Political News

రెబల్ ఎమ్మెల్యేతో జగన్ ఆసక్తికరమైన భేటీ

శాసనసభలో గురువారం ఆసక్తికర ఘటన జరిగింది. అదేమిటంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో నెల్లూరు జిల్లా ఎంఎల్ఏ ఆనం రామనారాయణ రెడ్డి భేటీ అయ్యారు. మామూలుగా అయితే సీఎంతో ఎంఎల్ఏ భేటీ అవ్వడం చాలా సహజమే. కానీ ఇక్కడ ఎందుకని ఆసక్తిగా మారిందంటే గడచిన మూడేళ్ళుగా ప్రభుత్వంపై ఆనం తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  ఎంతో సీనియర్ అయిన తనకు మంత్రివర్గంలో చోటు కల్పించలేదనే అసంతృప్తి జగన్ పై ఆనంలో బాగా పెరిగిపోతోంది.

ఇపుడు ఆనం పరిస్థితి ఎలా తయారయ్యిందంటే జిల్లాలోని సహచర ఎంఎల్ఏలు కానీ మంత్రులు కానీ కనీసం అధికార యంత్రాంగం కూడా పట్టించుకోవటం లేదు. ప్రభుత్వంపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న కారణంగానే ఆనంను అధికార పార్టీ, యంత్రాంగం దూరంగా పెట్టేసింది. దాంతో తొందరలోనే ఆనం పార్టీ మారిపోతారనే ప్రచారం విపరీతంగా జరుగుతోంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ విషయంలో కూడా ఆనం తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. పైగా తన మద్దతు దారులతో నిరాహార దీక్షలకు కూడా దిగారు.

సరిగ్గా ఇలాంటి నేపథ్యంలో ముఖ్యమంత్రితో ఆనం భేటీ అయ్యారు. దాంతో విషయం చాలా ఆసక్తిగా మారింది. అసెంబ్లీలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో ఆనం భేటీ అయ్యారు. ఆ సందర్భంగా మంత్రికి ఆనం కొన్ని కాగితాలిచ్చారు. ఆనం దగ్గరున్న కాగితాలను తీసుకున్న మంత్రి  వాటిని ముఖ్యమంత్రికి అందించారు.  తర్వాత బయటకు వచ్చేసి ఆనంను మంత్రి మళ్ళీ సీఎం దగ్గరకు తీసుకెళ్ళారు. ముఖ్యమంత్రి చాంబర్లోకి ఇద్దరు వెళ్ళిన వెంటనే మంత్రి బయటకు వచ్చేశారు. జగన్-ఆనం కాసేపు మాట్లాడుకోగానే మళ్ళీ మంత్రి లోపలకు వెళ్ళారు. ముగ్గురు కలిసి కాసేపు మాట్లాడుకున్నారు.

ఇదంతా చూస్తున్న వారికి జరిగిందంతా  విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే అసలు ఆనంను కలవటానికే జగన్ ఇష్టపడటంలేదు. అలాంటిది ముందు మంత్రి వెళ్ళి కలవటం, తర్వాత ఆనంను తీసుకెళ్ళారు. ఆనంను సీఎం దగ్గర వదిలేసి మంత్రి బయటకు వచ్చేశారు. కొద్దిసేపటికి మళ్ళీ మంత్రి కూడా చాంబర్లోకి వెళ్ళారు. ముగ్గురు కలిసి కాసేపు మాట్లాడుకున్నారు. ఇదంతా చూసిన వారికి ఆ కాగితాల్లో ఏముంది ? ఆనంను జగన్ దగ్గరకు మంత్రి ఎందుకు తీసుకెళ్ళారు . అసలు ఆనంను కలవటానికి సీఎం ఎందుకు అంగీకరించారు ? ముగ్గురు కలిసి ఏమి మాట్లాడుకున్నారనే విషయాలు ఆసక్తిగా మారాయి.

This post was last modified on March 18, 2022 10:01 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పిఠాపురం కాదు, మంగళగిరి కాదు, ఏపీలో టాప్ నియోజకవర్గం ఇదే!

ఏపీలో 175 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుక‌బ‌డి ఉన్నాయి. మ‌రికొన్ని మ‌ధ్య‌స్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…

3 hours ago

తమిళంలో డెబ్యూ హీరో సంచలనం

ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…

5 hours ago

ఓడిన వైసీపీకి 10 కోట్లు, గెలిచిన టీడీపీకి…

రాజ‌కీయ పార్టీల‌కు ప్ర‌ముఖ సంస్థ‌లు విరాళాలు ఇవ్వ‌డం కొత్త‌కాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వ‌డం(వాటి ఇష్ట‌మే…

6 hours ago

తెలంగాణ నాయకుల జాబితాకు తోడయ్యిన వైఎస్ షర్మిల

కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…

7 hours ago

అసెంబ్లీలో కండోమ్ లతో డెకరేషన్.. ఎప్పుడు..? ఎందుకు..?

ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…

8 hours ago

వికలాంగులతో కేక్ కట్ చేయించిన పవన్

ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…

9 hours ago