Political News

బుల్డోజర్లు తెలంగాణకు వస్తున్నాయి: రాజా సింగ్

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పంజాబ్ మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యూపీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీ బుల్డోజర్లు సిద్ధంగా ఉన్నాయని, ఆ బుల్డోజర్లు తెలంగాణకు సైతం వస్తున్నాయని రాజా సింగ్ షాకింగ్ కామెంట్లు చేశారు. తెలంగాణ ప్రభుత్వ అవినీతి, కుటుంబ పాలనను బల్డోజర్లతో తొక్కిచ్చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

యూపీ సీఎం యోగి గెలుపును యావత్ భారత్ కోరుకుందని , తెలంగాణలో కూడా ఇవే ఫలితాలు వస్తాయని రాజాసింగ్ అన్నారు. దౌర్జన్యాలు, అన్యాయాలపై యోగి ఉక్కుపాదం మోపారని, ప్రజా సంక్షేమానికి కృషి చేశాడని కొనియాడారు. కేసీఆర్ కలలోకి కూడా మోడీ వస్తున్నారని, అందుకే కేసీఆర్ ఉలిక్కిపడుతున్నారని రాజా సింగ్ ఎద్దేవా చేశారు.

దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందని, తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఖతం అవుతుందని షాకింగ్ కామెంట్లు చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం బ్లాక్ మెయిల్ పార్టీ అని, డబ్బులిస్తారా…? అభ్యర్థిని నిలబెట్టమంటారా? అంటూ బెదిరిస్తుందని ఆరోపించారు. ఎంఐఎంతో బీజేపీ దోస్తీ అనేది.. కేవలం ప్రచారమేనని కొట్టిపారేశారు. ఎంఐఎం‌ తమకు రాజకీయ శత్రువని స్పష్టం చేశారు.

కాగా, యూపీలో ఉండాలంటే యోగీ అనాల్సిందేనని, బీజేపీకి ఓటేయకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తామని యూపీ ఎన్నికలకు ముందు ఇదే తరహాలో రాజాసింగ్ వ్యాఖ్యానించడం దుమారం రేపింది. బీజేపీకి ఓటు వేయని వారు ఎన్నికల తర్వాత యూపీ నుంచి వెళ్లిపోవాలని రాజాసింగ్ హెచ్చరించడంపై వివాదం రేగింది.

This post was last modified on March 10, 2022 10:19 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

అప్పుడు బాలీవుడ్‌పై విమర్శలు.. ఇప్పుడేమో

రోమ్‌లో ఉన్నపుడు రోమన్‌లా ఉండాలని ఓ సామెత. సినిమా వాళ్ల విషయానికి వస్తే.. ఏ ఇండస్ట్రీలో సినిమా చేస్తే అక్కడి…

20 mins ago

థియేట్రికల్ రిలీజ్‌లు లైట్.. ఓటీటీ సినిమాలే హైలైట్

ఏప్రిల్ చివరి వారం అంటే పీక్ సమ్మర్.. ఈ టైంలో పెద్ద పెద్ద సినిమాలతో థియేటర్లు కళకళలాడుతుండాలి. రెండు గంటలు…

2 hours ago

పింఛ‌న్ల‌పై పిడుగు.. వైసీపీకి క‌ష్ట‌మేనా?

సామాజిక పింఛ‌న్ల పై పిడుగు ప‌డిన‌ట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంట‌రి మ‌హిళ లు.. వంటి సామాజిక పింఛ‌నుపై…

8 hours ago

వైసీపీ మేనిఫెస్టోపై చంద్ర‌బాబు ఫ‌స్ట్‌ రియాక్ష‌న్

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నిక‌ల మేనిఫెస్టోను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 2019…

8 hours ago

జై హనుమాన్ రూటు మారుతోంది

స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…

8 hours ago

ఆ విషయంలో ఎవరైనా సుకుమార్ తర్వాతే..

టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…

10 hours ago