సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ, ఈడీలు మరింత సమగ్రంగా విచారణ జరపాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కొద్ది రోజుల క్రితం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ, ఆ పిటిషన్ పై హైకోర్టు రిజిస్ట్రి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నెంబర్ కేటాయించలేదు. దీంతో రఘురామ మరోసారి పిటిషన్ వేశారు. తాజాగా దానిని పరిశీలించిన తెలంగాణ హైకోర్టు.. రఘురామ పిటీషన్ విచారణ అర్హత తేల్చేందుకుగానూ వెంటనే ఆ పిటిషన్ కు నెంబరు కేటాయించాలని రిజిస్ట్రీకి కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఆ పిటిషన్ విచారణ అర్హతను తేల్చాలని హైకోర్టు నిర్ణయించింది. రఘురామ కృష్ణరాజు వేసిన పిటిషన్ కు నెంబరు కేటాయించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. వాదనలను వినకుండా ఉత్తర్వులెలా జారీ చేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ప్రశ్నించింది. ఆ పిల్ పై హైకోర్టు రిజిస్ట్రీ తెలిపిన అభ్యంతరాలను ధర్మాసనం తోసిపుచ్చింది.
దీంతో, ఈ పిటిషన్ కు విచారణ అర్హత ఉందని హైకోర్టు నిర్ధారిస్తే జగన్కు మరిన్ని చిక్కులు తప్పవని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సీబీఐ, ఈడీలు సమగ్ర దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశిస్తే జగన్ ఇబ్బందుల్లో పడతారని అంటున్నారు. కాగా, జగన్ అక్రమాస్తుల కేసుల్లో 11 అభియోగపత్రాలను దాఖలు చేసిన సీబీఐ అసమగ్రంగా విచారణ చేసిందని రఘురామ ఆరోపించారు.
విదేశాలనుంచి, బోగస్ కంపెనీలనుంచి జగన్ కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడులపై దర్యాప్తు చేయకుండా ఈడీ, ఐటీ శాఖలకు లేఖ రాసి చేతులు దులుపుకుందని తన పిటిషన్లో పేర్కొన్నారు. 2004లో రూ.11 లక్షల ఆదాయమున్న జగన్ 2009లో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయేనాటికి రూ.43 వేల కోట్లు ఆర్జించారని ఆ పిటిషన్లో ఆరోపించారు. హౌరా, కోల్కతా, గువాహటిల్లోని 16 చిన్న కంపెనీల నుంచి రూ.195.70 కోట్ల పెట్టుబడులు ‘జగతి’లోకి వచ్చాయని, వాటిపై ఐటీ, ఈడీలకు లేఖ రాసి సీబీఐ సరిపెట్టిందని ఆరోపించారు.
This post was last modified on March 8, 2022 5:40 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…