YS Jagan Mohan Reddy
మొత్తానికి ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న జీవో రానే వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో గత ఏడాది అనూహ్యంగా తగ్గించి పడేసిన టికెట్ల రేట్లను పెంచుతూ, అలాగే ఐదో షోకు అనుమతి ఇస్తూ జగన్ సర్కారు జీవో జారీ చేసింది. సరిగ్గా భీమ్లా నాయక్ సెకండ్ వీకెండ్ పూర్తి చేసుకుని, దాదాపుగా దాని థియేట్రికల్ రన్ ముగుస్తున్న తరుణంలో ఈ జీవోపై సీఎం జగన్ సంతకం చేయడం విశేషం. దీన్ని బట్టి భీమ్లా నాయక్కు ప్రయోజనం చేకూడన్న ఉద్దేశంతోనే ఈ జీవోను ఇన్ని రోజులు ఆపారని, అది తప్ప వేరే కారణం లేదన్నది స్పష్టం.
తనను కలిసి టికెట్ల రేట్లు పెంచాలని కోరిన బృందంలో ప్రభాస్ కూడా ఉండటంతో ఈ శుక్రవారం రిలీజయ్యే అతడి సినిమా రాధేశ్యామ్కు లాభం చేకూర్చేలా.. దాని టికెట్ల బుకింగ్స్ మొదలవుతున్న తరుణంలోనే ఈ జీవో ఇవ్వడం గమనార్హం.
ఐతే టికెట్ల రేట్లను సవరిస్తూ.. ఇండస్ట్రీ కోరుకున్న స్థాయిలోనే రేట్లను పెంచారు. అవి అందరికీ రీజనబుల్గానే అనిపిస్తున్నాయి.
కానీ ఇన్నాళ్లూ సీఎం జగన్ సహా వైసీపీ నాయకులందరూ పాడిన పాట గురించి ప్రస్తావించాలి. నిత్యావసరాలు సహా అన్ని ధరలూ ఇంతగా పెరిగిన సమయంలో.. సినిమా టికెట్ల రేట్లను ఇంత తగ్గించేయడం ఏంటి, థియేటర్ల మెయింటైనెన్స్ కూడా కష్టమవుతోందని సినీ జనాలు గగ్గోలు పెడితే.. పేదల కోసమే ఈ రేట్ల తగ్గింపని, పేదోళ్లు సినిమాలు చూడకూడదా అని దబాయిస్తూ మాట్లాడారు వైసీపీ నేతలు.
స్వయంగా సీఎం జగనే ఓ సభలో పేదల కోసం రేట్లు తగ్గిస్తే దాన్ని కూడా తప్పుబడుతున్నారంటూ వాదించారు. ఇన్నాళ్లూ ఈ వాదన చేసి ఇప్పుడు మాత్రం రేట్లు పెంచేస్తే పేదలు సినిమాలు చూడటం ఎలా మరి? అంటే కేవలం పవన్ కళ్యాణ్ను ఇబ్బంది పెట్టడానికి, సినీ పెద్దలందరూ వచ్చి తమను వేడుకునేలా చేయడానికి మాత్రమే రేట్లు తగ్గించారన్నమాట. పవన్ సినిమాలను దెబ్బ తీసి, ఇండస్ట్రీ జనాల్ని చెప్పుచేతుల్లో పెట్టుకున్నాక టికెట్లు రేట్లు పెంచడానికి ఓకే అన్నమాట.పేదల కోసం టికెట్ల రేట్లు తగ్గించామనడం బూటకమన్నమాట.
This post was last modified on March 8, 2022 9:22 am
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…
నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…