తన జోకులతో.. నటనతో.. ప్రజలను నవ్వించిన హాస్యనటుడు ఇప్పుడు పంజాబ్ సీఎం పీఠంపై కూర్చోబోతున్నారు. కమెడియన్గా ప్రజల మనసు దోచుకున్న ఆయన.. ఇప్పుడు ఓట్లు కూడా కొల్లగొట్టి తొలిసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆయనే ఆమ్ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్. పంజాబ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పార్టీని పాలించేది ఆయనే. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేనప్పటికీ రాజకీయాల్లో అడుగుపెట్టిన 11 ఏళ్లకే ఆయన ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోవడం విశేషం. భారత రాజకీయాల్లో ఇది చాలా అరుదనే చెప్పాలి.
ఉపాధ్యాయ కుటుంబం నుంచి..
48 ఏళ్ల భగవంత్ 1973లో సంగ్రూర్లోని సతోజ్ గ్రామంలో ఉపాధ్యాయ కుటుంబంలో జన్మించారు. కళాశాల దశలోనే సామాజిక, రాజకీయ అంశాలపై వ్యంగాస్త్రాలు సంధించి మంచి హాస్య కళాకారుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత టీవీ సీరియళ్లతోనూ పంజాబ్ ప్రజలకు చేరువయ్యారు. ప్రస్తుత కాంగ్రెస్ నేత నవ్జోత్ సింగ్ సిద్ధూ ఒకప్పుడు జడ్జ్గా వ్యవహరించిన ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ షోలో భగవంత్ పాల్గొనడంతో ఆయన పేరు మార్మోగింది. 2011లో ఆయన పీపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్లో చేరారు. ఆ పార్టీ తరపున 2012లో పోటీ చేసి ఓడిపోయారు.
ఈ నిర్ణయంతో..
2014 లోక్సభ ఎన్నికలకు ముందు పీపుల్స్ పార్టీ కాంగ్రెస్లో విలీనమైంది. ఆ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాలని భగవంత్ తీసుకున్న నిర్ణయం ఆయన రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. సంగ్రూర్ నుంచి లోక్సభ ఎన్నికలో పోటీ చేసిన ఆయన రెండు లక్షలకుపైగా ఓట్లతో గెలిచారు. 2017లో అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆయనకు ఓటమి ఎదురైంది.
అయితే అప్పుడు 20 సీట్లు గెలిచిన ఆప్ ప్రధాన ప్రతిపక్షంగా నిలవడంతో పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్ష బాధ్యతలను భగవంత్కే కేజ్రీవాల్ అప్పగించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో మరోసారి భగవంత్ గెలిచారు. తాజా అసెంబ్లీ ఎన్నికల ముందు ఆప్ సీఎం అభ్యర్థి ఎవరూ అంటూ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో 93 శాతం మంది భగవంత్కే మొగ్గు చూపారు. దీంతో సీఎం అభ్యర్థిగా ఆయన్నే కేజ్రీవాల్ ప్రకటించారు. ఇప్పుడు ఆ పార్టీ నెగ్గడంతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…