Political News

ఇవి తేలితే.. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల‌పై క్లారిటీ!

దేశ‌వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల స‌మ‌రం ముగింపు దిశగా సాగుతోంది. ఈ నెల 10న ఫ‌లితాలు విడుద‌ల కానున్నాయి. దీంతో పార్టీల భవిష్య‌త్ ఏమిట‌న్న‌ది తేలుతుంది. ఆయా రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారాన్ని ద‌క్కించుకోబోతుంద‌న్న విష‌యంపై స్ప‌ష్టత‌ వ‌స్తుంది. అయితే ముఖ్యమంత్రుల భ‌వితవ్యాన్నే కాదు.. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు తదుప‌రి రాష్ట్రప‌తిని నిర్ణ‌యించ‌డంలోనూ అత్యంత కీల‌కం కానున్నాయి. జులై 24తో ప్ర‌స్తుత రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ ప‌ద‌వీ కాలం ముగుస్తుంది. ఈ నేప‌థ్యంలో ఇటు బీజేపీ సార‌థ్యంలోని ఎన్డీయే కూట‌మి.. అటు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూట‌మి ఈ రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో స‌త్తాచాటేందుకు ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తులు చేస్తున్నాయి.

ఈ ఫ‌లితాల‌తో..
రాష్ట్రప‌తి ఎన్నిక‌ల నేప‌థ్యంలో అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఆస‌క్తి పెరిగింది. ఉత్త‌రప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌, పంజాబ్‌, మ‌ణిపూర్‌, గోవా ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించే పార్టీల మెజార్టీని బ‌ట్టే రాష్ట్రప‌తి ఎన్నిక‌ల ఫ‌లితం ఆధార‌ప‌డి ఉంటుంది. రాష్ట్రప‌తి ప‌ద‌వికి జ‌రిగే ప‌రోక్ష ఎన్నిక‌ల్లో ఓట్ల సంఖ్య కంటే కూడా ఓటు విలువ ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో పాల్గొనే ఎల‌క్టోర‌ల్ కాలేజ్‌లో పార్ల‌మెంటులోని ఉభ‌య స‌భ‌ల‌కు ఎన్నికైన ఎంపీలు, అన్ని రాష్ట్రాలు, అసెంబ్లీలు ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాల్లోని శాస‌నస‌భ్యులు ఉంటారు. ప్ర‌స్తుతం పార్ల‌మెంలు, శాస‌న‌స‌భల్లో ఎన్డీయే కూట‌మికి ఉన్న ప్ర‌జాప్ర‌తినిధుల సంఖ్య‌ను బ‌ట్టి వారి మొత్తం ఓటు విలువ 50 శాతానికి కాస్త త‌క్కువ‌గానే ఉంది. అయినా ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో త‌మ అభ్య‌ర్థిని రాష్ట్రప‌తిగా గెలిపించుకోవ‌డాన‌కి బీజేపీ పెద్ద‌గా ఇబ్బందులు ఎదురు కాక‌పోవ‌చ్చు.

కానీ అక్క‌డ ఓడితే..
రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో త‌మ అభ్య‌ర్థిని గెలిపించుకోవాల‌ని చూస్తున్న ఎన్డీయే కూట‌మికి ఒక‌వేళ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో బీజేపీ భారీ సీట్ల తేడాతో ఓడిపోతే ప‌రిస్థితి తారుమార‌య్యే అవ‌కాశం ఉంది. అప్పుడు బీజేపీకి ఇత‌ర పార్టీల మ‌ద్ద‌తు అవ‌స‌రం అవుతుంది. అప్పుడు ఎంపీల బ‌లం ఎక్కువ‌గా ఉన్న బిజూ జ‌న‌తాద‌ళ్‌, టీఆర్ఎస్‌, వైసీపీ లాంటి పార్టీల పాత్ర కీల‌కంగా మారుతుంది.

అయితే బీజేపీ వ్య‌తిరేక కూటమి కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ ఇత‌ర పార్టీల‌ను క‌లుపుకోవ‌డానికి తీవ్ర కృషి చేస్తున్న నేప‌థ్యంలో ఈ సారి రాష్ట్రప‌తి ఎన్నిక మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మార‌నుంది. ఈ నేప‌థ్యంలో ఈ అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో బీజేపీకి మెరుగైన ఫ‌లితాలు రావాల్సిన అవ‌స‌రం ఉంది. ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువను చూస్తే.. యూపీ (208) లో గ‌రిష్ఠంగా ఉంది. ఆ త‌ర్వాత పంజాబ్ (116), ఉత్త‌రాఖండ్ (64), గోవా (20), మ‌ణిపూర్ (18) ఉన్నాయి. వీటిని ఆ రాష్ట్రాల్లోని ఎమ్మెల్యే సీట్ల సంఖ్య‌లో గుణిస్తే మొత్తం శాస‌న స‌భ ఓటు విలువ వ‌స్తుంది. దేశంలోనే అత్య‌ధిక ఎమ్మెల్యే సీట్లు (403) ఉన్న యూపీ ఈ విలువ‌లో ముందు వ‌రుసలో ఉంది. కాబ‌ట్టి ఇక్క‌డ బీజేపీ మ‌రోసారి అధికారంలోకి రావ‌డం ఆ పార్టీకి అవ‌స‌రం. 

This post was last modified on March 7, 2022 1:38 pm

Share

Recent Posts

హిందీ డబ్బింగ్ దమ్మేంటో చెప్పిన నాగ్

ఒక‌ప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావ‌డం, ఇక్క‌డ పెద్ద స్థాయిలో రిలీజ్ కావ‌డ‌మే ఉండేది త‌ప్ప‌.. తెలుగు చిత్రాలు…

3 hours ago

య‌శ్‌ను భ‌య‌పెట్టేసిన మ‌ల్లారెడ్డి

మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెర‌వాల్సిందే. అది రాజ‌కీయ స‌భ అయినా.. సినిమా…

4 hours ago

అక్కడ ఒక్కో కోతి 25 లక్షలు

మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…

5 hours ago

చిరు బ‌ర్త్ డే… ట్రెండింగ్ లో మాత్రం బన్నీ..

అల్లు అర్జున్ అంటే ఒక‌ప్పుడు మెగా హీరోల్లో ఒక‌డు. అత‌ను మెగాస్టార్ చిరంజీవినో, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌నో పొగిడితేనో..…

5 hours ago

విశ్వనాథ్ తట్టుకుని నిలవడం విశేషమే

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి తప్ప మరొక మాట వినిపించదేమో అన్న రేంజ్ లో వసూళ్లు హోరెత్తిపోతున్నాయి. ఈ జోరు…

5 hours ago

2000 కోట్లు అంటే చాలా పెద్ద స్టేట్‌మెంట్

ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి యునివర్సిటిలో ఘనంగా జరిగింది. తెలుగు…

5 hours ago