Political News

చంద్రబాబు పెగాసస్ కొన్నారా?

తన హయాంలో చంద్రబాబు నాయుడు వివాదాస్పద పెగాసస్ స్పైవేర్ కొన్నారా ? కొన్నారనే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా ఆరోపించారు . చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కొన్నట్లు మమత చెప్పటం ఇపుడు సంచలనంగా మారింది. సాఫ్ట్ వేర్ కొనుగోలుపై తమను ఇజ్రాయెల్ కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎన్ఎస్ఓ సంస్ధ సంప్రదించిందని మమత అన్నారు. ఇజ్రాయెల్ అడిగినా తాము ఆ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేయలేదన్నారు.

అయితే తాము తిరస్కరించిన సాఫ్ట్ వేర్ ను చంద్రబాబు కొనుగోలు చేశారని దీదీ వెల్లడించారు. ఇప్పటికే పెగాసస్ పై దేశంలో నానా గోల జరుగుతోంది. ఒకపుడు ఇదే అంశం పార్లమెంటును కుదిపేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాంటి అంశాన్ని తాజాగా మళ్ళీ మమత లేవనెత్తారు. నాలుగేళ్ళ క్రిందట తాను పెగాసస్ స్పైవేర్ ను కొనలేదని ఇపుడు ఎందుకు చెప్పారో  అర్ధం కావటం లేదు. తాను కొనలేదని చెప్పటం వరకు బాగానే ఉంది. అయితే ఇదే స్పైవేర్ సాఫ్ట్ వేర్ ను చంద్రబాబు కొన్నట్లు మమతకు ఎలా తెలుసు ?

ఇక్కడ ఒక విషయం గమనించాలి. అదేమిటంటే ఇజ్రాయెల్ నుంచి  అత్యాధునిక టెక్నాలజీ ఉన్న సాంకేతిక పరికరాలు కొనుగోలు చేశారు. చంద్రబాబు హయాంలో పనిచేసిన ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటశ్వేరరావు రు. 25 కోట్లతో పరికరాలు కొనుగోలు చేసింది వాస్తవం. మరాయన కొనుగోలు చేసింది పెగాసస్ సాఫ్ట్ వేరేనా ? కాదా అన్న విషయం తేలాల్సుంది. ఇప్పటికీ  ఏబీ పై ఆ కేసు విచారణ జరుగుతునే ఉంది.

ఇదే విషయమై లోకేష్ మాట్లాడారు. ప్రతిపక్షాలపై నిఘా పెట్టడానికి తాము పెగాసస్ స్పైవేర్ కొనలేదన్నారు. తాము నిజంగానే ఆ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేసుంటే జగన్మోహన్ రెడ్ది అధికారంలోకి వచ్చేవారా అంటూ ప్రశ్నించారు.   మొత్తానికి పెగాసస్ అనే కందిరీగను మమత మళ్ళీ కెలికారనే చెప్పాలి. 

This post was last modified on March 18, 2022 1:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

44 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

4 hours ago