ఢిల్లీకి చేరువలో ఉన్న పంజాబ్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం కోల్పోతోందని ఎగ్జిట్ పోల్ సర్వేలు తేల్చి చెప్పాయి. ఈ రాష్ట్రాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంటున్నట్టు పేర్కొన్నాయి. తాజాగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఈ క్రమంలో పంజాబ్లో ప్రజలు ఆప్ పార్టీకి భారీ మెజారిటీ కట్టబెట్టారని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు పెట్టుకున్న ఆశలు ఇక్కడ ప్రజలు పట్టించుకోలేదు. మినీ సార్వత్రిక సమరంగా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. అంతకుముందే.. ఫలితాల ధోరణిని అంచనా వేస్తూ విశ్లేషిస్తూ ఎగ్జిట్ పోల్స్.. అధికారం ఎవరిదోనని చెప్పేస్తాయి.
సర్వేల ద్వారా ఓటర్ల నాడిని పసిగడతాయి. తాజాగా ఈ ఫలితాలు వెలువడ్డాయి. పంజాబ్ విషయానికి వస్తే.. అన్ని ఎగ్జిట్పోల్ సర్వేలు.. కూడా ఇక్కడ ఆప్ పార్టీ ఏకపక్షంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందని.. హంగ్ ఏర్పడే అవకాశం లేదని తేల్చి చెప్పాయి. అదే సమయంలో కాంగ్రెస్ అధికారం కోల్పోవడం కాయమని ఎగ్జిట్ పోల్ సర్వే అంచనా వేసింది. అయితే.. ప్రధాన పోటీ మాత్రం ఆప్-కాంగ్రెస్ ల మధ్యే ఉంది. ఈ ఫలితాలు.. ఎలా ఉన్నాయంటే..
పంజాబ్లో స్థానాలు-117
ఏబీపీ – సీ ఓటర్
ఆప్ 51-61
కాంగ్రెస్ 22-28
అకాలీదళ్+ 20-26
బీజేపీ+ 7-13
ఇతరులు 1-5
యాక్సిస్ మై ఇండియా
ఆప్ 76-90
కాంగ్రెస్ 19-31
అకాలీదళ్+ 7-11
బీజేపీ+ 1-4
ఇతరులు 0-2
జన్ కీ బాత్
ఆప్ 60-84
కాంగ్రెస్ 18-31
అకాలీదళ్+ 12-19
బీజేపీ+ 3-7
ఇతరులు 0
ఇండియా టుడే
ఆప్ 76-90
కాంగ్రెస్ 19-31
అకాలీదళ్+ 0
బీజేపీ+ 0
పీ మార్క్
ఆప్ 62-70
కాంగ్రెస్ 23-31
అకాలీదళ్+ 16-24
బీజేపీ+ 1-3
ఇతరులు 1-3
ఆత్మసాక్షి
ఆప్ 34-38
కాంగ్రెస్ 58-61
అకాలీదళ్+ 18-21
బీజేపీ+ 4-5
ఇతరులు 0
This post was last modified on March 8, 2022 8:36 am
ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…
ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…
మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా మనిషైనా జనాలకు త్వరగా చేరాలంటే పబ్లిసిటీ అవసరం. లేదంటే ఉనికిని చాటుకోవడం కష్టం. సినిమాలకు…
రాజమండ్రి జైలు నుంచి 18 రోజుల రిమాండ్ అనంతరం విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరుకు ర్యాలీగా బయలుదేరగా…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘దురంధర్-2’ ఒకటనడంలో సందేహం లేదు. గత ఏడాది ఓ మోస్తరు అంచనాల మధ్య…