Political News

సీఆర్డీఏకు లీగల్ నోటీసులు

పరిహారం కోరుతు రాజధాని అమరావతి రైతులు సీఆర్డీఏ కి లీగల్ నోటీసులు పంపారు. భూసమీకరణ నిబంధనల ప్రకారం తమ నుంచి భూములు తీసుకున్న ప్రభుత్వం మాట తప్పినందుకు తమకు పరిహారం ఇవ్వాల్సిందే అంటూ కొందరు రైతులు లీగల్ నోటీసులు జారీ చేశారు. వంశపారంపర్యంగా వచ్చిన భూములను రాజధాని నిర్మాణం చేస్తామంటే భూసమీకరణలో ఇచ్చామన్నారు.

భూసమీకరణలోని నిబంధనల ప్రకారం తుది ప్రకటన ఇచ్చిన ఏడాదిలోగా ప్లాట్ల విభజన, రోడ్లు నిర్మించి, భౌతికంగా ప్లాట్లను స్వాధీనం చేయాల్సిన ప్రభుత్వం చేయలేదన్నారు. మూడేళ్ళల్లో దశలవారీగా ఏర్పాటు చేయాల్సిన మౌళికవసతులను కూడా చేయలేదని నోటీసులో చెప్పారు. రైతులు ఇచ్చిన లీగల్ నోటీసుల ప్రకారం 2016, డిసెంబర్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భూసమీకరణకు తుది ప్రకటన ఇచ్చింది. అంటే 2017, డిసెంబర్ చివరలోగా ప్లాట్ల విభజించి, రోడ్ల నిర్మించి, భౌతికంగా ప్లాట్లను స్వాధీనం చేయలేదు. 

అయితే, అప్పట్లో ప్రతిపక్షాలు, కొందరు మేధావులు పర్యావరణ కేసులు వేసి ప్రాజెక్టు పనులు జరగకుండా చూశారు. దీంతో సీఆర్డీఏ చట్టం ప్రకారం చేయాల్సిన పనులను చంద్రబాబు ప్రభుత్వం చేయలేదని అర్ధమవుతోంది. దీని వల్ల 2019, డిసెంబర్లోగా రాజధానిలో అన్నీ రకాలుగా అభివృద్ధిచేసి, మౌళిక సదుపాయాలను అప్పటి ప్రభుత్వం  ఏర్పాటు చేయలేకపోయింది. 2019, మే లో ప్రభుత్వం మారి చంద్రబాబు స్ధానంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు.  జగన్ కూడా ఆరుమాసాల్లో పనులు చేపట్టలేదు.

అసలు అమరావతి రాజధానే కాదనేశారు. దాంతోనే రాజధాని పనులు తిశంకుస్వర్గంలో ఉండిపోయాయి. ఈమధ్య హైకోర్టు ఇచ్చిన తీర్పుతో మళ్ళీ కదలిక వస్తుందని అందరూ అనుకుంటున్నారు. మరి జగన్ ఏమి చేస్తారో చూడాలి. కారణాలు ఏవైనా  వైసీపీ వ్యవహారం వల్ల రాజధాని రైతులు నిలువునా ముంచిన విషయం తాజా లీగల్ నోటీసుల్లో స్పష్టమవుతోంది. భూసమీకరణ తదితరాలను రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్ (రెరా) ప్రకారం రిజిస్టర్ చేయాలట.   తాము కోరినట్లు పరిహారం ఇవ్వకపోతే హైకోర్టులో కేసు వేస్తామని రైతులు తమ లీగల్ నోటీసులో స్పష్టంగా చెప్పారు. మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

This post was last modified on March 21, 2022 5:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

12 minutes ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

51 minutes ago

నాని టార్గెట్ స్పష్టంగా ఉంది

నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…

2 hours ago

ప‌రిష్కారం దొరికేసిన‌ట్టేనా.. `బీసీ బాబు`..

ఏపీ సీఎం చంద్ర‌బాబు... `బీసీ బాబు`గా మార‌నున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న స‌మ‌స్య‌ను పరిష్క‌రించేందుకు న‌డుంబిగించారా? అంటే.. ఔన‌నే…

5 hours ago

మాట జారొద్దు: జ‌న‌సేనలో కీల‌క చ‌ర్చ.. !

జ‌న‌సేన పార్టీ నాయ‌కుల‌కు ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. కీల‌క విష‌యాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…

5 hours ago

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

11 hours ago