Political News

ఏపీలో త‌దుప‌రి హోం మంత్రి ఎవ‌రు?

ఏపీలో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు దాదాపు ముహూర్తం ఖ‌రారైంది. వాస్త‌వానికి రెండున్న‌రేళ్ల‌లోనే మంత్రి వ‌ర్గాన్ని మారుస్తాన‌ని.. 2019 లోనే సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. మొత్తం 90 శాతం మందిని మారుస్తామ‌న్నారు. అయితే.. క‌రోనా నేప‌థ్యంలో ఈ మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న ఆల‌స్య‌మైంది. ఇక‌, ఎప్ప‌టిక‌ప్పుడు.. అదిగో ఇదిగో అంటూ.. ఊరిస్తూ వ‌చ్చార‌నే వాద‌న వైసీపీ నేత‌ల మ‌ధ్య ఉంది. ఇక‌, తాజాగా దీనిపై.. సీఎం జ‌గ‌న్ క్లారిటీ ఇచ్చారు. జూలై 8న దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతినిపుర‌స్క‌రించుకుని.. పార్టీ ప్లీన‌రీ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. ఇది అయిన త‌ర్వాత‌.. మంత్రి వ‌ర్గ కూర్పు ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ద‌క్కిన వారు అదృష్ట‌వంతులు.. ద‌క్క‌నివారు కాద‌నే వాద‌న కూడా స‌రైంది కాద‌న్నారు.

అంద‌రూ ముఖ్యులేన‌ని.. తెలిపారు. ఈ నేప‌థ్యంలో మంత్రి వ‌ర్గంపై ఆశ‌లు పెట్టుకున్న‌వారు.. మురిసిపోతున్నారు. ఇదిలావుం టే.. కీల‌కమైన శాఖ‌ల‌పై పార్టీలో విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఏ రాష్ట్రంలో అయినా.. కీల‌క‌మైన శాఖ‌గా.. హోం శాఖ‌ను పేర్కొం టారు. అదేవిధంగా ఏపీలోనూ ఈ శాఖ‌ను త‌దుప‌రి ఎవ‌రికి కేటాయిస్తార‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఈ శాఖ విష‌యంలో జ‌గ‌న్ .. ఎస్సీ వ‌ర్గానికి ప్రాధాన్యం ఇచ్చారు. 2019లో గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు నుంచి విజ‌యం ద‌క్కించుకున్న వైఎస్ కుటుంబానికి అత్యంత స‌న్నిహితురాలిగా పేరున్న సుచ‌రిత‌కు ఈ శాఖ‌ను అప్ప‌గించారు.

 సరే.. ఈ రెండున్న‌రేళ్ల‌లో ఆమె వివాదాలు ఎదుర్కొన‌డం.. మ‌హిళ హోం మంత్రిగా ఉండికూడా.. మ‌హిళ‌ల‌పై దాడులు అరిక‌ట్టలేక పోతున్నార‌నే వివాదాల్లో చిక్కుకోవ‌డం తెలిసిందే. అంతేకాదు.. కేవ‌లం పేరుకే.. ఆమె హోం మంత్రి అని.. ప‌రోక్షంగా ఓ స‌ల‌హాదారు చ‌క్రం తిప్పుతున్నార‌ని కూడా పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ఆమెను త‌ప్పించ‌డం ఖాయ‌మనే వాద‌న వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో ఈ ప‌ద‌విని ఎవరు ద‌క్కించుకుంటార‌నే అంశం.. వైసీపీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీసింది.

రంగంలో న‌లుగురు

హోం శాఖ‌పై ఆశ‌లు పెట్టుకున్న‌వారిలో న‌లుగురు మ‌హిళ‌లు క‌నిపిస్తున్నార‌ని అంటున్నారు వైసీపీ సీనియ‌ర్లు. వాస్త‌వానికి ఈ శాఖ‌ను మ‌హిళ‌కు, అందునా.. ఎస్సీ వ‌ర్గానికి కేటాయించిన నేప‌థ్యంలో తిరిగి ఆ వ‌ర్గానికే కేటాయించే అవ‌కాశం మెండుగా ఉంది. లేక‌పోతే.. పొలిటిక‌ల్‌గా విమ‌ర్శ‌లు వ‌చ్చే ఛాన్స్ క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో మ‌హిళ‌కే ఈ శాఖ‌ను అప్ప‌గించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది ఇక‌, ఈ శాఖ‌ను ద‌క్కించుకునే రేసులో న‌లుగురు ఎమ్మెల్యేలు ఉన్నార‌ని.. తెలుస్తోంది.  

శ్రీకాకుళం జిల్లాకు చెందిన రెడ్డి శాంతి ఈ రేసులో ముందు వరసులో ఉన్నార‌ని సీనియ‌ర్ల మ‌ధ్య చ‌ర్చ‌సాగుతోంది.  అదేస‌మ‌యంలో అనంత‌పురం జిల్లా సింగ‌న‌మ‌ల‌ ఎమ్మెల్యే జొన్నలగడ్డ ప‌ద్మావ‌తి(ఎస్సీ), అదేవిధంగా గుంటూరుకు చెందిన మ‌హిళా ఎమ్మెల్యే(బీసీ) కూడా హోం మంత్రి ప‌ద‌విని ఆశిస్తున్న‌వారి జాబితాలో ఉన్నార‌ని తెలుస్తోంది. వీరితో పాటు..ఎమ్మెల్యే రోజా.. కూడా ఈ ప‌ద‌విని ఆశిస్తున్నారు. వాస్త‌వానికి 2019 ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. వైసీపీ అతిపెద్ద‌పార్టీగా ఆవిర్భ‌వించాక‌.. రోజానే హోం మంత్రి అంటూ.. పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. కానీ, జ‌గ‌న్ మాత్రం ఎవ‌రూ ఊహించ‌ని విధంగా సుచ‌రిత‌కు క‌ట్ట‌బెట్టారు.

సో.. ఇప్పుడు కూడా రెడ్డి వ‌ర్గానికి హోం మంత్రి ప‌ద‌వి ఇచ్చే అవ‌కాశం లేదు కాబ‌ట్టి.. రోజాపై చ‌ర్చ అన‌వ‌స‌రం అంటున్నారు వైసీపీలోని సీనియ‌ర్ నాయ‌కులు. ఇక‌, ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందినవిద్యావంతురాలు, విన‌య‌శీలిగా పార్టీలో పేరున్న సింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి దాదాపు 60 శాతం ఈ ప‌ద‌వి ద‌క్కే ఛాన్స్ ఉంద‌ని వారే చెబుతున్నారు. ఒక‌వేళ‌.. బీసీ కోటాకు కేటాయించి.. ఎస్సీల‌కు ఏదైనా కీల‌క ప‌ద‌వి ఇవ్వాల‌ని భావిస్తే.. అప్పుడు గుంటూరుకు చెందిన నాయ‌కురాలి పేరును ప‌రిశీలించే చాన్స్ ఉంద‌ని అంటున్నారు.  ఏదేమైనా.. హోం శాఖ‌ను ఈ సారి ఆచితూచి ఇచ్చే అవ‌కాశం మాత్రం క్లియ‌ర్‌గా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on March 18, 2022 8:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

39 minutes ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

7 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

7 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago