Political News

‘జగన్ ను మోడీ తండ్రిలా అప్యాయంగా చూసుకుంటారు’

అడిగిన దానికి అడిగినంత వరకు సమాధానం చెప్పటం కొంతమంది రాజకీయ నేతలకు అలవాటు. అందుకు భిన్నంగా అడిగిన దానికి అవసరం లేకున్నా సమాధానం చెబుతూ.. ఆ క్రమంలో మరింత సమాచారాన్ని అందించి రాజకీయ కాకకు కారణమవుతుంటారు మరికొందరు నేతలు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మొదటి కోవలోకి వస్తారు. ఆమెను ఎంతలా ఇరుకున పెట్టాలని చూసినా.. పప్పులు ఉడకవు. ఎంతవరకు సమాధానం ఇవ్వాలో అంతే ఇచ్చే ఆమె.. అనవసర వ్యాఖ్యలకు.. వివాదాలకు దూరంగా ఉంటారు. అలాంటి ఆమె నోటి నుంచి తాజాగా వచ్చిన వ్యాఖ్య ఒకటి షాకింగ్ గా కంటే కూడా సర్ ప్రైజింగ్ గా మారిందని చెప్పాలి.

తాజాగా అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నిర్మించే నాసిన్ క్యాంపస్ కు భూమి పూజ చేసేందుకు ఆమె ఏపీకి వచ్చారు. ఇక్కడ నాసిమ్ అంటే కాస్త క్లారిటీ ఇవ్వాలి. నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్.. ఇండైరెక్టు టాక్సెస్ అండ్ నార్కొటిక్స్ సంస్థ. ఇది చేసే పనేమిటంటే.. డెహ్రాడూన్ లో ఐఏఎస్ లకు.. ఐపీఎస్ లకు హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడమీ ఎలానో.. ఐఆర్ఎస్ (ఇండియన్ రెవెన్యూ సర్వీస్) లకు ఎంపికైన వారికి శిక్షణ ఇచ్చేందుకు ఈ కేంద్రం పని చేస్తుంది.

దీంతో.. ‘పాలసముద్రం’ మరింత ఫేమస్ కావాల్సి ఉంది. ఈ కేంద్రాన్ని అక్కడెక్కడో ఉన్న అనంత జిల్లాలో నిర్మించటానికి కారణం.. విభజన కారణంగా నష్టపోయిన ఏపీకి అందించే పరిహారాల్లో ఈ భవనం ఒకటి.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ఎలాంటి కష్టం రాకుండా ఉండాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు .ఏపీకి ఎలాంటి సమస్యలు వచ్చినా కేంద్రం తండ్రి స్థానంలో ఉంటూ ఆదుకుంటుందని.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ప్రధాని మోడీ తండ్రిలా అప్యాయంగా చూసుకుంటారని పేర్కొన్నారు.

అందుకే.. సీఎం జగన్ ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా సరే.. ఆయన్ను కాదనకుండా కలుస్తారని చెప్పారు. ఏపీ డెవలప్ మెంట్ కు ఎలాంటి సాయం చేయటానికైనా సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఏమైనా.. ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ సీఎం జగన్ కు ఉన్న సంబంధం నిర్మలమ్మ నోటి నుంచి వచ్చిన తీరు ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పాలి. మరి.. బీజేపీకి మిత్రుడి హోదాలో ఉన్న పవన్ కల్యాణ్ ను ప్రధాని మోడీ మరెలా చూసుకుంటారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పాలి.

This post was last modified on March 6, 2022 11:26 am

Share

Recent Posts

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

6 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

8 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

8 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

8 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

10 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

13 hours ago