రేపు పది గంటలకు అసెంబ్లీలో కీలక ప్రకటన చేస్తానంటూ తెలంగాణ సీఎం చంద్రశేఖర రావు వెల్లడించారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి తీపి కబురు ఒకటి వెల్లడిస్తానని అన్నారు. ఇవాళ వనపర్తిలో నిర్వహించిన సభలో ఆయనీ సంచలన ప్రకటన చేయడంతో ఇప్పుడు అందరి ఆసక్తీ రేపటి పైనే ! దీంతో టీపీపీఎస్సీ కి సంబంధించి ప్రక్రియ ఎలా ఉండనుంది అన్న ఆశ కూడా ఉంది. వివిధ కార్యాలయాల్లో నెలకొన్న ఖాళీలు ఏ విధంగా భర్తీ అయి నోటిఫికేషన్ల రూపంలో నిరుద్యోగ జీవితాలకు నజరానాలు అందనున్నాయో అన్న ఆశ సంబంధిత వర్గాల్లో ఉంది.
ఇదంతా బాగానే ఉన్నా ఇప్పటిదాకా ఏడేళ్ల కాల వ్యవధిలో వైద్య ఆరోగ్య శాఖ లో కానీ ఇతర కీలక శాఖల్లో కానీ పోస్టుల ఊసే లేని కేసీఆర్ ఈ సారి ఎందుకు స్టాండ్ మారుస్తున్నారని ? ఢిల్లీ పరిణామాలు అన్నీ బీజేపీ కి అనుకూలం అయితే తానెందుకు హడలిపోతున్నారని? ఇవన్నీ ఎలా ఉన్నా ఘంటా చక్రపాణి లాంటి చదువుకున్న వాళ్లున్న టీపీపీఎస్సీ ఇంతకాలం నిర్వీర్యం అయిపోయి ఆఖరికి పెద్దగా పనిలేని సంస్థగా ఎందుకు మిగిలిందని?
ఇదే సందర్భంలో తెలంగాణతో పాటు ఆంధ్రాలో కూడా ఉద్యోగాల భర్తీపై కొన్ని విమర్శలు రేగుతున్నాయి.వీటిని స్వీకరించాల్సిన దశలో వైసీపీ ఉన్నా లేకున్నా చెప్పాల్సిందే ! ముఖ్యంగా ఆయన ఇచ్చిన వలంటీరు ఉద్యోగం కు సంబంధించి జీతం ఐదు వేలు. ఆ జీతంతో జీవితం మారిపోదు. పోనీ సెక్రటేరియట్ పోస్టుల భర్తీ ఏమయినా సరిగా చేశారా అంటే అదీ లేదు. అదీ చాలీచాలనీ వేతనాలతోనే అని టీడీపీ విమర్శిస్తోంది. ప్రొహిబిషన్ పిరియడ్ కన్ఫం చేయకుండా ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని సంబంధిత వర్గాలు ఎన్నో సార్లు నెత్తీ నోరూ మోదుకుంటున్నాయి. ఇదే సందర్భంలో మరిన్ని నిరుద్యోగ సమస్యలూ ఉన్నాయి.
ముఖ్యంగా కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ లేదు.డీఎస్సీ లేదు. ఇంకా చెప్పాలంటే కీలక శాఖలు అయితే కాంట్రాక్టు లేదా ఔట్ సోర్సింగ్ తోనే నడుస్తున్నాయి. ఈ దశలో రేపు కేసీఆర్ చేసే ప్రకటన తరువాత అయినా ఆంధ్రా సీఎం జగన్ స్పందిస్తారా లేదా అన్న ప్రశ్న ఒకటి టీడీపీ వేస్తోంది. నిరుద్యోగిత నివారణకు చర్యలు తీసుకునే క్రమంలో జగన్ వెనుకంజ వేయడమే కాకుండా పదవీ విరమణ వయస్సు పెంచి, సమస్యను మరింత జఠిలం చేశారన్న వాదన కూడా టీడీపీ నుంచి వస్తోంది.ఏవి ఎలా ఉన్నా కేసీఆర్ ప్రకటనతో అయినా ఆంధ్రాలో కదలిక వస్తే అదే మేలు.
This post was last modified on March 9, 2022 8:12 am
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…