ఒకప్పుడు కాంగ్రెస్ తో సఖ్యంగా ఉన్న ఆ గాలిపటం తరువాత ఆ బంధం ను తెంపుకుని ఇప్పుడు బీజేపీ తో పరోక్ష రీతిలో ప్రేమ పంచుకుంటోంది మరియు ప్రకటించుకుంటోంది. అందుకే ఓవైసీ తనకు తెలియకుండానే బీజేపీకి సాయం చేసి తరువాత దేశం గర్వించే స్థాయి పురస్కారాలకు ఎంపిక అయి ఉంటున్నారన్నది ప్రధాన విపక్షం ఆరోపణ.పైకి ఎంఐఎం ఏం మాట్లాడినా కూడా మతతత్వ పార్టీల అజెండా అంతా ఉద్రిక్తతలకు తావిచ్చేలా మాట్లాడడమేనని కాంగ్రెస్ తో సహా ఇతర పార్టీలు అన్నీ అభియోగాలు మోపుతూనే ఉన్నాయి. అంటే బీజేపీ బీ టీం ఎంఐఎం అని తేలిపోయింది. అదేవిధంగా ఎన్నో సందర్భాల్లో కాంగ్రెస్ కు సాయం చేసింది ఎంఐఎంనే అని కూడా మరిచిపోయి మరీ! ఇవాళ పాపం పాత మిత్రుడ్ని వివాదాల్లోకి దించుతోంది. ఓట్లూ,సీట్లూ ఎలా ఉన్నా కూడా కాంగ్రెస్ ఇచ్చిన లీక్ ఓ విధంగా మిగతా పార్లమెంటేరియన్లకు ఓ హెచ్చరిక లాంటిదే!
ఎంఐఎం అధినేత,ఎంపీ అసదుద్దీన్ ఐవైసీ కి బంపర్ ఆఫర్ దక్కనుంది అని కాంగ్రెస్ అంటోంది.ఇటీవలే సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ ను ప్లే చేస్తున్న కాంగ్రెస్ కొత్త సంగతి ఒకటి చెప్పింది. గత ఎన్నికల్లోనూ,ఇప్పుడూ కూడా బీజేపీకి ఎంతో సాయం చేసిన ఓవైసీకి 2022 ఏడాదికి బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డుతో సత్కరించనుందని కాంగ్రెస్ అంటోంది. మొన్నటి యూపీ ఎన్నికల్లో ఎంతగానో ఆ పార్టీ బీజేపీకి సాయం చేసినందుకు కృతజ్ఞతగా బీజేపీ నాయకులు ఓవైసీ రుణం ఈ విధంగా తీర్చుకోనున్నారని సమాచారం. ఇదంతా కాంగ్రెస్ పైకి చెబుతున్న మాట.
మరి! గతంలో ఇదే కాంగ్రెస్ కు ఎంఐఎం ఎంతగానో సాయం చేసిందన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి అని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎంఐఎంతో మంచి అనుబంధమే కాంగ్రెస్ కు ఉంది. తరువాత కాలంలో కేసీఆర్ కు కూడా ఆయనెంతో దగ్గర! ఇప్పుడు యూపీ ఎన్నికల్లో కాస్తో కూస్తో కమలం పార్టీకి అనుగుణంగానే ఉన్నారు. అందుకే ఆయనకు మంచి స్థాయిలో సత్కారం అందించాలన్నది యూపీ బీజేపీ పెద్దల సలహా.. అదేవిధంగా బీజేపీ అధినాయకత్వం ఆలోచన అన్నది కాంగ్రెస్ ఆరోపణ.
వాస్తవానికి మొన్నటి ఎన్నికల్లో యోగి హవాకు ఎంఐఎం ఊతం ఇచ్చింది పెద్దగా ఏం లేదు కానీ భావోద్వేగ సంబంధ రాజకీయం మాత్రం బాగానే నడిపారు. పైకి ఆయన బీజేపీపై నిప్పులు చెరిగినా పరోక్ష రీతిలో అసదుద్దీన్ ఓవైసీ బీజేపీకే సాయం చేశారు. కొన్ని కీలక ప్రకటనలు మరియు వ్యాఖ్యలు ఆ వేళ బాగానే పనిచేశాయి.అవన్నీ యోగి గెలుపు అవకాశాలను మెరుగుపరిచే ఉండాలి. అందుకే ఆయనకు సముచిత ప్రాధాన్యం ఇవాళ బీజేపీ ఇస్తుంది అన్నది ఓ ఆరోపణ.
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా…
తెలంగాణలో జనసేన అస్థిత్వంపై అనేక విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అనేక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం..ఆ తర్వాత…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్పల్లి…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో…
ఈ రోజు జనసేన తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళనం' సభకు తెలంగాణ పోలీసులు, హైకోర్టు…
దర్శకుడు గుణశేఖర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడేదో ఫ్లాపుల్లో ఉన్నారు కానీ ఒక్కడు, చూడాలని ఉంది, రామాయణం, సొగసు…