గత ఏడాది ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల ధరలకు సంబంధించిన సమస్యను మొదలుపెట్టిందే ప్రభుత్వం. ఏడాది పాటు ఆ సమస్యను సాగదీసి, సినీ ప్రముఖులను తమ వెంట తిప్పించుకుని, చివరికి చిరు లాంటి వాళ్లు చేతులు జోడించి వేడుకునేలా చేసిన ఘనత ప్రభుత్వ పెద్దలదే. ఐతే చిరు సహా కొందరు ప్రముఖులు పరిశ్రమ బాగు కోసమని ఎంత తగ్గాలో అంతా తగ్గారు. చివరికి నెల కిందట టికెట్ల రేట్ల పెంపుతో పాటు కొన్ని మినహాయింపులకు జగన్ అంగీకరించారు.
అంతటితో సమస్య తీరిపోయిందని అనుకుంటే.. రేట్ల పెంపు, ఐదో షో విషయంలో మెలికలు పెడుతూ జీవో ఇచ్చి ఇండస్ట్రీ జనాలను ఇరుకున పడేసింది. ఇప్పుడు ఏ సినిమాకు ఆ సినిమాకు విన్నపాలు పెట్టుకుంటే, ప్రభుత్వ పెద్దల్ని మెప్పించి ఒప్పిస్తే తప్ప స్పెషల్ రేట్లు, షోలు సాధ్యపడే పరిస్థితి కనిపించడం లేదు.
ఏపీ సీఎంతో సమావేశానికి చిరుతో పాటు వెళ్లిన వాళ్లలో ప్రభాస్ కూడా ఉన్నాడు. పాన్ ఇండియా లెవెల్లో బిగ్గెస్ట్ స్టార్గా ఉన్న అతను.. తన స్థాయి తగ్గించుకుని వెళ్లి సీఎంకు విజ్ఞప్తి చేశాడు. అతడి మిత్రులైన యువి క్రియేషన్స్ అధినేతలు సీఎంకు సన్నిహితులే అని చెబుతారు.
అయినా సరే.. రాధేశ్యామ్కు టికెట్ల రేట్ల పెంపునకు ఛాన్స్ లేకపోయింది. ఐదో షో కూడా పడలేదు. కానీ ఇప్పుడు ఆర్ఆర్ఆర్కు మాత్రం టికెట్ రేటు మీద వంద పెంచుకునే అవకాశం ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. అలాగే అదనపు షోలకు కూడా ఛాన్స్ ఉంటుందంటున్నారు. ఇదంతా రాజమౌళి మరోసారి వ్యక్తిగతంగా వెళ్లి సీఎంను కలిసిన ఫలితమే అంటున్నారు.
ఇదే నిజమైతే కచ్చితంగా ఇది పక్షపాతమే అవుతుంది. ఇలా తమ దగ్గరికి వచ్చి కలిసి విన్నవించుకున్న వారికే రేట్ల పెంచుకునే అవకాశం కల్పించడం, మిగతా వాళ్లకు ఇంకోలా వ్యవహరించడం ఏంటో అర్థం కాని విషయం. చూస్తుంటే సినిమా వాళ్ల విషయంలో జగన్ ఇగో ఇంకా చల్లారలేదా? ఇండస్ట్రీ అంత తనకు మోకరిల్లాలని కోరుకుంటున్నారా.. ఇలా ఒక్కొక్కరు తన దగ్గరికొచ్చి ప్రాధేయపడితే తప్ప ఆయన మినహాయింపులు ఇవ్వరా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయిప్పుడు.
This post was last modified on March 16, 2022 8:19 am
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…