సీఎం జగన్ అధ్యక్షతన నేడు జరిగిన కేబినెట్ సమావేశం జరిగింది.ఈ నెల 3ననే జరగాల్సి ఉన్న ఈ కేబినెట్ భేటీ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పెద్ద కర్మ నేపథ్యంలో నేటికి వాయిదా పడింది. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో 35 అంశాలతో కూడిన అజెండాపై మంత్రులతో జగన్ చర్చ జరిపారు. ఇక, ఈ నెల 25 వరకు మొత్తం 13 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని, 11న రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు.
బీఏసీ సమావేశం అనంతరం మధ్యాహ్నం జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలను పరిశీలించి….కీలక చట్టాలకు సవరణలు చేశారు. విదేశీ మద్యం నియంత్రణ చట్టానికి సవరణ చేయడంతోపాటు టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుల నియామకం కోసం హిందూ ధార్మిక సంస్థల చట్టానికి సవరణ చేయాలని నిర్ణయించింది.
టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులలో కొంతమంది నేర చరితులున్నారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏకంగా హిందూ ధార్మిక సంస్థల చట్టానికే సవరణ చేయాలని నిర్ణయించడం విశేషం. ఇక, ఏపీలో రెండో భాషగా ఉర్దూ భాషను గుర్తించేందుకుగాను ఏపీ అధికార భాషా చట్టం 1966కు సవరణ చేయాలని నిర్ణయించింది.
నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాల ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మచిలీపట్నం, భావనపాడు, రామాయపట్నం పోర్టుల నిర్మాణానికి రూ.8,741కోట్ల రుణ సమీకరణ చేయాలని, అందుకోసం ఏపీ మారిటైం బోర్డుకు హామీ ఇచ్చేందుకూ కేబినెట్ అంగీకరించింది. మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులకు రూ.214 కోట్లను కేబినెట్ కేటాయించింది.
This post was last modified on March 8, 2022 8:22 am
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…
నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…