటికీ.. టీడీపీ సభ్యులుగానే ఉన్నారు. ఈ పార్టీ సభ్యులు గానే అసెంబ్లీ నుంచి జీతం కూడా పొందుతున్నారు. రికార్డుల్లోనూ వీరు టీడీపీ సభ్యులుగానే చలామణి అవుతున్నారు. అయినప్పటికీ.. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.
వీరిలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం,, గన్నవరం ఎమ్మెల్య వల్లభనేని వంశీ, విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ ఉన్నారు. అయితే.. వీరిలో ముగ్గురు వైసీపీని విశ్వసించడం లేదనేవాదన బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే.. జగన్ తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని.. ఆయన పార్టీ మారే వరకు ఒకవిధంగా తమను రెచ్చగొట్టి.. పార్టీ నుంచి దూరం అయ్యేలా చేశారని.. తీరా వచ్చిన తర్వాత.. కనీసం.. పట్టించుకోవడం లేదని.. తమ సమస్యలు చెప్పుకొనేందుకు అవకాశం కూడా ఇవ్వడం లేదని.. వీరు బాధపడుతున్నారు.
మరీ ముఖ్యంగా.. కరణం బలరాం, వాసుపల్లి గణేష్, వల్లభనేని వంశీల ఆవేదన అంతా ఇంతా కాదు. ఎందుకంటే.. వీరికి ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి అనుకూలతలేక పోగా తీవ్రస్థాయిలో సెగ తగులుతోంది. నియోజకవర్గంలో వైసీపీ ఇంచార్జ్లుగా వీరిని నియమించరాదని.. బాహాటంగానే వైసీపీ ననేతలు రోడ్డెక్కుతున్నారు. నిన్న మొన్నటి వరకు గన్నవరంలో ఈ వివాదం రోడ్డెక్కిన విషయం వార్తల్లోకి వచ్చింది. అయితే.. చీరాలలో ఎప్పటి నుంచో కరణంకు వ్యతిరేకంగా.. ఆమంచి కృష్ణమోహన్ చక్రం తిప్పుతున్నారు.
ఇక, విశాఖ దక్షిణంలోనూ.. గణేష్కు వ్యతిరేకంగా.. వైసీపీ నాయకులు.. రోడ్డెక్కుతున్నారు. వైసీపీని.. ఎప్ప టి నుంచో.. కాపాడుతున్నామని.. గత ప్రభుత్వంలో అనేక కేసులు పెట్టినా ఎదుర్కొని పార్టీకోసం పనిచేశా మని.. కానీ, ఇప్పుడు వారికి ఇంచార్జ్లుగా అవకాశం ఇస్తే.. మేం ఏం చేయాలని. వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. దీనికి అధిష్టానం.. సమాధానం చెప్పాల్సి ఉన్నా.. టీడీపీ నుంచి వచ్చిన వారికి మద్దతు ఇవ్వకుండా.. చోద్యం చూస్తున్నారని.. అంటే.. తమకు ఎలానూ భరోసా లేకుండా పోయిందని.. జంపింగులు ఆవేదన వ్యక్తం చేస్తన్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ సైకిల్ వైపు అడుగులు వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on March 26, 2022 6:15 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…