ఎన్నికల్లో పాల్గొన్న ప్రముఖులు ఒక్కోసారి ఓడిపోవటం సహజంగా జరుగుతున్నదే. దీనికి చాలా ఉదాహరణలే ఉన్నాయి. కానీ పోటీచేసిన ప్రముఖులంతా ఒకే పద్దతిలో ఓడిపోవటం అన్నది మాత్రం దేశంలోని ఏ రాష్ట్రంలోను జరిగినట్లు లేదు. ఈ రికార్డు పంజాబ్ లో మొట్టమొదటిసారి నమోదైంది. విషయం ఏమిటంటే తాజాగా జరిగిన ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్ ప్రముఖులంతా ఆప్ చేతిలోనే ఓడిపోవటం విచిత్రంగా ఉంది.
ఓడిన ప్రముఖులు మామూలు ప్రముఖులు కాదు. అత్యంత ఘనచరిత్ర కలిగిన ప్రముఖులు కావటమే ఆశ్చర్యం. ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన శిరోమణి అకాలీదళ్ నేత 94 ఏళ్ళవయస్సున్న ప్రకాష్ సింగ్ బాదల్ లంబీ నియోజకవర్గం నుండి పోటీచేశారు. ఆప్ తరపున పోటీచేసిన జగ్ పాల్ సింగ్ బాదల్ చేతిలో ఓడిపోయారు. ఈయన కొడుకు, అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ జలాలాబాద్ నుండి పోటీచేశారు. ఈయన కూడా ఆప్ అభ్యర్ధిచేతిలోనే ఓడిపోయారు.
ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ ఈ ఎన్నికల్లో చామ్ కౌర్ సాహిబ్, బదౌర్ నియోజకవర్గాల నుండి పోటీచేశారు. రెండుచోట్లా గెలుపుపై నమ్మకంతో పోటీచేస్తే రెండుచోట్లా ఓడిపోయారు. రెండుచోట్ల కూడా ఆప్ అభ్యర్ధుల చేతిలోనే ఓడిపోయారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ వ్యవస్ధాపకుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ పాటియాలాలో పోటీచేశారు. పాటియాలాలో కెప్టెన్ దశాబ్దాలుగా గెలుస్తునే ఉన్నారు. అలాంటిది తాజా ఎన్నికల్లో ఆప్ అభ్యర్ధి అజిత్ పాల్ సింగ్ చేతిలో 20 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
పీసీసీ చీఫ్ నవ్ జోత్ సింగ్ సిద్ధూ అమృతసర్ తూర్పు నియోజకవర్గం నుండి పోటీచేశారు. ఆప్ అభ్యర్ధి జీవన్ జోత్ కౌర్ చేతిలో సుమారు 8 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. చివరగా సోనూసూద్ చెల్లెలు మాళవికా సూద్ మోగా నియోజకవర్గం నుండి పోటీచేశారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గడచిన 40 ఏళ్ళుగా ఓడిందేలేదు. అలాంటిది మొదటిసారి మాళవిక సూద్ ఆప్ అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు. సోనూసూద్ కు పేరు కారణంగా, సోను చేసిన ప్రచారం కారణంగా మాళవిక కచ్చితంగా గెలుస్తుందని అనుకున్నారు. కానీ ఆప్ దెబ్బకు ఓడిపోయింది. మొత్తంమీద ప్రముఖులందరినీ ఆప్ ఒకదెబ్బకు ఊడ్చిపారేసింది.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…