Political News

అమ‌రావతి కోసం.. కేంద్రం ఏ చేసింది: ఎంపీ గ‌ల్లా

టీడీపీ పార్ల‌మెంటు స‌భ్యుడు(గుంటూరు).. గ‌ల్లా జ‌య‌దేవ్ పార్ల‌మెంటులో చాలా రోజుల త‌ర్వాత‌.. మ‌రోసారి అమ‌రావ‌తి ప్ర‌స్తావ‌న తెచ్చారు. గ‌తంలో ఒక‌సారి.. అమ‌రావ‌తి గురించి మాట్లాడిన ఆయ‌న మిస్ట‌ర్ పీఎం అంటూ.. మోడీని క‌డిగేశారు. త‌ర్వాత‌.. మ‌ళ్లీ ఎందుకో ఆయ‌న సైలెంట్ అయ్యారు. త‌ర్వాత‌.. ఇన్నాళ్ల‌కు మ‌రోసారి.. పార్ల‌మెంటులో  గ‌ల్లా గ‌ట్టిగానే అమ‌రావ‌తి గురించి ప్ర‌స్తావించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న తాజాగా 2022-23 వార్షిక బ‌డ్జెట్‌లో కేంద్రం.. అమ‌రావ‌తికి జ‌రిపిన కేటాయింపుల‌పై పెద‌వి విరిచారు.

కేంద్ర బడ్జెట్‌లో అమరావతికి సరిపడా నిధులు కేటాయించలేదని జయదేవ్ అసహనం వ్యక్తం చేశారు. అమరావతిని అభివృద్ధి చేసేలా కేంద్రం సహకరించాలని సభలో విన్నవించారు. అమరాతి రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని న్యాయస్థానం ఆదేశించినా.. రాష్ట్ర‌ ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. ఇక‌, కేంద్ర ప్ర‌భుత్వం కూడా నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని విమ‌ర్శించారు. ఏపీ రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. అమరావతిని అభివృద్ధి చేయాలని హైకోర్టు ఆదేశించినా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అన్నారు.

రాజ్యాంగాన్ని అతిక్రమించి.. చట్టాలు చేసే అధికారం అసెంబ్లీ, పార్లమెంట్కు లేదన్నారు. అదే విధంగా కేంద్ర బడ్జెట్లో అమరావతికి సరిపడా నిధులు కేటాయించలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. “శాసనవ్యవస్థ కంటే కూడా రాజ్యాంగం ఎంతో అత్యుత్తమైనది. ఏపీ రాజధాని అమరావతి అని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసింది. సీఆర్డీఏ చట్టం, మాస్టర్ ప్లాన్ ప్రకారం.. అమరాతిని, రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లోపు అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ ప్రభుత్వం ఏ ఒక్క పనిని మొదలుపెట్టలేదు.“ అని గ‌ల్లా ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

అదే విధంగా కేంద్ర బడ్జెట్‌లో అమరావతికి సరిపడా నిధులు కేటాయించకపోవడం నిరాశపరిచింది. ఇప్పటికైనా అమరావతికి సరిపడా నిధులు కేటాయించి అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాన‌ని గ‌ల్లా అన్నారు. ఇక‌, వికేంద్రీకరణ పేరుతో జగన్‌ రెడ్డి ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని.. విపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. శాసనసభలో మూడు రాజధానులపై జగన్‌ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మినహా అన్ని పార్టీల నేతలూ ముక్తకంఠంతో ఖండించారు. రాష్ట్రంలో రోడ్ల మీద పడిన గుంతల్లో మూడు గుంతలు కూడా మరమ్మతు చేయలేని జగన్‌ రెడ్డి.. మూడు రాజధానులు ఎలా కడతారని.. టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు. అభివృద్ధి గురించి మాట్లాడే నైతికహక్కు జగన్ మోహన్ రెడ్డికి లేదని అన్నారు.

This post was last modified on March 25, 2022 11:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

త‌ల‌వంచి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన రాజమౌళి తండ్రి

లెజెండ‌రీ రైట‌ర్‌, ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్.. ఒక స్టేజ్ మీద త‌ల‌వంచి క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశమైంది.…

6 hours ago

ఏఐ లోకి జియో… మరో మ్యాజిక్ చేస్తుందా?

భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…

7 hours ago

నచ్చే పని చేసిన కల్ట్ బ్లాక్ బస్టర్

వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…

8 hours ago

సుహాస్ స్టామినాకిది అగ్ని పరీక్ష

చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…

10 hours ago

ఇలాంటి రాజకీయ నాయకులను ఏమనాలి?

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు మద్దతుగా వ్యవహరిస్తూ…

10 hours ago

రాజు గారు రెచ్చిపోతున్నారు

నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్‌గా ఎదిగాక..…

10 hours ago