Political News

ఢిల్లీకి రేవంత్‌.. సీనియ‌ర్ల‌కు చెక్ పెట్టేందుకేనా?

తెలంగాణ‌లో కాంగ్రెస్ బ‌లోపేతం కోసం ఓ వైపు తాను ప్ర‌య‌త్నాలు చేస్తుంటే.. త‌న‌పై అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న సీనియ‌ర్ నేత‌ల‌కు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి సిద్ధ‌మ‌య్యారు. రాష్ట్రంలో పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌కుండా స‌ప‌రేటుగా స‌మావేశాలు పెట్టుకుంటున్న సీనియ‌ర్ల‌పై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకు రేవంత్ ఢిల్లీ వెళ్లిన‌ట్లు తెలిసింది. రాష్ట్ర పార్టీ వ్య‌వ‌హారాల బాధ్యుడు మాణికం ఠాగూర్‌ను క‌లిసి సీనియ‌ర్ నేత‌ల వైఖ‌రిపై రేవంత్ ఫిర్యాదు చేస్తార‌ని స‌మాచారం. ఇటీవ‌ల రేవంత్ నాయ‌క‌త్వాన్ని వ్య‌తిరేకిస్తూ వి.హ‌నుమంత‌రావు, జ‌గ్గారెడ్డి, మ‌ర్రి శ‌శిధ‌ర్‌రెడ్డి లాంటి అసంతృప్త నేత‌లు ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మైన సంగతి తెలిసిందే. మ‌రోవైపు కోమ‌టిరెడ్డి సోద‌రులు కూడా రేవంత్‌పై అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ పార్టీ మారే ప్ర‌యత్నాల్లో ప‌డ్డారు.

జ‌గ్గారెడ్డి విష‌యంలో..
తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డిని అధిష్ఠానం నియ‌మించ‌డంతో పార్టీలోని సీనియ‌ర్ల అసంతృప్తి బ‌య‌ట‌ప‌డింది. మొద‌టి నుంచి పార్టీ కోసం ప‌ని చేసిన వాళ్ల‌ను వ‌దిలేసి.. వేరే పార్టీ నుంచి వ‌చ్చిన రేవంత్‌కు ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌డంపై సీనియ‌ర్లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అప్ప‌టి నుంచి రేవంత్‌తో అంటిముట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇక రేవంత్ ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల‌తో ముందుకు సాగుతున్నార‌ని.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ చేప‌ట్టే కార్య‌క్ర‌మాల గురించి క‌నీస స‌మాచారం ఇవ్వ‌డం లేద‌ని సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి అసంతృప్తి వ్య‌క్తం చేశారు. పార్టీకి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌కటించి ఆ త‌ర్వాత దాన్ని వాయిదా వేసుకున్నారు. ఇప్పుడేమో రేవంత్‌పై పోరుకు ఇత‌ర సీనియ‌ర్ల‌తో క‌లిసి సై అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే జ‌గ్గారెడ్డికి టీపీసీసీ షాకిచ్చింది. ఆయ‌న‌కు కేటాయించిన అద‌న‌పు బాధ్య‌త‌ల నుంచి జ‌గ్గారెడ్డిని తప్పించింది.

ఎలా సాగాల‌ని..
జ‌గ్గారెడ్డిని పార్టీకి సంబంధించిన అద‌న‌పు బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించ‌డంతో ఇక‌పై ఏ విధంగా ముందుకు సాగాల‌నే విష‌యంపై మ‌ణికం ఠాగూర్‌తో రేవంత్ చ‌ర్చించ‌నున్న‌ట్లు స‌మాచారం. పార్టీ ప‌రిధి దాటి ఎవ‌రైనా ప్ర‌వ‌ర్తిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని జ‌గ్గారెడ్డి ఉదంతంతో మిగిలిన సీనియ‌ర్ల‌కు వార్నింగ్ ఇచ్చిన‌ట్ల‌యింది. దీంతో త‌న నాయ‌క‌త్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్న మిగిలిన సీనియ‌ర్ నాయ‌కుల వైఖ‌రి ప‌ట్ల అవ‌లంబించాల్సిన విధానం గురించి ఠాగూర్‌తో రేవంత్ చ‌ర్చించే అవ‌కాశం ఉంది. అస‌మ్మ‌తి నేత‌ల‌పై చ‌ర్య‌లు తీసుకునే విష‌యంలో అధిష్ఠానం వెనక్కి తగ్గేదే లేద‌నే స్పష్ట‌మైన సూచ‌న‌లు సీనియ‌ర్ల‌కు చేరేలా రేవంత్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న సాగ‌నుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. అధిష్ఠానం మద్ద‌తు ఎలాగో రేవంత్‌కే ఉంది కాబ‌ట్టి ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచి మిగిలిన నాయ‌కులు కూడా పార్టీ కోసం ప‌ని చేస్తే మేల‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

Satya

Recent Posts

మల్లారెడ్డి కారు దిగినట్టేనా…?

తెలుగు నేల రాజకీయాల్లో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి వ్యవహారం ఎప్పటికప్పుడు హాట్ కేక్…

12 minutes ago

జన నాయకుడు బుకింగ్స్ ఏం చెబుతున్నాయి

ఇంకో నాలుగు రోజుల్లో జన నాయకుడు విడుదల కానుంది. తమిళనాడు అడ్వాన్స్ బుకింగ్స్ జోరు మీద ఉన్నాయి. గంటకు పదమూడు…

3 hours ago

మళ్ళీ రేసులోకి వచ్చిన లెనిన్

బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ తెచ్చుకుని తొలి మూడు రోజులకే సూపర్ హిట్ ముద్ర వేయించేసుకున్న లెనిన్ తర్వాత వీక్ డేస్ లో…

4 hours ago

అనుపమ మాటలకు అర్థమేంటి?

పేరుకు మలయాళ హీరోయినే కానీ.. అనుపమ పరమేశ్వరన్ తెలుగులోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించింది, ఇక్కడే ఎక్కువ సినిమాలు చేసింది. మొదట్లో…

4 hours ago

యాంకర్‌కు అల్లు అరవింద్ ఛాన్స్?

యాంకర్లు ఎప్పుడూ యాంకర్లుగానే ఉండిపోవాల్సిన అవసరం లేదని.. వాళ్లు హీరోయిన్లుగా కూడా రాణించగలరని అనసూయ, రష్మి గౌతమ్ లాంటి వాళ్లు…

5 hours ago

అభిమానులకు చిరు కానుక… 5 లక్షల ఇన్సూరెన్స్

ప్రేక్షకులను దేవుళ్లుగా అభివర్ణిస్తారు. అభిమానులు లేకపోతే తాము లేమంటారు. కానీ ఆ ప్రేక్షకులు, అభిమానుల కోసం సినీ జనాలు ఏం…

5 hours ago