ఢిల్లీకి చేరువలో ఉన్న పంజాబ్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం కోల్పోతోందని ఎగ్జిట్ పోల్ సర్వేలు తేల్చి చెప్పాయి. ఈ రాష్ట్రాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంటున్నట్టు పేర్కొన్నాయి. తాజాగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఈ క్రమంలో పంజాబ్లో ప్రజలు ఆప్ పార్టీకి భారీ మెజారిటీ కట్టబెట్టారని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు పెట్టుకున్న ఆశలు ఇక్కడ ప్రజలు పట్టించుకోలేదు. మినీ సార్వత్రిక సమరంగా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. అంతకుముందే.. ఫలితాల ధోరణిని అంచనా వేస్తూ విశ్లేషిస్తూ ఎగ్జిట్ పోల్స్.. అధికారం ఎవరిదోనని చెప్పేస్తాయి.
సర్వేల ద్వారా ఓటర్ల నాడిని పసిగడతాయి. తాజాగా ఈ ఫలితాలు వెలువడ్డాయి. పంజాబ్ విషయానికి వస్తే.. అన్ని ఎగ్జిట్పోల్ సర్వేలు.. కూడా ఇక్కడ ఆప్ పార్టీ ఏకపక్షంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందని.. హంగ్ ఏర్పడే అవకాశం లేదని తేల్చి చెప్పాయి. అదే సమయంలో కాంగ్రెస్ అధికారం కోల్పోవడం కాయమని ఎగ్జిట్ పోల్ సర్వే అంచనా వేసింది. అయితే.. ప్రధాన పోటీ మాత్రం ఆప్-కాంగ్రెస్ ల మధ్యే ఉంది. ఈ ఫలితాలు.. ఎలా ఉన్నాయంటే..
పంజాబ్లో స్థానాలు-117
ఏబీపీ – సీ ఓటర్
ఆప్ 51-61
కాంగ్రెస్ 22-28
అకాలీదళ్+ 20-26
బీజేపీ+ 7-13
ఇతరులు 1-5
యాక్సిస్ మై ఇండియా
ఆప్ 76-90
కాంగ్రెస్ 19-31
అకాలీదళ్+ 7-11
బీజేపీ+ 1-4
ఇతరులు 0-2
జన్ కీ బాత్
ఆప్ 60-84
కాంగ్రెస్ 18-31
అకాలీదళ్+ 12-19
బీజేపీ+ 3-7
ఇతరులు 0
ఇండియా టుడే
ఆప్ 76-90
కాంగ్రెస్ 19-31
అకాలీదళ్+ 0
బీజేపీ+ 0
పీ మార్క్
ఆప్ 62-70
కాంగ్రెస్ 23-31
అకాలీదళ్+ 16-24
బీజేపీ+ 1-3
ఇతరులు 1-3
ఆత్మసాక్షి
ఆప్ 34-38
కాంగ్రెస్ 58-61
అకాలీదళ్+ 18-21
బీజేపీ+ 4-5
ఇతరులు 0
This post was last modified on March 8, 2022 8:36 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…