Political News

‘జాబులెక్కడ జగన్ రెడ్డి’…టీడీపీ ఎమ్మెల్యేల ర్యాలీ

తెలంగాణలోని నిరుద్యోగులకు ఊరటనిచ్చేలా సీఎం కేసీఆర్ జంబో జాబ్ క్యాలెండర్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ చరిత్రలో ఉద్యోగాలకు సంబంధించి 91,142 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో, ఏపీలో జాబ్ క్యాలెండర్ చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే జగన్ నిరుద్యోగులను మోసం చేశారని, తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని టీడీపీ సహా విపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే జగన్ తీరును నిరసిస్తూ టీడీపీ శాసనసభా పక్ష నేతలు అసెంబ్లీ దగ్గర ర్యాలీ చేపట్టారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ దగ్గర నిరసనకు దిగారు.  సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీ వరకు టీడీపీ శాసనసభాపక్ష నేతలు భారీ ర్యాలీ చేపట్టి జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

‘జాబులెక్కడ జగన్ రెడ్డి’ అంటూ బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. నిరుద్యోగుల్ని జగన్ మోసం చేశారని, కాంట్రాక్టు ఉద్యోగుల్ని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణను చూసి ఏపీ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలని టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు గుప్పించారు.

ఏపీలో నిరుద్యోగం నానాటికీ పెరిగిపోతోందని, ప్రతిపక్ష నేతగా 2.5 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పిన జగన్…వారినిమోసగించారని ఫైర్ అయ్యారు. జగన్ హామీ ఇచ్చినట్టు రెండున్నర లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ ఆయన చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో నారా లోకేశ్, కింజారపు అచ్చెన్నాయుడు, అశోక్ బాబు తదితర నేతలు పాల్గొన్నారు.

Satya

Recent Posts

లేటైతే… హైప్ హుళక్కే

ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…

1 hour ago

జ‌ల‌సంధి తెరిచారు.. ధ‌ర‌లు త‌గ్గాయి.. అయినా క‌ష్టాలే!

గ‌త రెండు మాసాల‌కు పైగా ఇంధ‌న, గ్యాస్ స‌మ‌స్య‌ల‌తో ప్ర‌పంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గుర‌వుతున్నాయి. చ‌మురు ధ‌ర‌లు పెరిగిపోవ‌డ‌మే…

3 hours ago

‘బ‌లిదానాల‌తో ఏర్ప‌డిన తెలంగాణ‌లో నాయ‌కులు గ‌ద్దెనెక్కారు’

తెలంగాణ‌పై మ‌రోసారి ఏపీ డిప్యూటీ సీఎం జ‌న‌సేన పార్టీ అధినేత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో సోమ‌వారం చేప‌ట్టిన జాతీయ…

5 hours ago

ఆప‌రేష‌న్ టైగ‌ర్‌… బీజేపీ దూకుడు!

దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేత‌లు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…

5 hours ago

అమరావతిపై ఆరా తీసిన సింగపూర్ ప్రధాని

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…

7 hours ago

రవితేజ సేఫ్ గేమ్ ఆడతారా

మాస్ మహారాజా రవితేజ లైనప్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు చక్కగా కనిపిస్తోంది. వరస డిజాస్టర్ల సంగతి పక్కనపెడితే ఇరుముడి మీద…

7 hours ago