Political News

ఏపీ అధికారుల‌కు ప‌న్నుల టార్గెట్ ఎంతో తెలుసా?

ప‌న్నుల వ‌సూలుకు సంబంధించి ఏపీలో విప‌రీతం అయిన చ‌ర్చ న‌డుస్తోంది. ఒక‌టి ఇంటి ప‌న్ను,రెండు చెత్త ప‌న్ను ఈ రెండింటిపై కూడా అధికారులు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. వీటి టార్గెట్ అక్ష‌రాలా వెయ్యి కోట్ల రూపాయ‌లు.ముఖ్యంగా జ‌గ‌న్ స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి చెత్త ప‌న్ను వ‌సూలుపై దృష్టి సారించినా ఇప్ప‌టివ‌ర‌కూ సంబంధిత చ‌ర్య‌లేవీ స‌త్ఫ‌లితాలు ఇవ్వ‌లేదు. క్లీన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ (క్లాప్) పేరిట చేప‌ట్టిన కార్య‌క్ర‌మం కూడా ఇంకా పూర్తి స్థాయిలో అమ‌లు కాలేదు. ఈ ప‌థ‌కం కింద చెత్త త‌ర‌లింపు వాహ‌నాలు అయితే కొనుగోలు చేశారు. అదేవిధంగా ఇంటింటికీ మూడు చెత్త బుట్ట‌ల‌ను పంపిణీ చేశారు. ఇవి మిన‌హా క్లీన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ పేరిట డంపింగ్ యార్డుల నిర్వ‌హ‌ణ, చెత్త రీ సైక్లింగ్ ప్రాసెస్ త‌దిత‌ర ప‌నుల‌కు పెద్ద‌గా జ‌గ‌న్ స‌ర్కారు ప్రాధాన్యం ఇవ్వ‌డం లేదు.

మ‌రోవైపు పారిశుద్ధ్య సిబ్బంది జీతాల పెంపు అగ‌మ్య‌గోచ‌రంగా ఉంది. కొన్ని పంచాయ‌తీల‌ను న‌గ‌ర పాలక సంస్థ‌ల్లో విలీనం చేసిన‌ప్ప‌టికీ ఇప్ప‌టికీ సంబంధిత వ‌ర్గాల‌కు రెండు నెల‌లుగా జీతాల్లేవు. శ్రీ‌కాకుళం న‌గ‌రానికి శివారున ఉన్న పంచాయ‌తీల‌ను విలీనం చేశారే త‌ప్ప సంబంధిత పారిశుద్ధ్య కార్మికులకు రెండు నెల‌లుగా జీతాల చెల్లింపే లేదు.దీంతో వీరంతా క‌న్నీటి ప‌ర్యంతం అవుతున్నారు.

ఇక చెత్త‌ప‌న్ను వ‌సూలు పై ఇప్ప‌టికే చాలా చోట్ల నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి.ఆశించిన రీతిలో చెత్త త‌ర‌లింపు, వీధుల శుభ్ర‌త లేన‌ప్పుడు తామెందుకు చెత్త ప‌న్ను క‌ట్టాల‌ని చాలా చోట్ల స్థానికుల నుంచి నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ముఖ్యంగా మున్సిపాల్టీలలో పారిశుద్ధ్య సిబ్బంది కొర‌త ఒక‌టి ప్ర‌ధానంగా వేధిస్తోంది.సిబ్బంది పెంపుపై జ‌గ‌న్ స‌ర్కారు దృష్టి సారిస్తున్న దాఖ‌లాలు ఏవీ లేవ‌ని విప‌క్షం నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. పెరుగుతున్న జ‌నాభా వారి అవ‌స‌రాల‌కు అనుగుణంగా విస్త‌రిస్తున్న న‌గ‌ర లేదా ప‌ల్లె సంస్కృతి వీట‌న్నింటి కార‌ణంగా ఇవాళ పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ అన్నది అధికారుల‌కు భారంగానే ఉంది.

ఉన్న కొద్దిపాటి సిబ్బందితోనే ప‌నులు చేయిస్తున్నా వారికి కూడా స‌కాలంలో జీతాలు ఇవ్వ‌లేక‌పోతున్నామ‌న్న‌ది ఉన్న‌తాధికారుల ఆవేద‌న.ఇవ‌న్నీ ఎలా ఉన్నా కూడా క్షేత్ర స్థాయిలో వ‌లంటీర్లు కూడా తీవ్ర ఒత్తిడితోనే ఉన్నారు. చెత్త ప‌న్ను వ‌సూలుతో పాటు ఇంటి ప‌న్ను వ‌సూలు బాధ్య‌త‌లు కూడా వీరికే అప్ప‌గించేందుకు స‌చివాల‌య అధికారులు యోచిస్తున్నారు.అందుకు అనుగుణంగా కార్యాచ‌ర‌ణ‌ను రూపొందిస్తున్నారు. మ‌రోవైపు ఆర్థిక సంవ‌త్స‌రం ముగిసేందుకు స‌మ‌యం స‌మీపిస్తుండ‌డంతో సంబంధిత ల‌క్ష్యాలు చేరుకునేందుకు స‌చివాల‌య ఉద్యోగులు, వార్డు వ‌లంటీర్లు ప‌రుగులు తీస్తున్నారు.కాకినాడ మున్సిపాల్టీ లాంటి ప్రాంతాల‌లో సామాన్లు జ‌ప్తు చేసేందుకు కూడా సిబ్బంది వెనుకాడ‌డం లేదు.

This post was last modified on March 19, 2022 8:30 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఉనికిని చాటడానికి ‘రాకాస’ ప్లాన్లు

చిన్న సినిమాను పెద్దగా ప్రమోట్ చేస్తే తప్ప జనాలకు సులభంగా రీచ్ కాలేని రోజులివి. అందుకే లిటిల్ హార్ట్స్ ప్రొడక్షన్…

4 hours ago

డీజిల్ లేదు… అంత్యక్రియలు ఆపేస్తారా?

మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు థాయిలాండ్‌లోని అంత్యక్రియలపై పడింది. దేశంలో తీవ్రమైన డీజిల్ కొరత ఏర్పడటంతో బౌద్ధ దేవాలయాల్లో…

5 hours ago

సల్మాన్ సినిమా మునిగినట్లేనా?

బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన సల్మాన్ ఖాన్.. నిఖార్సయిన హిట్టు ఎప్పుడు కొట్టాడో తన వీరాభిమానులు కూడా మరిచిపోయిన పరిస్థితి. దశాబ్దం…

8 hours ago

ఆంటీలతో చాట్ చేయండి అంటూ…

సోషల్ మీడియాలో ఆకర్షణీయ ప్రకటనలతో యువతను వలలో వేసుకునే హనీట్రాప్ యాప్స్‌పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి సీ సజ్జనార్…

8 hours ago

వామ్మో… కత్తిరింపుల్లోనే ఇంత హింస ఉందంటే

దురంధర్ ది రివెంజ్ రూట్ క్లియరైపోయింది. సెన్సార్ ఆలస్యమంటూ ఉదయం నుంచి తిరుగుతున్న వార్తలకు చెక్ పడింది. 1 నిమిషం…

8 hours ago

ప్రేక్షకులపై ‘ఉస్తాద్’ నిర్మాతల ప్రేమ నిజమా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సినిమాకు రెండు…

10 hours ago