Political News

సీఆర్డీఏకు లీగల్ నోటీసులు

పరిహారం కోరుతు రాజధాని అమరావతి రైతులు సీఆర్డీఏ కి లీగల్ నోటీసులు పంపారు. భూసమీకరణ నిబంధనల ప్రకారం తమ నుంచి భూములు తీసుకున్న ప్రభుత్వం మాట తప్పినందుకు తమకు పరిహారం ఇవ్వాల్సిందే అంటూ కొందరు రైతులు లీగల్ నోటీసులు జారీ చేశారు. వంశపారంపర్యంగా వచ్చిన భూములను రాజధాని నిర్మాణం చేస్తామంటే భూసమీకరణలో ఇచ్చామన్నారు.

భూసమీకరణలోని నిబంధనల ప్రకారం తుది ప్రకటన ఇచ్చిన ఏడాదిలోగా ప్లాట్ల విభజన, రోడ్లు నిర్మించి, భౌతికంగా ప్లాట్లను స్వాధీనం చేయాల్సిన ప్రభుత్వం చేయలేదన్నారు. మూడేళ్ళల్లో దశలవారీగా ఏర్పాటు చేయాల్సిన మౌళికవసతులను కూడా చేయలేదని నోటీసులో చెప్పారు. రైతులు ఇచ్చిన లీగల్ నోటీసుల ప్రకారం 2016, డిసెంబర్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భూసమీకరణకు తుది ప్రకటన ఇచ్చింది. అంటే 2017, డిసెంబర్ చివరలోగా ప్లాట్ల విభజించి, రోడ్ల నిర్మించి, భౌతికంగా ప్లాట్లను స్వాధీనం చేయలేదు. 

అయితే, అప్పట్లో ప్రతిపక్షాలు, కొందరు మేధావులు పర్యావరణ కేసులు వేసి ప్రాజెక్టు పనులు జరగకుండా చూశారు. దీంతో సీఆర్డీఏ చట్టం ప్రకారం చేయాల్సిన పనులను చంద్రబాబు ప్రభుత్వం చేయలేదని అర్ధమవుతోంది. దీని వల్ల 2019, డిసెంబర్లోగా రాజధానిలో అన్నీ రకాలుగా అభివృద్ధిచేసి, మౌళిక సదుపాయాలను అప్పటి ప్రభుత్వం  ఏర్పాటు చేయలేకపోయింది. 2019, మే లో ప్రభుత్వం మారి చంద్రబాబు స్ధానంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు.  జగన్ కూడా ఆరుమాసాల్లో పనులు చేపట్టలేదు.

అసలు అమరావతి రాజధానే కాదనేశారు. దాంతోనే రాజధాని పనులు తిశంకుస్వర్గంలో ఉండిపోయాయి. ఈమధ్య హైకోర్టు ఇచ్చిన తీర్పుతో మళ్ళీ కదలిక వస్తుందని అందరూ అనుకుంటున్నారు. మరి జగన్ ఏమి చేస్తారో చూడాలి. కారణాలు ఏవైనా  వైసీపీ వ్యవహారం వల్ల రాజధాని రైతులు నిలువునా ముంచిన విషయం తాజా లీగల్ నోటీసుల్లో స్పష్టమవుతోంది. భూసమీకరణ తదితరాలను రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్ (రెరా) ప్రకారం రిజిస్టర్ చేయాలట.   తాము కోరినట్లు పరిహారం ఇవ్వకపోతే హైకోర్టులో కేసు వేస్తామని రైతులు తమ లీగల్ నోటీసులో స్పష్టంగా చెప్పారు. మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

This post was last modified on March 21, 2022 5:49 pm

Share

Recent Posts

ఈ బంధాలే టీడీపీ బలం!

భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…

18 minutes ago

ఏ పోస్ట్ అయినా పెడతా… ఎలాంటి ఫోటో అయినా దిగుతా

టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…

49 minutes ago

హీరో కంటే దర్శకుడికే డ్యామేజ్

ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…

2 hours ago

జ‌గ‌న్‌కు సెగ‌: వైసీపీలో నిర‌స‌న స్వ‌రాలు.. !

వైసీపీలో జ‌గ‌న్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నార‌ని, ఆయ‌న గీసిన గీత దాట‌బోర‌ని చెప్పే వారు క‌నిపిస్తారు. అయితే.. తాజాగా…

3 hours ago

బ్రేకప్ బాధ నుంచి బ‌య‌ట‌ప‌డ్డ‌ట్లేనా?

క‌థానాయిక‌గా మ‌ల‌యాళంలో ప‌రిచ‌యం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవ‌కాశాలు అందుకున్న అమ్మాయి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్. ఆమె కెరీర్లో ఎక్కువ…

8 hours ago

ఎయిర్ పోర్టు లేకపోతే పిల్లనివ్వరా..?

వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…

8 hours ago