Political News

మహిళలే బీజేపీని గట్టెక్కించారా?

ఎగ్జిట్ పోల్స్ సర్వేలో ఉత్తరప్రదేశ్ లో బీజేపీనే గెలుస్తోందని అర్ధమైంది. యూపీలో మొదటి నుండి బీజేపీని గెలుస్తుందని చాలామంది నమ్మారు. ఎందుకంటే యోగి ఆదిత్యనాద్ ప్రభుత్వంపై జనాల్లో అనేక విషయాల్లో వ్యతిరేకత ఉన్నా సానుకూలత కూడా ఉంది. ఆ సానుకూలత వల్లే తాజా ఎన్నికల్లో మహిళలు ఎక్కువమంది బీజేపీకి ఓట్లేశారట. అంతటి అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే లా అండ్ ఆర్డర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిందే. 2012-17 మధ్య ఎస్పీ అధికారంలో ఉంది. మహిళలు ఎందుకు ఓట్లేశారని తెలుసుకోవాలంటే కాస్త చరిత్రలోకి వెళ్ళాలి.

అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ చాలా ఘోరంగా తయారైంది. ముఖ్యంగా రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ముస్లిం మాఫియాతో పాటు కొన్ని ప్రాంతాల్లో హిందు మాఫియాలు కూడా యధేచ్చగా రాజ్యమేలాయి. ఈ రెండు మాఫియాలకు అఖిలేష్ ప్రభుత్వం మద్దతుందని జనాలు నమ్మారు. ఎందుకంటే తమకు అన్యాయం జరిగిందని ఎవరు ఫిర్యాదులు చేసినా ఎవరిపైనా పోలీసులు యాక్షన్ తీసుకున్నదిలేదు. మహిళలకు, యువతులు అయితే స్వేచ్చగా బయటకాదు కదా ఇళ్ళల్లో కూడా ఉండలేకపోయారట.

ఇలాంటి పరిస్ధితుల్లో బీజేపీ అధికారంలోకి వచ్చి యోగి బాధ్యతలు తీసుకున్నారు. అక్కడి నుండి పోలీసులకు ఫ్రీహ్యాండ్ ఇచ్చారు. లా అండ్ ఆర్డర్ మెయినటైన్ చేయటం కోసం మాఫియా వెంటపడ్డారు. చాలామంది మాఫియా లీడర్లను కాల్చిచంపేశారు. దెబ్బకు కొందరు రాష్ట్రం వదిలిపారిపోయారు. మరికొందరు లొంగిపోయి జైళ్ళల్లో మగ్గుతున్నారు. బెయిల్ ఇచ్చినా బయటకు రావటంలేదట. కారణం ఏమిటంటే బయటకు వస్తే పోలీసులు చంపేస్తారని భయమే.

దీనిదెబ్బకు మహిళల్లో ఆత్మవిశ్వాసం మొదలైంది. మహిళలు, యువతులు స్వేచ్చగా కాలేజీలకు, స్కూళ్ళకు, మార్కెట్లకు తిరగ్గలుగుతున్నారు. అందుకనే మొన్నటి పోలింగ్ లో 48 శాతంమంది మహిళలు  బీజేపీకి  ఓట్లేసినట్లు సెఫాలజిస్టులు తేల్చారు. ఎస్పీకి కూడా మహిళల ఓట్లు పడినా అది 36 శాతమేనట. అంటే ఎస్పీకన్నా బీజేపీకి 16 శాతం మహిళల ఓట్లు ఎక్కువగా పడిన కారణంగానే బీజేపీ అధికారంలోకి వస్తుందని సెఫాలజిస్టులు నిర్ధారించారు.

This post was last modified on March 10, 2022 4:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

20 minutes ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

7 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago