Political News

బుల్డోజర్లు తెలంగాణకు వస్తున్నాయి: రాజా సింగ్

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పంజాబ్ మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యూపీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీ బుల్డోజర్లు సిద్ధంగా ఉన్నాయని, ఆ బుల్డోజర్లు తెలంగాణకు సైతం వస్తున్నాయని రాజా సింగ్ షాకింగ్ కామెంట్లు చేశారు. తెలంగాణ ప్రభుత్వ అవినీతి, కుటుంబ పాలనను బల్డోజర్లతో తొక్కిచ్చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

యూపీ సీఎం యోగి గెలుపును యావత్ భారత్ కోరుకుందని , తెలంగాణలో కూడా ఇవే ఫలితాలు వస్తాయని రాజాసింగ్ అన్నారు. దౌర్జన్యాలు, అన్యాయాలపై యోగి ఉక్కుపాదం మోపారని, ప్రజా సంక్షేమానికి కృషి చేశాడని కొనియాడారు. కేసీఆర్ కలలోకి కూడా మోడీ వస్తున్నారని, అందుకే కేసీఆర్ ఉలిక్కిపడుతున్నారని రాజా సింగ్ ఎద్దేవా చేశారు.

దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందని, తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఖతం అవుతుందని షాకింగ్ కామెంట్లు చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం బ్లాక్ మెయిల్ పార్టీ అని, డబ్బులిస్తారా…? అభ్యర్థిని నిలబెట్టమంటారా? అంటూ బెదిరిస్తుందని ఆరోపించారు. ఎంఐఎంతో బీజేపీ దోస్తీ అనేది.. కేవలం ప్రచారమేనని కొట్టిపారేశారు. ఎంఐఎం‌ తమకు రాజకీయ శత్రువని స్పష్టం చేశారు.

కాగా, యూపీలో ఉండాలంటే యోగీ అనాల్సిందేనని, బీజేపీకి ఓటేయకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తామని యూపీ ఎన్నికలకు ముందు ఇదే తరహాలో రాజాసింగ్ వ్యాఖ్యానించడం దుమారం రేపింది. బీజేపీకి ఓటు వేయని వారు ఎన్నికల తర్వాత యూపీ నుంచి వెళ్లిపోవాలని రాజాసింగ్ హెచ్చరించడంపై వివాదం రేగింది.

Satya

Recent Posts

బాల‌కృష్ణ కూతురు మ‌ళ్లీ చిత‌గ్గొట్టేసింది

సెల‌బ్రెటీల కుటుంబాల్లో కొంద‌రిలో ఎంతో ప్ర‌తిభ ఉన్న‌ప్ప‌టికీ.. అది ఎప్పుడో కానీ బ‌య‌టికి రాదు. ఎప్పుడూ మామూలుగా క‌నిపించే వ్య‌క్తులు..…

3 hours ago

సలార్ ఇవ్వనిది లెనిన్ అందించింది

రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…

4 hours ago

శేఖ‌ర్ మాస్ట‌ర్ వెర్స‌స్ జానీ మాస్ట‌ర్

టాలీవుడ్ అగ్ర‌శ్రేణి డ్యాన్స్ మాస్ట‌ర్లు ఇద్ద‌రి మ‌ధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు…

6 hours ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

6 hours ago

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

6 hours ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

7 hours ago