తెలంగాణ కాంగ్రెస్ మరోసారి కేసీఆర్ ఉచ్చులో బిగుసుకుందా..? టీఆర్ఎస్ రేస్ చేసినట్లుగా భావిస్తున్న ఒక ఇష్యూలో పాల్గొని కాంగ్రెస్ నేతలు తప్పు చేశారా..? అనవసర వివాదంలో ఇరుక్కొని ఒక వర్గం నేతల ఆగ్రహానికి గురయ్యారా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కొద్ది నెలల క్రితం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ లో కేసీఆర్ తో భేటీ కావడంతో ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా మరో సంఘటన అలాంటిదేనని చెప్పవచ్చు.
ఖమ్మం జిల్లాలో మరియమ్మ లాకప్ డెత్ కు సంబంధించిన విషయంలో పోలీసుల వైఖరిపై ఫిర్యాదు చేసేందుకు కేసీఆర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. వీరు అడిగిందే తడువుగా కేసీఆర్ ప్రగతి భవన్ గేట్ ఓపెన్ చేయడంతో భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు ఆయనతో భేటీ అయ్యారు. అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికపై ఢిల్లీలో కసరత్తు జరుగుతోంది. రేవంత్ కు పదవి వచ్చే అవకాశం ఉందని తేలడంతోనే వీరు కేసీఆర్ తో చర్చించారని.. వీరు టీఆర్ఎస్ లో చేరడమే తరువాయి అనే విధంగా పార్టీ శ్రేణుల్లో సంకేతాలు వెళ్లాయి. దీంతో అధిష్ఠానం ఏమాత్రం ఆలస్యం చేయకుండా రేవంతునే అధ్యక్షుడిగా ఖరారు చేసింది. అలా ఆ గండం నుంచి కాంగ్రెస్ గట్టెక్కింది.
తాజాగా చిన జీయర్ విషయంలో కాంగ్రెస్ అత్యుత్సాహం ప్రదర్శించిందనే ఆరోపణలు వినవస్తున్నాయి. ప్రధాని ముచ్చింతల్ పర్యటన నుంచి చిన జీయర్ కు, కేసీఆర్ కు దూరం పెరిగింది. యాదాద్రిలో నిర్వహించనున్న ఉద్ఘాటనకు కూడా ఆహ్వానం పంపలేదు. అలాగే.. ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. చిన జీయర్ సమ్మక్క సారక్క గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్నాయని తెలంగాణ ప్రజలు అనుమానిస్తున్నారు. వారు దేవతలు కారని.. అడవి నుంచి వచ్చిన వారని వారి పేరిట వ్యాపారాలు చేస్తున్నారని ఆ వీడియోలో ఉంది. ఈ వీడియో బయటికి రావడం వెనుక అధికార పార్టీ హస్తం ఉందని ఒక వర్గం ఆరోపిస్తోంది. చిన జీయర్ కు, కేసీఆర్ కు విభేదాలు రావడంతోనే ఈ వీడియోను వదిలారని భావిస్తోంది.
అయితే.. టీఆర్ఎస్ కంటే ముందుగానే ఈ విషయంలో కాంగ్రెస్ స్పందించింది. తొలుత ములుగు ఎమ్మెల్యే సీతక్క చిన జీయర్ వ్యాఖ్యలను ఖండించారు. సమతామూర్తి విగ్రహం పేరుతో వ్యాపారం చేస్తున్నది ఆయనేనని ఆరోపించారు. చిన జీయర్ అంటే ఎప్పటి నుంచో పడని రేవంత్ రెడ్డి కూడా ఆయనపై ఘాటుగానే విమర్శలు చేశారు. యాదాద్రి సలహాదారు పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో టీఆర్ఎస్సే గమ్మున ఉంటే కాంగ్రెస్ నేతలు అనవసరంగా కెలుక్కుని ఈ వివాదంలో చిక్కుకున్నారని మరో వర్గం అభిప్రాయపడుతోంది. మరోసారి కేసీఆర్ ట్రాప్ లో పడిపోయారని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..!
This post was last modified on March 19, 2022 9:57 pm
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…