ఒకపుడు జైలులో శిక్ష అనుభవిస్తూ పోటీ చేసి గెలిచిన నేతలున్నారు. జైలులో ఉన్నపుడు ప్రచారం చేసుకోవడం సాధ్యం కాదు కాబట్టి వీళ్ళ తరపున ప్రచార బాధ్యతలు, ఎన్నికల ప్రక్రియ మొత్తానికి ఎవరో ఒకరు చూసుకునే వారు. నేతలపైన అభిమానం ఉన్న వాళ్ళుంటే ఓట్లేసి గెలిపిస్తారు లేకపోతే లేదు. జైల్లో నుండే నామినేషన్లు వేసి గెలిచిన జార్జి ఫెర్నాండెజ్ లాంటి నేతలున్నారు.
ఇప్పుడిదంతా ఎందుకంటే ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసిన ఇద్దరు వ్యక్తులు ఇలాగే జైల్లో ఉండే పోటీ చేసి గెలిచారు. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్ధులుగా పోటీ చేసిన అజాంఖాన్, నహిద్ హసన్ జైల్లో నుండే నామినేషన్లు వేయటమే కాదు గెలిచారు కూడా. అది కూడా మామలూగా కాదు మంచి మెజారిటితో గెలవటమే ఆశ్చర్యంగా ఉంది. అజంఖాన్, నహిద్ హసన్ ఏమీ దేశం కోసం లేకపోతే రాష్ట్రం కోసమో పోరాడి జైల్లో శిక్షను అనుభవించటం లేదు.
వీళ్ళద్దరు అసాంఘీక శక్తులుగా ముద్రపడిన వారే. దొంగతనాలు, దోపిడీలు, మానభంగాలు, భూకబ్జాలు, హత్యలు, కిడ్నాపుల్లాంటి అనేక కేసుల్లో ఇరుక్కుని పోలీసులకు దొరికిపోయారు. వీటిల్లో కొన్ని ఆరోపణలు రుజువ్వవటంతో కోర్టు వీళ్ళద్దరికీ శిక్షలు కూడా విధించింది. రాంపూర్ నియోజకవర్గంలో పోటీ చేసిన అజంఖాన్ ప్రస్తుతం సీతాపూర్ జైలు నుండి పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి ఆకాష్ సక్సేనాను 55 వేల ఓట్ల తేడాతో అజంఖాన్ ఓడించారు.
అలాగే కైరానా నియోజకవర్గంలో పోటీ చేసిన నహిద్ హసన్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మృగాంకా సింగ్ పై 25 వేల ఓట్ల కుపైగా మెజారిటితో గెలిచారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జైలులో ఉండే వీళ్ళద్దరు గెలిచారంటే సమాజానికి ఎలాంటి మెసేజ్ వెళుతోంది ? అనేక నేరాలపై జైలు శిక్ష అనుభవిస్తున్నారని తెలిసీ జనాలు వీళ్ళద్దరికీ ఎలా ఓట్లేశారు?. నేరాలు చేసి శిక్షలు అనుభవిస్తున్నా సరే వీళ్ళకు జనాలు ఓట్లేశారంటే వీళ్ళపై పోటీచేసిన బీజేపీ అభ్యర్ధుల చరిత్ర ఏమిటి ? బయట ఉండి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థుల కన్నా జైల్లో ఉన్న వాళ్ళే నయమని జనాలు అనుకున్నారా ? హేమిటో జనాలు ఎవరికి ఎందుకు ఓట్లేస్తారో కూడా అర్థం కావటం లేదు.
This post was last modified on March 12, 2022 11:10 am
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…