గత ఎన్నికల్లో వైసీపీ తరపున ఎంపీగా గెలిచినప్పటి నుంచి రఘురామ కృష్ణం రాజు సొంత పార్టీకే పక్కలో బళ్లెంలా మారారు. రెబల్ ఎంపీగా మారి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూనే ఉన్నారు. వివిధ చర్యలతో జగన్ను ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై వేటు వేయాలని లోక్సభ స్పీకర్కు వైసీపీ చేసిన ఫిర్యాదు ఇంకా పెండింగ్లో ఉంది. త్వరలోనే దానిపై ఓ నిర్ణయం తీసుకుంటే రఘురామపై సస్పెన్షన్ వేటు పడుతుందనే ప్రచారం సాగుతోంది. అందుకే అంతకంటే ముందే రాజీనామా చేసి ఉప ఎన్నికలో గెలిచి చూపిస్తానని రఘురామ ఇప్పటికే ప్రకటించారు.
నరసాపురం నుంచి గెలిచిన ఆయన ఫిబ్రవరి 5వ తేదీ తర్వాత రాజీనామా చేస్తానని ప్రకటించారు. అప్పటిలోపు తనపై అనర్హత వేటు వేయించాలని కూడా సవాలు విసిరారు. ఆయన తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరతారనే టాక్ బలంగా వినిపించింది. ఆ పార్టీ నుంచే ఆయన ఉప ఎన్నికలో పోటీ చేస్తారని తెలిసింది.
అందుకోసం ఇప్పటికే ఢిల్లీలోని బీజేపీ పెద్దలను చాలా సార్లు ఆయన కలిశారు. కానీ ఇప్పటివరకూ రఘురామ రాజీనామా చేయకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన బీజేపీలో చేరేందుకు ఇంకా హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని సమాచారం. ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు ప్రయత్నాల్లో కేసీఆర్ ఉండడంతో ఆ పార్టీ అగ్రనేతలు ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.
కేవలం రఘురామ ఒక్కడి కోసం వైసీపీని ఎందుకు దూరం చేసుకోవడం అని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అందుకు ఆయన్ని పార్టీలో చేర్చుకునే విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదని అంటున్నారు. పార్లమెంట్ బడ్జెట్ తొలి విడత సమావేశాలు ముగిసిన వెంటనే ఆయన రాజీనామా చేస్తారని అనుకున్నారు. కానీ బీజేపీ నుంచి ఎలాంటి భరోసా రాకపోవడంతోనే ఆయన వెయిట్ చేస్తున్నారని ఇప్పుడు తెలిసింది. రెండో విడత సమావేశాలు ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 8 వరకు జరుగుతాయి. అవి ముగిసిన తర్వాత ఆయన రాజీనామా చేసే అవకాశం ఉంది. అప్పటి వరకూ బీజేపీ నుంచి ఎలాంటి సిగ్నల్ రాకపోతే ఆయన జనసేనలో చేరే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది. జనసేనలో చేరయినా ఉప ఎన్నికలో పోటీ చేస్తానని రాజీనామా చేయడం మాత్రం ఖాయమని ఆయన తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు తెలిసింది.
This post was last modified on March 7, 2022 8:00 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…