Political News

మార్చి 27..మంత్రులకు జగన్ డెడ్ లైన్?

ఏపీ మంత్రివర్గ విస్తరణపై చాలాకాలంగా ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ముందుగా అనుకున్నట్లుగానే రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్ ప్రక్షాళన చేసేందుకు సిద్ధంగా ఉన్నానని జగన్ స్వయంగా ప్రకటించడంతో ఈ విషయంపై వైసీపీ నేతలకు క్లారిటీ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా నేడు జరిగిన వైసీఎల్పీ సమావేశంలో జగన్ మంత్రి వర్గ విస్తరణ అంశంపై ఎమ్మెల్యేలతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన ఎమ్మెల్యేలకు జగన్ షాకింగ్ విషయాలు వెల్లడించినట్లు ప్రచారం జరుగుతోంది.

ఉగాది రోజు ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు జగన్ ముహూర్తం పెట్టినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 2న కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని జగన్ ఫిక్సయినట్లు తెలుస్తోంది. దానికి అనుగుణంగా మార్చి 27న మంత్రులంతా రాజీనామా చేయాల్సి ఉంటుందని జగన్ మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారట. అయితే, ఐదుగురు మంత్రులు మినహా మిగతావారందరిపై వేటు తప్పదని ప్రచారం జరుగుతోంది. ఆ ఐదుగురికి మాత్రం జగన్ మరో ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారట.

పనితీరు, సామాజిక సమీకరణాలు, ప్రతిపక్షాలకు ధీటైనా సమాధానం చెప్పగలగడం, వంటి లెక్కలన్నీ బేరీజు వేసుకుని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారట. పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని లను కచ్చితంగా కొనసాగించాలని జగన్ అనుకుంటున్నారట. ఇక, మంత్రి బుగ్గన, బాలినేనిలను కూడా కొనసాగించే అవకాశముందట. బొత్సకు పార్టీ రీజినల్ కమిటీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. విజయవాడలో పార్టీ కేంద్ర కార్యాలయ బాధ్యతలు మొత్తం విజయసాయికి అప్పగించనున్నారట.

హోమ్ మంత్రి పదవి మరోసారి మహిళకే కేటాయించాలని జగన్ అనుకుంటున్నారట. ఇక, తొలి విడత మాదిరిగానే ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉండబోతున్నారట. 50 శాతం మంత్రి పదవులు బీసీ లకు, 33 శాతం మంత్రి పదవులు మహిళలకు ఇవ్వాలన్న యోచనలో జగన్ ఉన్నారట. తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా పనితీరును బట్టి మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు సమాచారం. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ సారి మంత్రి పదవులు కేటాయించబోతున్నారని తెలుస్తోంది.

This post was last modified on March 15, 2022 9:41 pm

Share

Recent Posts

జగన్ కు జైల్లో అవమానం?

కర్నూలు జైల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కర్నూలులో పర్యటించిన సంగతి…

21 minutes ago

దొంగతనం చేసిన ఇంట్లోనే నిద్రపోయిన దొంగ!

ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన దొంగ ఆ ఇంట్లో వస్తువులు దొంగిలించడం…ఆకలేయడంతో ఆ ఇంట్లోనే తినేసి నిద్రలోకి జారుకోవడం…తీరా…

2 hours ago

పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎంపై హత్యాయత్నం… పొత్తే కారణమా?

పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై హత్యాయత్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం…

2 hours ago

ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మద్దతు

రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హల్ద్వానిలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని శ్రీరామ్…

5 hours ago

అతిగా ఫోన్ వాడిన షకీలా ఇప్పుడు ఎలా ఉందంటే…

ఒకప్పుడు షకీలాకు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. వరుస సినిమాలు, భారీ గుర్తింపు, తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌తో…

5 hours ago

ఫ్యాన్స్ వద్దా జాన్వీ మేడమ్?

ఏఐ రంగప్రవేశం తర్వాత తమ ఫొటోలు, వీడియోలను ఇష్టానుసారం వాడేస్తున్న నేపథ్యంలో పర్సనాలిటీ రైట్స్ కోసం ఫిలిం సెలబ్రెటీలను న్యాయస్థానాలను…

5 hours ago