రాజకీయాల్లో శత్రుత్వం ఏమీ ఉండదు.. జస్ట్ పైకి మాట్లాడినంత కోపాలూ తాపాలూ లోపల ఉండవు. ఉండకూడదు కూడా! నిన్నటి వేళ బొత్స ఇంటి వేడుకలకు టీడీపీ నేతలు కూడా హాజరయ్యారు. కుమారుడు డాక్టర్ సందీప్ వెడ్డింగ్ రిసెప్షన్ కు అన్ని పార్టీల నాయకులు హాజరయ్యారు. ఓ టీడీపీ యువ నేత మాత్రం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఆయనే మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుమారుడు కిమిడి నాగార్జున. వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గం తరఫున బొత్సతో తలపడేది ఆయనే!
ఇప్పటికే జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా ఆయనే చూస్తున్నారు. చాలా యాక్టివ్ గా ఉంటారు. అనవసర వ్యాఖ్యలు చేయరు. ముఖ్యంగా వైసీపీ సర్కారు పై విధానపరమైన పోరాటమే చేస్తారు.అంతేకానీ బూతులు మాట్లాడరు. మంచి విద్యావంతుడు రాజకీయ నేపథ్యం ఉన్న నాయకుడు కావడంతో ఇప్పటికే మంచి ఫాలోయింగ్ వచ్చింది. నిన్నటి వేళ ఆయన సభా ప్రాంగణానికి చేరుకోగానే
బొత్స ఎంతో ఆత్మీయంగా పలకరించి, వెన్నుతట్టి అభినందించారు. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో అడుగులు వేస్తున్న సందీప్ (బొత్స కుమారుడు) దంపతులను పరిచయం చేసి కాసేపు నవ్వులు పూయించారు. బొత్స భార్య మాజీ ఎంపీ ఝాన్సీ కూడా ఎంతో ఆదరంగా నాగార్జున తో మాట్లాడారు. ఈ మాటలు ఫొటోలు అన్నీ ఇప్పుడు విజయ నగరం జిల్లాలోనే కాదుసోషల్ మీడియాలోనూ ట్రెండ్ అవుతున్నాయి. వేడుకలకు వెళ్లిన ఫొటోలను నాగార్జున తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేశారు. నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.వాస్తవానికి కిమిడి కుటుంబానికి బొత్స కుటుంబానికి పెద్దగా వైరమేమీ లేదనే అంటారు కొందరు.
మరీ అంత ఘోరంగా బొత్సను ఆ కుటుంబం తిట్టిన దాఖలాలు లేవు.వివాదాలకు దూరంగా ఉంటూ విధాన పరంగా విమర్శిస్తూ పార్టీ చెప్పిన పని చెప్పిన విధంగా చేసుకుపోవడంతో బొత్స కుటుంబం కూడా అనేక సందర్బాల్లో హుందాగానే కిమిడి కుటుంబం విషయమై వ్యవహరించదన్నది కొందరి మాట. ఇక బొత్సఇంటి ఆతిథ్యం ఎంతో బాగుంటుందని సాక్షాత్తూ కేటీఆర్ (తెలంగాణ మంత్రి) ఎన్నడో ప్రశంసించారు. అదే నిన్నటి వేళ నిరూపితం అయింది. ఇక నిన్నటి వేళ వేడుకల్లో కురసాల కన్నబాబు, అనిల్ తో సహా పలువురు మంత్రులు నాయకులు ఎంతో ఆకర్షణగా నిలిచారు. ఆద్యంతం ఈ వేడుక కన్నుల పండుగగా సాగింది. పార్టీలు వేరయినా నాయకులంతా ఓ చోటకు చేరుకుని ఆనందాలు పంచుకోవడం మంచి పరిణామమే కదా!
This post was last modified on March 10, 2022 10:28 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…