వైసీపీ మహిళా నేత, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి మావోయిస్టులు హెచ్చరిక లేఖ రాశారు. లేటరైట్ మైనింగ్ ముసుగులో బాక్సైట్ అక్రమ తవ్వకాలను భాగ్యలక్ష్మి ప్రోత్సహిస్తున్నారని మావోలు ఆ లేఖలో సంచలన ఆరోపణలు చేశారు. భాగ్యలక్ష్మి వెంటనే తన పదవికి రాజీనామా చేసి మన్యం విడిచి వెళ్లాలని వార్నింగ్ ఇచ్చారు.
మన్యంలోని జీకే వీధి మండలం చాపరాతిపాలెంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ఆపేయాలని హెచ్చరించారు. తమ వార్నింగ్ ను భాగ్యలక్ష్మి పట్టించుకోకపోతే సివేరి సోమ, కిడారి సర్వేశ్వరరావులకు పట్టిన గతే పడుతుందని, ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ పేరుతో ఈ లేఖ విడుదలయింది.
కాగా, వైసీపీ నేతలు ఖనిజ సంపదను దోచుకుతింటున్నారని, మన్యంలో వైసీపీ మాఫియా బాక్సైట్ అక్రమ మైనింగ్ ప్రాంతానికి ఎవరినీ రానీయకుండా హెచ్చరిక బోర్డులు పెట్టి మరీ బెదిరిస్తున్నారని గతంలో టీడీపీ నేతలు ఆరోపించారు. మన్యంలో రూ.15 వేల కోట్ల విలువైన బాక్సైట్ అక్రమ మైనింగ్ చేసి అడవిని నాశనం చేస్తున్నారని ఆరోపించారు.
వైసీపీ మైనింగ్ మాఫియా ఎంత అడవిని నాశనం చేసిందో గూగుల్ శాటిలైట్ ఫోటోలతో సహా బట్టబయలు చేసింది. అయితే, ఈ వ్యవహారంపై గత ఏడాది మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ క్లారిటీ ఇచ్చారు. అక్కడంతా లాటరైట్ మైనింగ్ జరుగుతోందని, బాక్సైట్ మైనింగ్ కాదని ప్రెస్ మీట్ పెట్టి మరీ వెల్లడించారు. మరి, తాజాగా మావోల బెదిరింపు లేఖపై ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, జగన్ రియాక్షన్ ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on March 8, 2022 2:20 pm
తమిళ నటే అయినప్పటికీ తెలుగులోనూ పలు బ్లాక్ బస్టర్లలో పాలు పంచుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ కు మంచి ఫాలోయింగ్…
ఇదేదో బంపర్ అఫర్ లా ఉందే అని ఆశ్చర్యపోతున్నాారా ? అందరూ అదే అనుకుంటున్నారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి…
భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో అబ్ కీ బార్ .. చార్ సౌ పార్ నినాదంతో దేశంలో ఎన్నికల…
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…