సీఎం జగన్ అధ్యక్షతన నేడు జరిగిన కేబినెట్ సమావేశం జరిగింది.ఈ నెల 3ననే జరగాల్సి ఉన్న ఈ కేబినెట్ భేటీ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పెద్ద కర్మ నేపథ్యంలో నేటికి వాయిదా పడింది. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో 35 అంశాలతో కూడిన అజెండాపై మంత్రులతో జగన్ చర్చ జరిపారు. ఇక, ఈ నెల 25 వరకు మొత్తం 13 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని, 11న రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు.
బీఏసీ సమావేశం అనంతరం మధ్యాహ్నం జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలను పరిశీలించి….కీలక చట్టాలకు సవరణలు చేశారు. విదేశీ మద్యం నియంత్రణ చట్టానికి సవరణ చేయడంతోపాటు టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుల నియామకం కోసం హిందూ ధార్మిక సంస్థల చట్టానికి సవరణ చేయాలని నిర్ణయించింది.
టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులలో కొంతమంది నేర చరితులున్నారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏకంగా హిందూ ధార్మిక సంస్థల చట్టానికే సవరణ చేయాలని నిర్ణయించడం విశేషం. ఇక, ఏపీలో రెండో భాషగా ఉర్దూ భాషను గుర్తించేందుకుగాను ఏపీ అధికార భాషా చట్టం 1966కు సవరణ చేయాలని నిర్ణయించింది.
నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాల ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మచిలీపట్నం, భావనపాడు, రామాయపట్నం పోర్టుల నిర్మాణానికి రూ.8,741కోట్ల రుణ సమీకరణ చేయాలని, అందుకోసం ఏపీ మారిటైం బోర్డుకు హామీ ఇచ్చేందుకూ కేబినెట్ అంగీకరించింది. మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులకు రూ.214 కోట్లను కేబినెట్ కేటాయించింది.
This post was last modified on March 8, 2022 8:22 am
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…