కరోనా వైరస్ అనగానే దాని చెడు ప్రభావాల గురించే మాట్లాడుతున్నారందరూ. కానీ ఈ వైరస్ వల్ల కొంత మంచి కూడా జరుగుతోంది. ఈ భూమి కేవలం తనకొక్కడికే సొంతం అని విర్రవీగే మానవుడికి అప్పుడప్పుడూ ప్రకృతి పాఠం చెబుతుందని కరోనా వైరస్ ద్వారా తేలింది. ఈ వైరస్ కారణంగా దేశాలకు దేశాలు లాకౌట్ అయిపోవడం.. జనాలు ఇళ్లలోంచి బయటికి రాక అన్ని కార్యకలాపాలూ ఆగిపోవడంతో.. ఇన్నాళ్లూ మనిషి ధాటికి తట్టుకోలేక మరుగులోకి వెళ్లిపోయిన వివిధ రకాల జంతు జాలం బయటికి వస్తుండటం విశేషం.
తాజాగా టాలీవుడ్ హీరో నాని తన ఇంటి బాల్కనీకి ఆనుకుని ఉన్న చెట్టు మీదికి ఓ పక్షి వచ్చి గూడు పెట్టిన దృశ్యం చూపించి, కరోనా వల్ల జరిగిన మంచి మార్పును నెటిజన్లకు తెలియజేశాడు. దీన్ని మించిన గొప్ప విషయాలు చాలా జరిగాయి. కరోనా ధాటికి అల్లాడిపోతున్న ఇటలీలో డాల్ఫిన్లతో పాటు సముద్ర జీవులెన్నో పోర్టులకు సమీపంలో నీటిపైన తేలియాడుతూ కనిపించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అలాగే మెక్సికోలో అయితే పెంగ్విన్ పక్షులు ఎయిర్ పోర్టులోకి వచ్చేశాయి. సింగపూర్లో బాతులు జనాలు తిరిగే కెనాల్స్లో స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. మరో దేశంలో నిప్పు కోళ్లు రోడ్ల మీదికి వచ్చి ఏ భయం లేకుండా తిరిగేస్తున్నాయి. ఇంకా పలు దేశాల్లో అనేక జీవ రాశులు జన సంచారం నిలిచిపోయిన ప్రాంతాల్లో స్వేచ్ఛగా విహరిస్తుండటం చూసి.. ఈ ప్రపంచం కేవలం మనుషులకు మాత్రమే సొంతం కాదని.. మిగతా జీవరాశులకూ వాటా ఉందనే విషయాన్ని ప్రకృతి చెప్పకనే చెబుతోందన్నది స్పష్టం.
టీడీపీ - జనసేన - బీజేపీ కలిసి కూటమి కట్టాక, కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబు ఫొటోతోపాటు పవన్ కళ్యాణ్ ఫొటో…
ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు కానీ అభిమానులు మాత్రం ఈ…
కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…