తన హయాంలో చంద్రబాబు నాయుడు వివాదాస్పద పెగాసస్ స్పైవేర్ కొన్నారా ? కొన్నారనే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా ఆరోపించారు . చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కొన్నట్లు మమత చెప్పటం ఇపుడు సంచలనంగా మారింది. సాఫ్ట్ వేర్ కొనుగోలుపై తమను ఇజ్రాయెల్ కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎన్ఎస్ఓ సంస్ధ సంప్రదించిందని మమత అన్నారు. ఇజ్రాయెల్ అడిగినా తాము ఆ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేయలేదన్నారు.
అయితే తాము తిరస్కరించిన సాఫ్ట్ వేర్ ను చంద్రబాబు కొనుగోలు చేశారని దీదీ వెల్లడించారు. ఇప్పటికే పెగాసస్ పై దేశంలో నానా గోల జరుగుతోంది. ఒకపుడు ఇదే అంశం పార్లమెంటును కుదిపేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాంటి అంశాన్ని తాజాగా మళ్ళీ మమత లేవనెత్తారు. నాలుగేళ్ళ క్రిందట తాను పెగాసస్ స్పైవేర్ ను కొనలేదని ఇపుడు ఎందుకు చెప్పారో అర్ధం కావటం లేదు. తాను కొనలేదని చెప్పటం వరకు బాగానే ఉంది. అయితే ఇదే స్పైవేర్ సాఫ్ట్ వేర్ ను చంద్రబాబు కొన్నట్లు మమతకు ఎలా తెలుసు ?
ఇక్కడ ఒక విషయం గమనించాలి. అదేమిటంటే ఇజ్రాయెల్ నుంచి అత్యాధునిక టెక్నాలజీ ఉన్న సాంకేతిక పరికరాలు కొనుగోలు చేశారు. చంద్రబాబు హయాంలో పనిచేసిన ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటశ్వేరరావు రు. 25 కోట్లతో పరికరాలు కొనుగోలు చేసింది వాస్తవం. మరాయన కొనుగోలు చేసింది పెగాసస్ సాఫ్ట్ వేరేనా ? కాదా అన్న విషయం తేలాల్సుంది. ఇప్పటికీ ఏబీ పై ఆ కేసు విచారణ జరుగుతునే ఉంది.
ఇదే విషయమై లోకేష్ మాట్లాడారు. ప్రతిపక్షాలపై నిఘా పెట్టడానికి తాము పెగాసస్ స్పైవేర్ కొనలేదన్నారు. తాము నిజంగానే ఆ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేసుంటే జగన్మోహన్ రెడ్ది అధికారంలోకి వచ్చేవారా అంటూ ప్రశ్నించారు. మొత్తానికి పెగాసస్ అనే కందిరీగను మమత మళ్ళీ కెలికారనే చెప్పాలి.
టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు యువ హీరోయిన్ రాశీ సింగ్ గట్టిగానే ప్రయత్నిస్తోంది. మొదటి నుంచి…
క్రిస్టఫర్ నోలన్ కొత్త సినిమా ‘ది ఒడిస్సీ’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ప్రపంచ చరిత్రలో ఎంతో ప్రత్యేకంగా చెప్పుకునే గ్రీక్, ట్రాయ్…
72వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడు అవార్డు పుష్ప 2కి గాను అల్లు అర్జున్ కి మరోసారి రావొచ్చేమో అని…
క, కె ర్యాంప్ ఊపులో ఉన్న కిరణ్ అబ్బవరంకు మధ్యలో దిల్ రుబా ఒకటే షాక్ ఇచ్చింది కానీ దాని…
తెలుగు సినిమాలో స్క్రీన్ ప్లే అనగానే గుర్తుకొచ్చే పేరు.. సుకుమార్. ఈ లెక్కల మాస్టారి కథన నైపుణ్యం గురించి ఎంత…
72వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రకటించింది. 2024 సంవత్సరానికిగాను జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న…