Political News

బీజేపీ నుంచి సిగ్న‌ల్ రాలేదా?

గత ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున ఎంపీగా గెలిచిన‌ప్ప‌టి నుంచి ర‌ఘురామ కృష్ణం రాజు సొంత పార్టీకే ప‌క్క‌లో బ‌ళ్లెంలా మారారు. రెబ‌ల్ ఎంపీగా మారి జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నారు. ప్ర‌భుత్వ విధానాల‌ను ప్ర‌శ్నిస్తూనే ఉన్నారు. వివిధ చ‌ర్య‌ల‌తో జ‌గ‌న్‌ను ఇర‌కాటంలోకి నెట్టే ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తూనే ఉన్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌పై వేటు వేయాల‌ని లోక్‌స‌భ స్పీక‌ర్‌కు వైసీపీ చేసిన ఫిర్యాదు ఇంకా పెండింగ్‌లో ఉంది. త్వ‌ర‌లోనే దానిపై ఓ నిర్ణ‌యం తీసుకుంటే ర‌ఘురామ‌పై స‌స్పెన్ష‌న్ వేటు ప‌డుతుంద‌నే ప్ర‌చారం సాగుతోంది. అందుకే అంత‌కంటే ముందే రాజీనామా చేసి ఉప ఎన్నిక‌లో గెలిచి చూపిస్తాన‌ని ర‌ఘురామ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.

న‌ర‌సాపురం నుంచి గెలిచిన ఆయ‌న ఫిబ్ర‌వరి 5వ తేదీ త‌ర్వాత రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. అప్ప‌టిలోపు త‌న‌పై అన‌ర్హత వేటు వేయించాల‌ని కూడా స‌వాలు విసిరారు. ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి బీజేపీలో చేర‌తార‌నే టాక్ బ‌లంగా వినిపించింది. ఆ పార్టీ నుంచే ఆయ‌న ఉప ఎన్నిక‌లో పోటీ చేస్తార‌ని తెలిసింది.

అందుకోసం ఇప్ప‌టికే ఢిల్లీలోని బీజేపీ పెద్ద‌ల‌ను చాలా సార్లు ఆయ‌న క‌లిశారు. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ ర‌ఘురామ రాజీనామా చేయ‌క‌పోవ‌డంపై సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆయ‌న బీజేపీలో చేరేందుకు ఇంకా హైక‌మాండ్ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రాలేద‌ని స‌మాచారం. ముఖ్యంగా బీజేపీకి వ్య‌తిరేకంగా కూటమి ఏర్పాటు ప్ర‌య‌త్నాల్లో కేసీఆర్ ఉండ‌డంతో ఆ పార్టీ అగ్ర‌నేత‌లు ఆలోచ‌న‌లో ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది.

కేవ‌లం రఘురామ ఒక్క‌డి కోసం వైసీపీని ఎందుకు దూరం చేసుకోవ‌డం అని బీజేపీ నాయ‌క‌త్వం భావిస్తున్న‌ట్లు తెలిసింది. అందుకు ఆయ‌న్ని పార్టీలో చేర్చుకునే విష‌యంపై ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేద‌ని అంటున్నారు. పార్ల‌మెంట్ బ‌డ్జెట్ తొలి విడ‌త స‌మావేశాలు ముగిసిన వెంట‌నే ఆయ‌న రాజీనామా చేస్తార‌ని అనుకున్నారు. కానీ బీజేపీ నుంచి ఎలాంటి భ‌రోసా రాక‌పోవ‌డంతోనే ఆయ‌న వెయిట్ చేస్తున్నార‌ని ఇప్పుడు తెలిసింది. రెండో విడ‌త స‌మావేశాలు ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 8 వ‌ర‌కు జ‌రుగుతాయి. అవి ముగిసిన త‌ర్వాత ఆయ‌న రాజీనామా చేసే అవ‌కాశం ఉంది. అప్ప‌టి వ‌ర‌కూ బీజేపీ నుంచి ఎలాంటి సిగ్న‌ల్ రాక‌పోతే ఆయ‌న జ‌న‌సేన‌లో చేరే అవ‌కాశాలున్న‌ట్లు క‌నిపిస్తోంది. జ‌న‌సేన‌లో చేర‌యినా ఉప ఎన్నిక‌లో పోటీ చేస్తాన‌ని రాజీనామా చేయ‌డం మాత్రం ఖాయ‌మ‌ని ఆయ‌న త‌న స‌న్నిహితుల వ‌ద్ద చెప్పిన‌ట్లు తెలిసింది. 

This post was last modified on March 7, 2022 8:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

1 hour ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

6 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

6 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

9 hours ago