పెగాసస్పై ఎలాంటి విచారణకైనా సిద్ధమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సవాల్ విసిరారు. బాబాయ్ వివేకా హత్య, మద్యం మరణాలపైనా విచారణ కమిటీ వేయగలరా? అని ముఖ్యమంత్రి జగన్ కు ఆయన సవాల్ విసిరారు. పెగాసస్పై పశ్చిమ బెంగాల్ సీఎం మమత అసెంబ్లీలో మాట్లాడారనే దానిపై స్పష్టత లేదన్నారు. పెగాసెస్ సాఫ్ట్వేర్ను తాము కొనలేదని మాజీ డీజీపీ సవాంగ్ ఆర్టీఐ దరఖాస్తు దారుకు సమాధానం ఇచ్చారని గుర్తు చేశారు.
వ్యక్తిగత విషయాలు వినే అలవాటు తమకెవరికీ లేదన్న లోకేశ్.. వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకి ఉందేమోనని అందుకే ఆయన రాసలీలలు బయట పడ్డాయని దుయ్యబట్టారు. వ్యక్తులకు, ప్రైవేట్ సంస్ధలకు పెగాసెస్ సాఫ్ట్ వేర్ అమ్మలేదని ఇజ్రాయిల్ అంబాసిడర్ ప్రకటన కూడా చేశారన్నారు. అయినా నిబంధనలకు విరుద్దంగా సభలో పెగాసెస్ సాఫ్ట్ వేర్పై స్వల్ప కాలిక చర్చకు అనుమతించరని మండిపడ్డారు. తాము మద్యం మరణాలపై ప్రతి రోజూ డిమాండ్ చేస్తోంటే చర్చకు అనుమతించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తప్పుడు సమాచారంతో సభలో పెగాసస్పై చర్చ పెట్టారని ఆక్షేపించారు. కల్తీ సారా, కల్తీ మద్యంతో పేదలను చంపేస్తున్నారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. “పెగాసస్పై మమత అసెంబ్లీలో మాట్లాడారనే దానిపై స్పష్టత లేదు. పెగాసెస్ సాఫ్ట్వేర్ కొనలేదని మాజీ డీజీపీ సవాంగ్ ఆర్టీఐ దరఖాస్తు దారుకు సమాధానం ఇచ్చారు. వ్యక్తులకు.. ప్రైవేట్ సంస్ధలకు పెగాసెస్ సాఫ్ట్ వేర్ అమ్మలేదని ఇజ్రాయిల్ అంబాసిడర్ ప్రకటన కూడా చేశారు.
అయినా నిబంధనలకు విరుద్దంగా సభలో పెగాసెస్ సాఫ్ట్ వేర్ పై స్వల్ప కాలిక చర్చకు అనుమతించారు. మేం మద్యం మరణాలపై ప్రతి రోజూ డిమాండ్ చేస్తోంటే చర్చకు అనుమతించడం లేదు. ఏమన్నా అంటే 151 మంది ఉన్నారని అంటున్నారు.. భవిష్యత్తులో వైసీపీకి 15 మంది ఉండని పరిస్థితి. బాబాయ్ హత్య విషయంలోనూ అబద్దాలే ఆడారు.. డీఎస్పీ ప్రమోషన్ల విషయంవోనూ అబద్దాలే చెప్పారు.“ అని లోకేష్ విరుచుకుపడ్డారు. మరి దీనిపై వైసీపీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…
కోలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా చెప్పబడుతున్న జన నాయగన్…
రెండేళ్ల ముందు ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ.27 కోట్లతో లక్నో సూపర్ జెయింట్స్ టీం సొంతమైన ఆటగాడు రిషబ్ పంత్.…
ఏపీ సీఎం చంద్రబాబు.. గత వారం రోజులుగా మహానాడు నిర్వహణపై దృష్టి పెట్టారు. ఇదేసమయంలో పాలన పరంగా కూడా సమీక్షలు..…
మహేష్ బాబు ఫ్లాప్ సినిమాలు సైతం రీ రిలీజ్ లోనూ రికార్డులు సృష్టించడం చూశాం. ముఖ్యంగా ఖలేజాని చూసుకుంటే దానికొచ్చిన…
వైసీపీ అధినేత జగన్ ఆవేదన చెందుతున్నారా ? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలు.. పార్టీని…