Political News

ఆ జంపింగులు.. జ‌గ‌న్‌ను న‌మ్మ‌డం లేదా?

రాజ‌కీయాల్లో ఏమైనా జర‌గొచ్చు. ఎప్పుడు ఏం జ‌రుగుతుంద‌నేది చెప్ప‌డం కూడా క‌ష్ట‌మే… ఇప్పుడు ఏపీ లోనూ అదే జ‌రుగుతోంది. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత‌.. టీడీపీలో గెలిచిన న‌లుగురు ఎమ్మెల్యేలు.. వైసీపీకి అ నుకూలంగా మారిపోయారు. వీరు టెక్నిక‌ల్‌గా ఇప్ప‌టికీ.. టీడీపీ స‌భ్యులుగానే ఉన్నారు. ఈ పార్టీ స‌భ్యులు గానే అసెంబ్లీ నుంచి జీతం కూడా పొందుతున్నారు. రికార్డుల్లోనూ వీరు టీడీపీ స‌భ్యులుగానే చ‌లామ‌ణి అవుతున్నారు. అయిన‌ప్ప‌టికీ.. వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

వీరిలో చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం,, గ‌న్న‌వ‌రం ఎమ్మెల్య వ‌ల్ల‌భ‌నేని వంశీ, విశాఖ ద‌క్షిణం ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్‌, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరిధ‌ర్ ఉన్నారు. అయితే.. వీరిలో ముగ్గురు వైసీపీని విశ్వ‌సించ‌డం లేద‌నేవాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఎందుకంటే.. జ‌గ‌న్ త‌మ‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని.. ఆయ‌న పార్టీ మారే వ‌ర‌కు ఒక‌విధంగా త‌మ‌ను రెచ్చ‌గొట్టి.. పార్టీ నుంచి దూరం అయ్యేలా చేశార‌ని.. తీరా వ‌చ్చిన త‌ర్వాత‌.. క‌నీసం.. ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొనేందుకు అవ‌కాశం కూడా ఇవ్వ‌డం లేద‌ని.. వీరు బాధ‌ప‌డుతున్నారు.

మ‌రీ ముఖ్యంగా.. క‌ర‌ణం బ‌ల‌రాం, వాసుప‌ల్లి గ‌ణేష్‌, వ‌ల్ల‌భ‌నేని వంశీల ఆవేద‌న అంతా ఇంతా కాదు. ఎందుకంటే.. వీరికి ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ నుంచి అనుకూలత‌లేక పోగా తీవ్ర‌స్థాయిలో సెగ త‌గులుతోంది. నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ఇంచార్జ్‌లుగా వీరిని నియమించ‌రాద‌ని.. బాహాటంగానే వైసీపీ న‌నేత‌లు రోడ్డెక్కుతున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు గ‌న్న‌వరంలో ఈ వివాదం రోడ్డెక్కిన విష‌యం వార్త‌ల్లోకి వ‌చ్చింది. అయితే.. చీరాల‌లో ఎప్ప‌టి నుంచో క‌ర‌ణంకు వ్య‌తిరేకంగా.. ఆమంచి కృష్ణ‌మోహ‌న్ చ‌క్రం తిప్పుతున్నారు.

ఇక‌, విశాఖ ద‌క్షిణంలోనూ.. గ‌ణేష్‌కు వ్య‌తిరేకంగా.. వైసీపీ నాయ‌కులు.. రోడ్డెక్కుతున్నారు. వైసీపీని.. ఎప్ప టి నుంచో.. కాపాడుతున్నామ‌ని.. గ‌త ప్ర‌భుత్వంలో అనేక కేసులు పెట్టినా ఎదుర్కొని పార్టీకోసం ప‌నిచేశా మని.. కానీ, ఇప్పుడు వారికి ఇంచార్జ్‌లుగా అవ‌కాశం ఇస్తే.. మేం ఏం చేయాల‌ని. వైసీపీ నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. దీనికి అధిష్టానం.. స‌మాధానం చెప్పాల్సి ఉన్నా.. టీడీపీ నుంచి వ‌చ్చిన వారికి మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా.. చోద్యం చూస్తున్నారని.. అంటే.. త‌మ‌కు ఎలానూ భ‌రోసా లేకుండా పోయింద‌ని.. జంపింగులు ఆవేద‌న వ్య‌క్తం చేస్త‌న్నారు. ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ సైకిల్ వైపు అడుగులు వేస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 

Satya

Recent Posts

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

1 hour ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

4 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

5 hours ago

పవన్ చెప్పిందేమిటి?… వీరు చేస్తున్నదేమిటీ?

రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…

5 hours ago

దీవానా సమస్య సెన్సార్ మాత్రమేనా

మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…

5 hours ago

రీ-నీట్… ఇంత చేసినా మళ్లీ సందేహాలు, ప్రశ్నలు!?

రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…

6 hours ago