Political News

జైల్లో నుండే పోటీ చేసి గెలిచారు

ఒకపుడు జైలులో శిక్ష అనుభవిస్తూ పోటీ చేసి గెలిచిన నేతలున్నారు. జైలులో ఉన్నపుడు ప్రచారం చేసుకోవడం సాధ్యం కాదు కాబట్టి వీళ్ళ తరపున ప్రచార బాధ్యతలు, ఎన్నికల ప్రక్రియ మొత్తానికి ఎవరో ఒకరు చూసుకునే వారు. నేతలపైన అభిమానం ఉన్న వాళ్ళుంటే ఓట్లేసి గెలిపిస్తారు లేకపోతే లేదు. జైల్లో నుండే నామినేషన్లు వేసి గెలిచిన జార్జి ఫెర్నాండెజ్ లాంటి  నేతలున్నారు.

ఇప్పుడిదంతా ఎందుకంటే ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసిన ఇద్దరు వ్యక్తులు ఇలాగే జైల్లో ఉండే పోటీ చేసి గెలిచారు. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్ధులుగా పోటీ చేసిన అజాంఖాన్, నహిద్ హసన్ జైల్లో నుండే నామినేషన్లు వేయటమే కాదు గెలిచారు కూడా. అది కూడా మామలూగా కాదు మంచి మెజారిటితో గెలవటమే ఆశ్చర్యంగా ఉంది. అజంఖాన్, నహిద్ హసన్ ఏమీ దేశం కోసం లేకపోతే రాష్ట్రం కోసమో పోరాడి జైల్లో శిక్షను అనుభవించటం లేదు.

వీళ్ళద్దరు అసాంఘీక శక్తులుగా ముద్రపడిన వారే. దొంగతనాలు, దోపిడీలు, మానభంగాలు, భూకబ్జాలు, హత్యలు, కిడ్నాపుల్లాంటి అనేక కేసుల్లో ఇరుక్కుని పోలీసులకు దొరికిపోయారు. వీటిల్లో కొన్ని ఆరోపణలు రుజువ్వవటంతో కోర్టు వీళ్ళద్దరికీ శిక్షలు కూడా విధించింది. రాంపూర్ నియోజకవర్గంలో పోటీ చేసిన అజంఖాన్ ప్రస్తుతం సీతాపూర్ జైలు నుండి పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి ఆకాష్ సక్సేనాను 55 వేల ఓట్ల తేడాతో అజంఖాన్ ఓడించారు.

అలాగే కైరానా నియోజకవర్గంలో పోటీ చేసిన నహిద్ హసన్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మృగాంకా సింగ్ పై 25 వేల ఓట్ల కుపైగా మెజారిటితో గెలిచారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జైలులో ఉండే వీళ్ళద్దరు గెలిచారంటే సమాజానికి ఎలాంటి మెసేజ్ వెళుతోంది ? అనేక నేరాలపై జైలు శిక్ష అనుభవిస్తున్నారని తెలిసీ జనాలు వీళ్ళద్దరికీ ఎలా ఓట్లేశారు?. నేరాలు చేసి శిక్షలు అనుభవిస్తున్నా సరే వీళ్ళకు జనాలు ఓట్లేశారంటే వీళ్ళపై పోటీచేసిన బీజేపీ అభ్యర్ధుల చరిత్ర ఏమిటి ? బయట ఉండి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థుల కన్నా జైల్లో ఉన్న వాళ్ళే నయమని జనాలు అనుకున్నారా ? హేమిటో జనాలు ఎవరికి ఎందుకు ఓట్లేస్తారో కూడా అర్థం కావటం లేదు.

This post was last modified on March 12, 2022 11:10 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

43 minutes ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

2 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

9 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago