ఢిల్లీకి చేరువలో ఉన్న పంజాబ్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం కోల్పోతోందని ఎగ్జిట్ పోల్ సర్వేలు తేల్చి చెప్పాయి. ఈ రాష్ట్రాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంటున్నట్టు పేర్కొన్నాయి. తాజాగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఈ క్రమంలో పంజాబ్లో ప్రజలు ఆప్ పార్టీకి భారీ మెజారిటీ కట్టబెట్టారని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు పెట్టుకున్న ఆశలు ఇక్కడ ప్రజలు పట్టించుకోలేదు. మినీ సార్వత్రిక సమరంగా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. అంతకుముందే.. ఫలితాల ధోరణిని అంచనా వేస్తూ విశ్లేషిస్తూ ఎగ్జిట్ పోల్స్.. అధికారం ఎవరిదోనని చెప్పేస్తాయి.
సర్వేల ద్వారా ఓటర్ల నాడిని పసిగడతాయి. తాజాగా ఈ ఫలితాలు వెలువడ్డాయి. పంజాబ్ విషయానికి వస్తే.. అన్ని ఎగ్జిట్పోల్ సర్వేలు.. కూడా ఇక్కడ ఆప్ పార్టీ ఏకపక్షంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందని.. హంగ్ ఏర్పడే అవకాశం లేదని తేల్చి చెప్పాయి. అదే సమయంలో కాంగ్రెస్ అధికారం కోల్పోవడం కాయమని ఎగ్జిట్ పోల్ సర్వే అంచనా వేసింది. అయితే.. ప్రధాన పోటీ మాత్రం ఆప్-కాంగ్రెస్ ల మధ్యే ఉంది. ఈ ఫలితాలు.. ఎలా ఉన్నాయంటే..
పంజాబ్లో స్థానాలు-117
ఏబీపీ – సీ ఓటర్
ఆప్ 51-61
కాంగ్రెస్ 22-28
అకాలీదళ్+ 20-26
బీజేపీ+ 7-13
ఇతరులు 1-5
యాక్సిస్ మై ఇండియా
ఆప్ 76-90
కాంగ్రెస్ 19-31
అకాలీదళ్+ 7-11
బీజేపీ+ 1-4
ఇతరులు 0-2
జన్ కీ బాత్
ఆప్ 60-84
కాంగ్రెస్ 18-31
అకాలీదళ్+ 12-19
బీజేపీ+ 3-7
ఇతరులు 0
ఇండియా టుడే
ఆప్ 76-90
కాంగ్రెస్ 19-31
అకాలీదళ్+ 0
బీజేపీ+ 0
పీ మార్క్
ఆప్ 62-70
కాంగ్రెస్ 23-31
అకాలీదళ్+ 16-24
బీజేపీ+ 1-3
ఇతరులు 1-3
ఆత్మసాక్షి
ఆప్ 34-38
కాంగ్రెస్ 58-61
అకాలీదళ్+ 18-21
బీజేపీ+ 4-5
ఇతరులు 0
This post was last modified on March 8, 2022 8:36 am
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు వస్తుందంటే సోషల్ మీడియాలో రచ్చ మామూలుగా ఉండదు. ఏప్రిల్ 8వ తేదీ కోసం…
టాలీవుడ్ మరో మంచి ఫ్రైడే కోసం ఎదురు చూస్తున్న టైంలో కంటెంట్ నమ్ముకున్న రెండు సినిమాలు ఇవాళ థియేటర్లలో అడుగు…
ఏపీ రాజధాని అమరావతిని శాశ్వితం చేస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఆ ఆనందకర సమయంలో గతంలో అమరావతి…
రూల్స్ ను బ్రేక్ చేసే విషయంలో వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని ట్రాక్ రికార్డు లెక్కే…
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…