టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు.. పొత్తులకు ఏదో అవినాభావ సంబంధం ఉందనేది విశ్లేషకుల మాట. ఎన్నికల వస్తే చాలు ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకునే సంప్రదాయాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనసాగిస్తూ వస్తున్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మరణానంతరం బాబు ఒంటరిగా ఎన్నికల బరిలో దిగే పరిస్థితే లేకుండా పోయింది. 2019లో పైకి ఒంటరిగానే పోటీ చేసినట్లు కనిపించినా.. రహస్యంగా జనసేనతో పొత్తు పెట్టుకున్నారని బాబుపై వైసీపీ నేతలు విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే.
కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో ఆయన కచ్చితంగా మరోసారి ఒంటరిగా పోటీ చేసే సాహసం చేయరనే అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య పొత్తుకు మార్గం క్లియరవుతోందనే వార్తలు వస్తున్నాయి. ఇక బీజేపీని కలిపేసుకునేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది.
ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు తాజాగా బాబుకు విసిరిన సవాల్ ఆసక్తికరంగా మారింది. పొత్తులు లేకుండా టీడీపీ ఎన్నికలకు వెళ్లగలదా? అని వైసీపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ శాసనమండలిలో ప్రశ్నించారు. ధైర్యం ఉంటే ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించగలరా? అని సవాల్ విసిరారు. 2024లో తాము ఒంటరిగానే బరిలో దిగుతున్నామని ఆ దమ్ము టీడీపీకి ఉందా అని అనిల్ ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అనిల్ సవాల్పై టీడీపీ స్పందించే అవకాశం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
2024 ఎన్నికల్లో గెలవడం బాబుకు అత్యవసరం. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే ఇక పార్టీ రాజకీయ మనుగడ కష్టమే. ఈ విషయం బాబుకు తెలుసు. అందుకే మరోసారి పొత్తులతో వైసీపీకి చెక్ పెట్టాలని చూస్తున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పొత్తులకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎవరు ఎన్ని రకాలుగా రెచ్చగొట్టినా బాబు పొత్తులతోనే ముందుకు సాగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే పంతాలు పట్టింపులకు పోయి ఒంటరిగా దిగితే ఎలాంటి ఫలితం వస్తుందో బాబుకు తెలుసని నిపుణులు అంటున్నారు. అందుకే వైసీపీ నాయకులు ఎంతగా రెచ్చగొట్టినా బాబు మాత్రం సైలెంట్గానే ఉంటారని చెబుతున్నారు.
This post was last modified on March 22, 2022 2:44 pm
వైైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన కన్న తల్లి విజయమ్మ నుంచే భారీ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం పనిచేస్తోందని ఆరోపించిన కొన్ని గంటల వ్యవధిలోనే టీడీపీ యువనాయకుడు,…
సౌత్ దర్శకుల్లో రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ తర్వాత అంతకన్నా తక్కువో ఎక్కువో స్టార్ డం తెచ్చుకున్న వాళ్లలో లోకేష్ కనగరాజ్…
ఇటీవలే జరిగిన ఒక ఈవెంట్ లో అమీర్ ఖాన్ మాట్లాడుతూ థియేటర్ ఓటిటి మధ్య ఇప్పుడున్న గ్యాప్ సరిపోదని నాలుగు…
రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల ఇంచార్జ్లను మార్చనున్నట్లు వైసీపీ అధినేత జగన్ చెప్పారు. అయితే దీనికి కొంత సమయం పడుతుందన్నారు.…
పహల్ గాం ఉగ్రవాద దాడి తదనంతర పరిణామాల్లో భాగంగా మంగళవార తెల్లవారుజామున భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ భూభాగంలోని ఆ దేశ…