Political News

బీసీ ముఖ్యమంత్రి కావాలి: బ్ర‌ద‌ర్ అనిల్

ఏపీ సీఎం జ‌గ‌న్ చెల్లెలు భ‌ర్త‌, ప్ర‌ముఖ సువార్త ప్ర‌సంగీకుడు, బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్‌.. ఏపీ స‌ర్కారుపై ప‌రోక్షంగా విరుచుకుప‌డ్డారు.  రాష్ట్రానికి బిసి వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్య మంత్రి కావాల్సిన అవసరం ఉందని  అన్నారు. విశాఖపట్నం పర్యటనలో ఉన్న ఆయన .. మీడియాతో మాట్లాడుతూ. రాష్ట్రంలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేసిన క్రైస్తవులు, బీసీలు, మైనారిటీల ఆకాంక్షలు ఇప్ప‌టికీ తీరలేదని అన్నారు. క్రైస్తవ సంఘాలు, బీసీ, మైనారిటీలకు చెందిన వ్యక్తులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించడానికి తనను పిలిచారని, వారి బాధలు విన్నాన‌ని అన్నారు.

ఒక్క అవకాశం అంటే తాము అన్ని పార్టీలనూ వదిలి జగన్ కు మద్దతు తెలిపామని తనను కలిసిన వారు చెప్పినట్లు అనిల్ వివరించారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పట్టించుకోలేదని తెలిపారని బ్రదర్ అనిల్ అన్నారు. ఎన్నికలలో జగన్ కు సపోర్టు చేస్తే వారి సమస్యలు తీరుస్తానని తాను హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. దేవుడిని నమ్మే తాను అసత్యాలు మాట్లాడలేనని, తాను ఇచ్చిన మాట చెల్లుబాటు కానందున ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నట్లు బ్రదర్ అనిల్ తెలిపారు. వారి సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తానని వినకపోతే ప్రత్యామ్నాయం చూస్తామని అన్నారు.

వివిధ సంఘాల ప్రతినిధులు తనతో బాధలు చెప్పుకున్నారన్నారు. ఎన్నికలకు ముందు వైసీపీకు వారంతా సాయం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు వారి బాధలు పట్టించుకునేవారే లేరన్నారు. సమయం కుదిరినప్పుడు సీఎం జగన్‌ను కలిసి సమస్యలను వివరించే ప్రయత్నం చేస్తానన్నారు. రాష్ట్రంలోని 70 స్థానాలలో బ్రదర్ అనిల్ ప్రభావం వల్ల, ఆయన ఇచ్చిన మాట వల్ల తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పని చేశామని బ్రదర్ అనిల్ తో సమావేశం అయిన వారు చెప్పారు. బ్రదర్ అనిల్ మద్దతు లేకపోతే 70 స్థానాలలో ఈ ఫలితాలు వచ్చేవి కాదని వారన్నారు.

“నేను రాజకీయ విషయాలు మాట్లాడను. నేనెప్పుడూ అసెంబ్లీ వైపు వెళ్లేవాడిని కాదు. నా బిజీలో నేను.. పథకాల బిజీలో సీఎం ఉన్నారు. అన్ని సమస్యలూ సీఎం దృష్టికి తీసుకెళ్తా. నేను సీఎంను కలిసి రెండున్నరేళ్లు అయింది. క్రైస్తవ సంఘాలకు అన్యాయం జరిగిందన్నారు. ప్రత్యామ్నాయ పార్టీ పెడతామంటున్నారు.. వారికి మద్దతుగా ఉంటా. ఎన్నికల ముందు నన్ను నమ్మి ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేశారు. ఇప్పుడు వారు బాధలో ఉంటే స్పందించే బాధ్యత నాకు ఉంది.“ అని అనిల్ చెప్పారు.

వివేకా హ‌త్య‌పై..

వివేకా హత్య కేసుపైనా స్పందించిన బ్రదర్ అనిల్.. దోషులు తప్పించుకోలేరని అన్నారు. హత్య కేసుపై సీబీఐ విచారణ చేస్తోందంటే చిన్న విషయం కాదని అన్నారు. త్వరలోనే దోషులెవరో తెలనుందని తెలిపారు. సీబీఐ అత్యంత పెద్ద ఆర్గ‌నైజేష‌న్ అని.. నేర‌స్తులు త‌ప్పించుకోలేర‌ని.. అనిల్ చెప్పారు. అయితే.. త‌న‌కు ఈ కేసు గురించి ఏమీ తెలియ‌ద‌ని అన్నారు. తను పెద్ద‌గా ఈ కేసును ప‌ట్టించుకోలేద‌ని చెప్పారు.

This post was last modified on March 14, 2022 9:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఉనికిని చాటడానికి ‘రాకాస’ ప్లాన్లు

చిన్న సినిమాను పెద్దగా ప్రమోట్ చేస్తే తప్ప జనాలకు సులభంగా రీచ్ కాలేని రోజులివి. అందుకే లిటిల్ హార్ట్స్ ప్రొడక్షన్…

4 hours ago

డీజిల్ లేదు… అంత్యక్రియలు ఆపేస్తారా?

మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు థాయిలాండ్‌లోని అంత్యక్రియలపై పడింది. దేశంలో తీవ్రమైన డీజిల్ కొరత ఏర్పడటంతో బౌద్ధ దేవాలయాల్లో…

4 hours ago

సల్మాన్ సినిమా మునిగినట్లేనా?

బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన సల్మాన్ ఖాన్.. నిఖార్సయిన హిట్టు ఎప్పుడు కొట్టాడో తన వీరాభిమానులు కూడా మరిచిపోయిన పరిస్థితి. దశాబ్దం…

7 hours ago

ఆంటీలతో చాట్ చేయండి అంటూ…

సోషల్ మీడియాలో ఆకర్షణీయ ప్రకటనలతో యువతను వలలో వేసుకునే హనీట్రాప్ యాప్స్‌పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి సీ సజ్జనార్…

7 hours ago

వామ్మో… కత్తిరింపుల్లోనే ఇంత హింస ఉందంటే

దురంధర్ ది రివెంజ్ రూట్ క్లియరైపోయింది. సెన్సార్ ఆలస్యమంటూ ఉదయం నుంచి తిరుగుతున్న వార్తలకు చెక్ పడింది. 1 నిమిషం…

8 hours ago

ప్రేక్షకులపై ‘ఉస్తాద్’ నిర్మాతల ప్రేమ నిజమా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సినిమాకు రెండు…

9 hours ago