రేపు పది గంటలకు అసెంబ్లీలో కీలక ప్రకటన చేస్తానంటూ తెలంగాణ సీఎం చంద్రశేఖర రావు వెల్లడించారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి తీపి కబురు ఒకటి వెల్లడిస్తానని అన్నారు. ఇవాళ వనపర్తిలో నిర్వహించిన సభలో ఆయనీ సంచలన ప్రకటన చేయడంతో ఇప్పుడు అందరి ఆసక్తీ రేపటి పైనే ! దీంతో టీపీపీఎస్సీ కి సంబంధించి ప్రక్రియ ఎలా ఉండనుంది అన్న ఆశ కూడా ఉంది. వివిధ కార్యాలయాల్లో నెలకొన్న ఖాళీలు ఏ విధంగా భర్తీ అయి నోటిఫికేషన్ల రూపంలో నిరుద్యోగ జీవితాలకు నజరానాలు అందనున్నాయో అన్న ఆశ సంబంధిత వర్గాల్లో ఉంది.
ఇదంతా బాగానే ఉన్నా ఇప్పటిదాకా ఏడేళ్ల కాల వ్యవధిలో వైద్య ఆరోగ్య శాఖ లో కానీ ఇతర కీలక శాఖల్లో కానీ పోస్టుల ఊసే లేని కేసీఆర్ ఈ సారి ఎందుకు స్టాండ్ మారుస్తున్నారని ? ఢిల్లీ పరిణామాలు అన్నీ బీజేపీ కి అనుకూలం అయితే తానెందుకు హడలిపోతున్నారని? ఇవన్నీ ఎలా ఉన్నా ఘంటా చక్రపాణి లాంటి చదువుకున్న వాళ్లున్న టీపీపీఎస్సీ ఇంతకాలం నిర్వీర్యం అయిపోయి ఆఖరికి పెద్దగా పనిలేని సంస్థగా ఎందుకు మిగిలిందని?
ఇదే సందర్భంలో తెలంగాణతో పాటు ఆంధ్రాలో కూడా ఉద్యోగాల భర్తీపై కొన్ని విమర్శలు రేగుతున్నాయి.వీటిని స్వీకరించాల్సిన దశలో వైసీపీ ఉన్నా లేకున్నా చెప్పాల్సిందే ! ముఖ్యంగా ఆయన ఇచ్చిన వలంటీరు ఉద్యోగం కు సంబంధించి జీతం ఐదు వేలు. ఆ జీతంతో జీవితం మారిపోదు. పోనీ సెక్రటేరియట్ పోస్టుల భర్తీ ఏమయినా సరిగా చేశారా అంటే అదీ లేదు. అదీ చాలీచాలనీ వేతనాలతోనే అని టీడీపీ విమర్శిస్తోంది. ప్రొహిబిషన్ పిరియడ్ కన్ఫం చేయకుండా ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని సంబంధిత వర్గాలు ఎన్నో సార్లు నెత్తీ నోరూ మోదుకుంటున్నాయి. ఇదే సందర్భంలో మరిన్ని నిరుద్యోగ సమస్యలూ ఉన్నాయి.
ముఖ్యంగా కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ లేదు.డీఎస్సీ లేదు. ఇంకా చెప్పాలంటే కీలక శాఖలు అయితే కాంట్రాక్టు లేదా ఔట్ సోర్సింగ్ తోనే నడుస్తున్నాయి. ఈ దశలో రేపు కేసీఆర్ చేసే ప్రకటన తరువాత అయినా ఆంధ్రా సీఎం జగన్ స్పందిస్తారా లేదా అన్న ప్రశ్న ఒకటి టీడీపీ వేస్తోంది. నిరుద్యోగిత నివారణకు చర్యలు తీసుకునే క్రమంలో జగన్ వెనుకంజ వేయడమే కాకుండా పదవీ విరమణ వయస్సు పెంచి, సమస్యను మరింత జఠిలం చేశారన్న వాదన కూడా టీడీపీ నుంచి వస్తోంది.ఏవి ఎలా ఉన్నా కేసీఆర్ ప్రకటనతో అయినా ఆంధ్రాలో కదలిక వస్తే అదే మేలు.
This post was last modified on March 9, 2022 8:12 am
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…