Political News

జగన్ పార్టీ వీక్ నెస్ తమ్ముళ్లకు తెలిసిపోయిందా?

చట్టసభలు సమావేశమైన వేళ.. అధికార విపక్షాలు ఎత్తులు పైఎత్తులు వేసుకోవటం కామన్. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని విపక్షం.. ప్రతిపక్షానికి చుక్కలు చూపించాలని అధికారపక్షం తపిస్తుంటుంది. ఇలాంటివేళ.. అధికారపక్షం కాస్తంత సంయమనంతో వ్యవహరిస్తే.. ప్రతిపక్షం దూకుడుగా వ్యవహరించటం మామూలే.

మారిన రాజకీయాలకు తగ్గట్లు.. విపక్షాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో అధికారపక్షాలు తన సత్తా చాటటం కొన్నేళ్లుగా చూస్తున్నాం. ఇలాంటప్పుడు తెలివితో ఒకరినొకరు దెబ్బ కొట్టాలే కానీ కండబలాన్ని సభలో ప్రదర్శించటం ఏ మాత్రం సరికాదు.

అవసరం లేకున్నా ఒక పాయింట్ ను విపక్షం తీసుకొస్తుందంటే.. వారి లెక్క ఏమిటన్న విషయాన్ని అధికారపక్షం ఆలోచించాలి. గొడవ చేసుకోవాలన్నదే విపక్షం లక్ష్యమైతే.. వారు కోరుకున్నట్లుగా చేయటంతో ప్రయోజనం ఉండదు. కానీ..దూకుడుకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి సహనం లాంటివి ఆశించలేం. వారికున్న బలం.. బలహీనత అయినా ఆవేశాన్ని తమకు అనుకూలంగా వాడుకోవటం ద్వారా అధికారపక్షాన్ని ఇరుకున పడేలా చేయటంలో తెలుగు తమ్ముళ్లు సక్సెస్ అయ్యారని చెప్పాలి.

ఏ మాట అంటే అధికార పార్టీ రెచ్చిపోతుందో? గమనించి వారిని కంట్రోల్ తప్పేలా చేయటం మీద తమ్ముళ్లు భారీగానే కసరత్తు చేసినట్లు కనిపిస్తోంది. దీనికి తగినట్లుగానే బుధవారం ఏపీ శాసనమండలి సమావేశాలు జరిగాయని చెప్పాలి. అవసరం లేని విషయం మీద అనవసరంగా రచ్చ చేస్తున్న విపక్షం లక్ష్యం.. బిల్లులు ఆమోదం పొందకుండా ఉండటం లక్ష్యం కాదు.

సభలో అధికారపక్షం హద్దులు దాటేలా రెచ్చగొట్టటమే ఎజెండా అన్నది చెప్పక తప్పదు. బుధవారం చోటు చేసుకున్న కోట్లాటను చూస్తే.. అధికార పార్టీ నేతల వీక్ నెస్ ఏమిటన్న దానిపై తెలుగు తమ్ముళ్లు మంచి పట్టు సాధించారనే చెప్పాలి.

మాటలతో దారుణరీతిలో తిట్టుకుంటున్న స్థానే.. భౌతికదాడికి ప్రేరేపించేలా మంత్రుల్ని రెచ్చగొట్టిన తమ్ముళ్ల తీరు చూస్తే.. తాము విసిరిన ఉచ్చులో అధికారపక్షం పడేలా చేసిందని చెప్పాలి. తమ్ముళ్లు మొండిగా వ్యవహరించారని.. తొండి ఆట ఆడారని ఎంత ఆరోపించినా.. వారిపై దాడి చేసిన మచ్చ మాత్రం అధికారపక్షం మీద ఉండిపోతుందన్నది మర్చిపోకూడదు.

ఇదంతా చూసినప్పుడు నాలుగు దెబ్బలు తిన్నా.. అంతకు మించిన పాలిటికల్ మైలేజీ.. సానుభూతిని సొంతం చేసుకోవాలన్నదే తమ్ముళ్ల ఆలోచనగా ఉందన్న మాట అధికారపక్ష నేతలు కొందరు ఆఫ్ ద రికార్డుగా పేర్కొనటం గమనార్హం. జగన్ మంత్రుల వీక్ నెస్ లను తమ్ముళ్లు క్రాక్ చేసిన నేపథ్యంలో.. రానున్న రోజుల్లో మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం జగన్ పార్టీ నేతల మీద ఉంది. లేకుంటే.. తమ్ముళ్ల మీద పట్టు సాధించటం తర్వాత.. తరచూ వారి చేతుల్లో అడ్డంగా బుక్ అయిపోవటం ఖాయం.

This post was last modified on June 18, 2020 2:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రసాదుగారు మళ్ళీ సిక్సు కొట్టేశారు

మన శంకరవరప్రసాద్ గారు నుంచి మరో పాట వచ్చేసింది. నిజానికీ రిలీజ్ రేపు జరగాలి. కానీ ఒక రోజు ముందుగా…

44 minutes ago

వరల్డ్ కప్ పై గంభీర్ ఘాటు రిప్లై, వాళ్లిద్దరి గురించేనా?

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ విజయం తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనదైన స్టైల్లో స్పందించారు. 2027 వరల్డ్…

1 hour ago

గోవా ప్రమాదం.. అసలు తప్పు ఎక్కడ జరిగింది?

గోవా ట్రిప్ అంటే ఫుల్ ఎంజాయ్ అనుకుంటాం. కానీ ఆరపోరాలోని 'బర్చ్ బై రోమియో లేన్' అనే నైట్ క్లబ్…

2 hours ago

పడయప్ప… తెలుగులో కూడా రావాలప్ప

సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు భాష, నరసింహ, దళపతి. వీటిని…

2 hours ago

‘చిన్న చోరీ’ చేసిన దొంగకు ఉన్న పశ్చాతాపం జగన్ కు లేదా?

తాను చేసింది మహా పాపమే అంటూ.. పరకామణి చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు రవికుమార్ తెలిపారు. ఈ వ్యవహారంలో…

3 hours ago

ఇండి’గోల’పై కేటీఆర్ ‘పెత్తనం’ కామెంట్స్

బీఆర్ ఎస్ కార్యనిర్వాహ‌క అధ్య‌క్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అధికారం ఒక‌రిద్ద‌రి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…

5 hours ago