Political News

ఏపీ వైద్యులకు సెల్ఫీ షాకులిచ్చిన జగన్ సర్కార్

ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం రాష్ట్రంలో పని చేసే ప్రభుత్వ వైద్యులకు గుదిబండలా మారటమే కాదు.. పేషెంట్లకు వైద్యం చేయటం కంటే.. రోజువారీగా పోస్టు చేయాల్సిన సెల్ఫీలతోనే పుణ్యకాలం గడిచేలా తాజా నిర్ణయం ఉందంటున్నారు. ఏపీలోని జగన్ సర్కారు తీసుకున్న ఈ సెల్ఫీ నిర్ణయంపై వైద్యులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసేలా తాజా మార్గదర్శకాలు ఉన్నాయని చెబుతున్నారు.

కొత్తగా తీసుకొచ్చిన సెల్ఫీ పాలసీ ప్రకారం చూస్తే.. ఏపీ వ్యాప్తంగా ఉండే ప్రభుత్వ వైద్యులు ప్రతి రెండు గంటలకు ఒకసారి తమ సెల్ఫీని పోస్టు చేయాల్సి ఉంటుంది. అది కూడా తాము పని చేసే ఆసుపత్రి ఆవరణ స్పష్టంగా కనిపించాలి. ఈ తీరులో రోజుకు ఐదు సార్లు సెల్ఫీలు దిగి పోస్టు చేయటంతో పాటు.. ఈ లెక్కలో ఏ చిన్న తేడా వచ్చినా నెలవారీ జీతంలో కోత పెడతామన్న మాటపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

అంతేకాదు.. ప్రభుత్వ వైద్యులు తమ ఇంటి వద్ద చేసుకునే ప్రైవేటుప్రాక్టీసు విషయంలోనూ పరిమితులు విధించారు. దీంతో.. వారంతా రోజు మొత్తం ప్రభుత్వ ఆసుపత్రికే పరిమితం కావాలే తప్పించి.. ప్రైవేటు ప్రాక్టీసు వైపు కన్నెత్తి చూసే అవకాశం ఉండదని చెబుతున్నారు. తాజా నిర్ణయంతో ఏపీని సెల్ఫీ ప్రదేశ్ గా మారుస్తున్నారన్న మండిపాటు వ్యక్తమవుతోంది. కొత్తగా తీసుకురావాలని భావిస్తున్న ఈ సెల్ఫీ విధానానికి కచ్ఛితమైన మార్గదర్శకాల్ని సిద్ధం చేస్తున్నారు.

ఇప్పటికే బయో మెట్రిక్ తోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. అది సరిపోదన్నట్లుగా ఇప్పుడు ఏకంగా సెల్ఫీలు దిగి పోస్టు చేయటం.. వాటిల్లో ఆసుపత్రి బ్యాక్ గ్రౌండ్ పక్కాగా ఉండాలని చెబుతున్న వైనంపై మండిపాటు వ్యక్తమవుతోంది. రోజుకు ఐదు సెల్ఫీలు పోస్టు చేయాలన్న ఆలోచనపై మహిళా వైద్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమను ఇబ్బందులకు గురి చేస్తాయని వాదిస్తున్నారు. సెల్ఫీలు ఏ మాత్రం అప్ లోడ్ చేయకున్నా.. జీతాల్లోకోత పెడతారన్న మాటపై ఆందోళన వ్యక్తమవుతోంది. మరి.. వైద్యుల విషయంలో అమల్లోకి రానున్న ఈ సెల్ఫీ పరీక్ష జగన్ ప్రభుత్వంపై మరింత నెగిటివిటీని పెంచేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

This post was last modified on March 18, 2022 1:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సేఫ్ హౌస్ లోకి పారిపోయిన పాక్ ప్రధాని

భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ మొదలై రెండు రోజులు కూడా ముగియలేదు…అప్పుడే పాకిస్తాన్ తన అపజయాన్ని అంగీకరించే దిశగా సాగుతోంది.…

6 minutes ago

అమరావతి మూలపాడు దశ తిరుగుతుంది

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నవ నగరాలతో నిర్మితం కానున్న సంగతి తెలిసిందే. వీటిలో అత్యధిక ప్రాధాన్యం కలిగిన క్రీడా…

10 minutes ago

బుక్ మై షోలో ‘వీరమల్లు’

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కొన్నేళ్ల నుంచి విడుదల కోసం ఎదురు చూస్తున్న సినిమా.. హరిహర వీరమల్లు. పవన్…

2 hours ago

క్లాసిక్ సీక్వెల్ – రామ్ చరణ్ డిమాండ్

35 సంవత్సరాల తర్వాత విడుదలవుతున్న జగదేకవీరుడు అతిలోకసుందరిని ఆస్వాదించడం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారని అడ్వాన్స్ బుకింగ్స్ తేటతెల్లం చేశాయి.…

3 hours ago

ఇంటరెస్టింగ్ డే : శ్రీవిష్ణు VS సామ్

కొత్త శుక్రవారం వచ్చేసింది. హిట్ 3 ది థర్డ్ కేస్ తో మే నెలకు బ్రహ్మాండమైన బోణీ దొరికాక ఇప్పుడు…

3 hours ago

పాక్ దొంగ దారి!… యుద్ధం మొదలైనట్టే!

దాయాదీ దేశాలు భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధం మొదలైపోయిందనే చెప్పాలి. ఈ మేరకు గురువారం యుద్ధం జరుగుతున్న తీరుకు…

11 hours ago