దర్శకుడు అవుదామని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, అనుకోకుండా హీరోగా మారి, తొలి సినిమా ‘ఉయ్యాల జంపాల’తో సూపర్ హిట్ కొట్టి.. ఆ తర్వాత సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్ చిత్రాలతో హ్యాట్రిక్ సాధించి అందరి దృష్టినీ ఆకర్షించిన కుర్రాడు రాజ్ తరుణ్. కెరీర్ ఆరంభంలో అతడి ఊపు చూసి మంచి స్థాయికి వెళ్తాడని అంతా అనుకున్నారు.
అనిల్ సుంకర లాంటి పెద్ద నిర్మాత అతడితో కాంట్రాక్ట్ కుదుర్చుకుని వరుసగా మూడు సినిమాలు నిర్మించడం విశేషం. ఇంత డిమాండ్లో ఉన్న హీరో కాస్తా.. అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన స్థితికి చేరుకున్నాడు. హ్యాట్రిక్ హిట్ల తర్వాత ఇన్నేళ్ల కెరీర్లో అతడికి దక్కిన ఓ మోస్తరు విజయం అంటే.. ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ మాత్రమే. అది కూడా సూపర్ సక్సెస్ అని చెప్పలేం కానీ.. ఉన్నంతలో బాగానే ఆడింది. 2017లో వచ్చిన ఆ చిత్రమే రాజ్కు చివరి విజయం.
ఆ తర్వాత ఐదేళ్లలో పది సినిమాల దాకా చేశాడు. కానీ ఏదీ సరైన ఫలితాన్నివ్వలేదు.మార్కెట్ బాగా దెబ్బ తినేసి ఇండస్ట్రీ నుంచి అంతర్దానం అయిపోతున్న స్థితిలో రాజ్ నటించిన కొత్త చిత్రం.. స్టాండప్ రాహుల్. ఇప్పటిదాకా ఒక మూసలో సినిమాలు చేసుకుంటూ పోయిన రాజ్.. ఈసారి స్టాండప్ కమెడియన్గా ట్రెండీగా ఉండే పాత్రలో నటించాడీ చిత్రంలో. టైటిల్, క్యారెక్టర్ సహా అన్నీ కొత్తగా కనిపిస్తున్నాయి. దీని ట్రైలర్ కూడా ఆకర్షణీయంగానే కనిపించింది. కానీ రాజ్ ట్రాక్ రికార్డు బాగా దెబ్బ తినేయడం వల్ల ఈ సినిమాకు పెద్దగా హైప్ అయితే లేదు.
అందులోనూ రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రాల మధ్యలో పడటం ప్లస్సో మైనస్సో తెలియని పరిస్థితి నెలకొంది. వేరే సినిమాల పోటీ లేకపోవడం ప్లస్ అయితే.. ఆ భారీ చిత్రాల సందడిలో దీని పట్ల జనాలు ఏమాత్రం ఆసక్తి ప్రదర్శిస్తారన్నది చెప్పలేని పరిస్థితి. సినిమాకు ఎంత మంచి టాక్ వస్తుందన్నది కీలకం. మరి శుక్రవారం థియేటర్లలోకి దిగుతున్న ‘స్టాండప్ రాహుల్’ గురించి మధ్యాహ్నానికి జనం ఏం మాట్లాడుకుంటారో చూడాలి.
This post was last modified on March 18, 2022 10:41 am
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…