Political News

మహిళలే బీజేపీని గట్టెక్కించారా?

ఎగ్జిట్ పోల్స్ సర్వేలో ఉత్తరప్రదేశ్ లో బీజేపీనే గెలుస్తోందని అర్ధమైంది. యూపీలో మొదటి నుండి బీజేపీని గెలుస్తుందని చాలామంది నమ్మారు. ఎందుకంటే యోగి ఆదిత్యనాద్ ప్రభుత్వంపై జనాల్లో అనేక విషయాల్లో వ్యతిరేకత ఉన్నా సానుకూలత కూడా ఉంది. ఆ సానుకూలత వల్లే తాజా ఎన్నికల్లో మహిళలు ఎక్కువమంది బీజేపీకి ఓట్లేశారట. అంతటి అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే లా అండ్ ఆర్డర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిందే. 2012-17 మధ్య ఎస్పీ అధికారంలో ఉంది. మహిళలు ఎందుకు ఓట్లేశారని తెలుసుకోవాలంటే కాస్త చరిత్రలోకి వెళ్ళాలి.

అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ చాలా ఘోరంగా తయారైంది. ముఖ్యంగా రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ముస్లిం మాఫియాతో పాటు కొన్ని ప్రాంతాల్లో హిందు మాఫియాలు కూడా యధేచ్చగా రాజ్యమేలాయి. ఈ రెండు మాఫియాలకు అఖిలేష్ ప్రభుత్వం మద్దతుందని జనాలు నమ్మారు. ఎందుకంటే తమకు అన్యాయం జరిగిందని ఎవరు ఫిర్యాదులు చేసినా ఎవరిపైనా పోలీసులు యాక్షన్ తీసుకున్నదిలేదు. మహిళలకు, యువతులు అయితే స్వేచ్చగా బయటకాదు కదా ఇళ్ళల్లో కూడా ఉండలేకపోయారట.

ఇలాంటి పరిస్ధితుల్లో బీజేపీ అధికారంలోకి వచ్చి యోగి బాధ్యతలు తీసుకున్నారు. అక్కడి నుండి పోలీసులకు ఫ్రీహ్యాండ్ ఇచ్చారు. లా అండ్ ఆర్డర్ మెయినటైన్ చేయటం కోసం మాఫియా వెంటపడ్డారు. చాలామంది మాఫియా లీడర్లను కాల్చిచంపేశారు. దెబ్బకు కొందరు రాష్ట్రం వదిలిపారిపోయారు. మరికొందరు లొంగిపోయి జైళ్ళల్లో మగ్గుతున్నారు. బెయిల్ ఇచ్చినా బయటకు రావటంలేదట. కారణం ఏమిటంటే బయటకు వస్తే పోలీసులు చంపేస్తారని భయమే.

దీనిదెబ్బకు మహిళల్లో ఆత్మవిశ్వాసం మొదలైంది. మహిళలు, యువతులు స్వేచ్చగా కాలేజీలకు, స్కూళ్ళకు, మార్కెట్లకు తిరగ్గలుగుతున్నారు. అందుకనే మొన్నటి పోలింగ్ లో 48 శాతంమంది మహిళలు  బీజేపీకి  ఓట్లేసినట్లు సెఫాలజిస్టులు తేల్చారు. ఎస్పీకి కూడా మహిళల ఓట్లు పడినా అది 36 శాతమేనట. అంటే ఎస్పీకన్నా బీజేపీకి 16 శాతం మహిళల ఓట్లు ఎక్కువగా పడిన కారణంగానే బీజేపీ అధికారంలోకి వస్తుందని సెఫాలజిస్టులు నిర్ధారించారు.

This post was last modified on March 10, 2022 4:57 pm

Share

Recent Posts

గోరు ముద్దలు కాదు విషపు ముద్దలు తినిపించారు

వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…

2 hours ago

టాక్సిక్ జీవోలు… దాటాల్సిన సవాళ్లు

రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…

2 hours ago

వారణాసి తరువాత మహేష్ ఒప్పుకుంటే అనిల్ తోపే

వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…

4 hours ago

మహిళా ఎస్సైని కొట్టిన ఎమ్మెల్యే కూతురు

కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…

4 hours ago

గీతూ మోహన్ దాస్… పెద్ద కథే గురూ

టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…

6 hours ago

ఇరుముడిని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉందా

ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…

6 hours ago