దర్శకుడు అవుదామని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, అనుకోకుండా హీరోగా మారి, తొలి సినిమా ‘ఉయ్యాల జంపాల’తో సూపర్ హిట్ కొట్టి.. ఆ తర్వాత సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్ చిత్రాలతో హ్యాట్రిక్ సాధించి అందరి దృష్టినీ ఆకర్షించిన కుర్రాడు రాజ్ తరుణ్. కెరీర్ ఆరంభంలో అతడి ఊపు చూసి మంచి స్థాయికి వెళ్తాడని అంతా అనుకున్నారు.
అనిల్ సుంకర లాంటి పెద్ద నిర్మాత అతడితో కాంట్రాక్ట్ కుదుర్చుకుని వరుసగా మూడు సినిమాలు నిర్మించడం విశేషం. ఇంత డిమాండ్లో ఉన్న హీరో కాస్తా.. అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన స్థితికి చేరుకున్నాడు. హ్యాట్రిక్ హిట్ల తర్వాత ఇన్నేళ్ల కెరీర్లో అతడికి దక్కిన ఓ మోస్తరు విజయం అంటే.. ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ మాత్రమే. అది కూడా సూపర్ సక్సెస్ అని చెప్పలేం కానీ.. ఉన్నంతలో బాగానే ఆడింది. 2017లో వచ్చిన ఆ చిత్రమే రాజ్కు చివరి విజయం.
ఆ తర్వాత ఐదేళ్లలో పది సినిమాల దాకా చేశాడు. కానీ ఏదీ సరైన ఫలితాన్నివ్వలేదు.మార్కెట్ బాగా దెబ్బ తినేసి ఇండస్ట్రీ నుంచి అంతర్దానం అయిపోతున్న స్థితిలో రాజ్ నటించిన కొత్త చిత్రం.. స్టాండప్ రాహుల్. ఇప్పటిదాకా ఒక మూసలో సినిమాలు చేసుకుంటూ పోయిన రాజ్.. ఈసారి స్టాండప్ కమెడియన్గా ట్రెండీగా ఉండే పాత్రలో నటించాడీ చిత్రంలో. టైటిల్, క్యారెక్టర్ సహా అన్నీ కొత్తగా కనిపిస్తున్నాయి. దీని ట్రైలర్ కూడా ఆకర్షణీయంగానే కనిపించింది. కానీ రాజ్ ట్రాక్ రికార్డు బాగా దెబ్బ తినేయడం వల్ల ఈ సినిమాకు పెద్దగా హైప్ అయితే లేదు.
అందులోనూ రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రాల మధ్యలో పడటం ప్లస్సో మైనస్సో తెలియని పరిస్థితి నెలకొంది. వేరే సినిమాల పోటీ లేకపోవడం ప్లస్ అయితే.. ఆ భారీ చిత్రాల సందడిలో దీని పట్ల జనాలు ఏమాత్రం ఆసక్తి ప్రదర్శిస్తారన్నది చెప్పలేని పరిస్థితి. సినిమాకు ఎంత మంచి టాక్ వస్తుందన్నది కీలకం. మరి శుక్రవారం థియేటర్లలోకి దిగుతున్న ‘స్టాండప్ రాహుల్’ గురించి మధ్యాహ్నానికి జనం ఏం మాట్లాడుకుంటారో చూడాలి.
ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…
ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…