కరోనా వైరస్ అనగానే దాని చెడు ప్రభావాల గురించే మాట్లాడుతున్నారందరూ. కానీ ఈ వైరస్ వల్ల కొంత మంచి కూడా జరుగుతోంది. ఈ భూమి కేవలం తనకొక్కడికే సొంతం అని విర్రవీగే మానవుడికి అప్పుడప్పుడూ ప్రకృతి పాఠం చెబుతుందని కరోనా వైరస్ ద్వారా తేలింది. ఈ వైరస్ కారణంగా దేశాలకు దేశాలు లాకౌట్ అయిపోవడం.. జనాలు ఇళ్లలోంచి బయటికి రాక అన్ని కార్యకలాపాలూ ఆగిపోవడంతో.. ఇన్నాళ్లూ మనిషి ధాటికి తట్టుకోలేక మరుగులోకి వెళ్లిపోయిన వివిధ రకాల జంతు జాలం బయటికి వస్తుండటం విశేషం.
తాజాగా టాలీవుడ్ హీరో నాని తన ఇంటి బాల్కనీకి ఆనుకుని ఉన్న చెట్టు మీదికి ఓ పక్షి వచ్చి గూడు పెట్టిన దృశ్యం చూపించి, కరోనా వల్ల జరిగిన మంచి మార్పును నెటిజన్లకు తెలియజేశాడు. దీన్ని మించిన గొప్ప విషయాలు చాలా జరిగాయి. కరోనా ధాటికి అల్లాడిపోతున్న ఇటలీలో డాల్ఫిన్లతో పాటు సముద్ర జీవులెన్నో పోర్టులకు సమీపంలో నీటిపైన తేలియాడుతూ కనిపించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అలాగే మెక్సికోలో అయితే పెంగ్విన్ పక్షులు ఎయిర్ పోర్టులోకి వచ్చేశాయి. సింగపూర్లో బాతులు జనాలు తిరిగే కెనాల్స్లో స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. మరో దేశంలో నిప్పు కోళ్లు రోడ్ల మీదికి వచ్చి ఏ భయం లేకుండా తిరిగేస్తున్నాయి. ఇంకా పలు దేశాల్లో అనేక జీవ రాశులు జన సంచారం నిలిచిపోయిన ప్రాంతాల్లో స్వేచ్ఛగా విహరిస్తుండటం చూసి.. ఈ ప్రపంచం కేవలం మనుషులకు మాత్రమే సొంతం కాదని.. మిగతా జీవరాశులకూ వాటా ఉందనే విషయాన్ని ప్రకృతి చెప్పకనే చెబుతోందన్నది స్పష్టం.
కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…
'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం…
టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద స్టార్లలో ఒకడైనప్పటికీ చాలా సింపుల్ గా ఉంటాడు పవన్ కళ్యాణ్. తనో పెద్ద స్టార్…