Political News

2024లో టీడీపీకి శుభం కార్డు

తెలంగాణ సీఎం కేసీఆర్ గత ఎన్నికల ముందు ముందస్తు ఎన్నికలకు వెళ్లిన తరహాలోనే సీఎం జగన్ కూడా ఈ సారి ముందస్తు ఎన్నికలకు వెళతారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ముందస్తు ఎన్నికల ప్రచారంపై వైసీపీ కీలక నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ముందస్తు ఎన్నికల ప్రచారం అవాస్తవమని సజ్జల ఖండించారు.

వైసీపీ 12వ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న సజ్జల పలు విషయాలపై స్పందించారు. రాజకీయాల్లో అనేక సంస్కరణలను వైసీపీ తెచ్చిందని, ప్రజలకు సేవ చేయడానికే పార్టీ పెట్టామని అన్నారు. నవరత్నాలతో జగన్ వేసిన విత్తనాలు చెట్లయి ఇప్పుడు ఫలాలనిస్తున్నాయని చెప్పారు. మూడేళ్ళుగా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని, అన్ని వర్గాలకు రాజకీయ సాధికారత కల్పించామని చెప్పారు.

టీటీడీని కుప్పంతో సహా అన్ని ప్రాంతాల్లో చెత్తబుట్టలో పడేశారని, అండమాన్ లో ఒక వార్డ్ గెలిస్తే సంబరాలు చేసుకున్నారని సజ్జల ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి 160 సీట్లు వస్తాయన్న ప్రచారం అమరావతి గ్రాఫిక్స్ వంటిదని, అది చూసి జనం నవ్వుకుంటున్నారని సెటైర్లు వేశారు. టీడీపీ సినిమాకి 2024లో శుభం కార్డు పడబోతుందంటూ సజ్జల జోస్యం చెప్పారు.

వైసీపీకి వీళ్ళేవరు ప్రత్యర్ధులు కారని, వైసీపీ కార్యకర్తలంతా ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. టీడీపీ  కుట్రలను ప్రజలకు వైసీపీ కార్యకర్తలు వివరించాలని, 2024లో టీడీపీని శాశ్వతంగా తుడిచెయ్యాలని సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. జులై లో వైసీపీ ప్లీనరీ జరుగుతుందని, ఆ ఏర్పాట్లు చేసుకోవాలని కార్యకర్తలకు, నేతలకు సజ్జల సూచించారు.

This post was last modified on March 12, 2022 10:41 pm

Share
Show comments

Recent Posts

స్టాలిన్ కు ఇచ్చి పడేసిన పవన్

జనసేన ఆవిర్భావ సభా వేదిక మీద నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చాలా విషయాలను ప్రస్తావించారు. కొన్ని…

6 hours ago

ఛావాకు రెండో బ్రేక్ పడింది

మూడు వారాలు ఆలస్యంగా విడుదలైనా మంచి వసూళ్లతో తెలుగు వెర్షన్ బోణీ మొదలుపెట్టిన ఛావాకు వసూళ్లు బాగానే నమోదవుతున్నా ఏదో…

7 hours ago

ఖైదీ 2 ఎప్పుడు రావొచ్చంటే

సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరొందిన లోకేష్ కనగరాజ్ కు మర్చిపోలేని బ్రేక్ ఇచ్చింది ఖైదీ. తెలుగులో…

7 hours ago

దాశరథి, గద్దర్, శ్రీపతి రాములు.. ఎందరెందరో..?

జనసేన ఆవిర్భావ వేడుకల్లో సుదీర్ఘ ప్రసంగం చేసిన ఆ పార్టీ అదినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్… తనను…

8 hours ago

భయం లేదు కాబట్టే… బద్దలు కొట్టాం: పవన్ కల్యాణ్

భయం లేదు కాబట్టే… దుష్ట పాలనను బద్దలు కొట్టామని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.…

9 hours ago

11వ ఆవిర్భావం పూర్తి.. 11 స్థానాల‌కు ప‌రిమితం!: ప‌వ‌న్ కల్యాణ్‌

భార‌త దేశానికి బ‌హుభాషే మంచిద‌ని జ‌న‌సేన అధినేత, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స్ప‌ష్టం చేశారు. తాజాగా పిఠాపురంలో జ‌రిగిన…

9 hours ago