రేపు పది గంటలకు అసెంబ్లీలో కీలక ప్రకటన చేస్తానంటూ తెలంగాణ సీఎం చంద్రశేఖర రావు వెల్లడించారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి తీపి కబురు ఒకటి వెల్లడిస్తానని అన్నారు. ఇవాళ వనపర్తిలో నిర్వహించిన సభలో ఆయనీ సంచలన ప్రకటన చేయడంతో ఇప్పుడు అందరి ఆసక్తీ రేపటి పైనే ! దీంతో టీపీపీఎస్సీ కి సంబంధించి ప్రక్రియ ఎలా ఉండనుంది అన్న ఆశ కూడా ఉంది. వివిధ కార్యాలయాల్లో నెలకొన్న ఖాళీలు ఏ విధంగా భర్తీ అయి నోటిఫికేషన్ల రూపంలో నిరుద్యోగ జీవితాలకు నజరానాలు అందనున్నాయో అన్న ఆశ సంబంధిత వర్గాల్లో ఉంది.
ఇదంతా బాగానే ఉన్నా ఇప్పటిదాకా ఏడేళ్ల కాల వ్యవధిలో వైద్య ఆరోగ్య శాఖ లో కానీ ఇతర కీలక శాఖల్లో కానీ పోస్టుల ఊసే లేని కేసీఆర్ ఈ సారి ఎందుకు స్టాండ్ మారుస్తున్నారని ? ఢిల్లీ పరిణామాలు అన్నీ బీజేపీ కి అనుకూలం అయితే తానెందుకు హడలిపోతున్నారని? ఇవన్నీ ఎలా ఉన్నా ఘంటా చక్రపాణి లాంటి చదువుకున్న వాళ్లున్న టీపీపీఎస్సీ ఇంతకాలం నిర్వీర్యం అయిపోయి ఆఖరికి పెద్దగా పనిలేని సంస్థగా ఎందుకు మిగిలిందని?
ఇదే సందర్భంలో తెలంగాణతో పాటు ఆంధ్రాలో కూడా ఉద్యోగాల భర్తీపై కొన్ని విమర్శలు రేగుతున్నాయి.వీటిని స్వీకరించాల్సిన దశలో వైసీపీ ఉన్నా లేకున్నా చెప్పాల్సిందే ! ముఖ్యంగా ఆయన ఇచ్చిన వలంటీరు ఉద్యోగం కు సంబంధించి జీతం ఐదు వేలు. ఆ జీతంతో జీవితం మారిపోదు. పోనీ సెక్రటేరియట్ పోస్టుల భర్తీ ఏమయినా సరిగా చేశారా అంటే అదీ లేదు. అదీ చాలీచాలనీ వేతనాలతోనే అని టీడీపీ విమర్శిస్తోంది. ప్రొహిబిషన్ పిరియడ్ కన్ఫం చేయకుండా ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని సంబంధిత వర్గాలు ఎన్నో సార్లు నెత్తీ నోరూ మోదుకుంటున్నాయి. ఇదే సందర్భంలో మరిన్ని నిరుద్యోగ సమస్యలూ ఉన్నాయి.
ముఖ్యంగా కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ లేదు.డీఎస్సీ లేదు. ఇంకా చెప్పాలంటే కీలక శాఖలు అయితే కాంట్రాక్టు లేదా ఔట్ సోర్సింగ్ తోనే నడుస్తున్నాయి. ఈ దశలో రేపు కేసీఆర్ చేసే ప్రకటన తరువాత అయినా ఆంధ్రా సీఎం జగన్ స్పందిస్తారా లేదా అన్న ప్రశ్న ఒకటి టీడీపీ వేస్తోంది. నిరుద్యోగిత నివారణకు చర్యలు తీసుకునే క్రమంలో జగన్ వెనుకంజ వేయడమే కాకుండా పదవీ విరమణ వయస్సు పెంచి, సమస్యను మరింత జఠిలం చేశారన్న వాదన కూడా టీడీపీ నుంచి వస్తోంది.ఏవి ఎలా ఉన్నా కేసీఆర్ ప్రకటనతో అయినా ఆంధ్రాలో కదలిక వస్తే అదే మేలు.
ఆ పాఠశాలలో సంప్రదాయ విద్యా విధానం లేదు.. సహచర విద్యార్థుల ద్వారానే పాఠాలు నేర్చుకుంటారు… ఈ ప్రత్యేకతలు ఉన్న పాఠశాలను…
తెలుగు సినిమాల్లో సాధారణంగా ఒక సినిమాలో ఐదారు పాటలు ఉంటాయి. కొన్ని చిత్రాల్లో ఒకట్రెండు తగ్గుతుంటాయి. కొన్నింట్లో పెరుగుతుంటాయి. థ్రిల్లర్…
సోషల్ మీడియాలోనే కాదు బయట కూడా పెద్దిలో జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఎన్నడూ లేనిది…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఉద్యమ సంఘం నాయకుడు అభిజీత్ దీప్కే ఇచ్చిన పిలుపు ఫలించింది. శనివారం ఉదయం 10 గంటల…
ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భవానీ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరా జయం పాలైన…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో గతంలోను.. ఇప్పుడు కూడా కేటీఆర్…